E-Paper
Advertisement

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనాకు షాక్..

Arunachal Pradesh: అరుణాచల్‌ ప్రదేశ్‌పై అమెరికా కీలక వ్యాఖ్యలు.. చైనాకు షాక్..
Advertisement
Arunachal Pradesh
Arunachal Pradesh

Arunachal Pradesh: అరుణాచల్ ప్రదేశ్ విషయంలో భారత్- చైనా మధ్య రేగిన వివాదంపై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్ట చేసింది. చైనా వైఖరిని తప్పుపట్టింది. అరుణాచల్ ప్రదేశ్ విషయంలో డ్రాగన్ చర్యలను వ్యతిరేస్తున్నామని యూఎస్ విదేశాంగ శాఖ ప్రిన్సిపల్ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ ప్రకటించారు. వాస్తవాధీన రేఖలో చైనా చేస్తున్న ఆక్రమణ ప్రయత్నాలు సరికాదని హెచ్చరించారు.

అరుణాచల్ ప్రదేశ్ పై కన్నేసిన చైనా కొంతకాలంగా కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ఆ ప్రాంతం తమదేనని చైనా రక్షణశాఖ అధికార ప్రతినిధి సీనియర్ కర్నల్ ఝాంగ్ షియాంగాంగ్ కొన్ని రోజుల క్రితం మొండి వాదన చేశారు. చైనా కామెంట్స్ కు భారత్ దీటుగా బదులిచ్చింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని స్పష్టం చేసింది.

Advertisement

అరుణాచల్ లో ప్రదేశ్ చేపట్టిన అభివృద్ధి పనులను భారత్ వివరించింది. అక్కడ మౌలిక సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపింది. ఆ ప్రాంతంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలతో ప్రజలకు మేలు జరుగుతోందని భారత్ విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ ఇటీవల స్పష్టం చేశారు.

Also Read: నేడు అరవింద్ కేజ్రీవాల్ ఈడీ విచారణ .. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఢిల్లీ సీఎం..

Advertisement

భారత్ ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ లో పర్యటించారు. భారత్ – చైనా సరిహద్దులోని తవాంగ్ లో వెళ్లేందుకు ఉపయోగపడే సేలా సొరంగ మార్గాన్ని ప్రారంభించారు. సైనికులను, ఆయుధాలను తవాంగ్ కు తరలించేందుకు ఈ సొరంగ మార్గం ఉపయోగపడుతోంది. అయితే ఈ ప్రాంతంపైనే చైనా వక్రబుద్ధి చూపుతోంది. జాంగనన్ ప్రాంతాన్ని దక్షిణ టిబెట్ గా చెబుతోంది. అది తమ భూభాగమేనని చైనా వాదిస్తోంది.

Tags

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×