E-Paper
Advertisement

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..

Praneeth Rao Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. ప్రణీత్ రావు పిటిషన్ కొట్టివేసిన హైకోర్టు..
Advertisement
Praneeth Rao Case
Praneeth Rao Case

Telangana High Court (Telangana today news): ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావు కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. పోలీస్ కస్టడీని సవాల్ చేస్తూ ఆయన వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ప్రణీత్ రావు హైకోర్టు పిటిషన్ వేశారు. తనను కస్టడీకి అప్పగించే విషయంలో షరతులు విధించలేదని పిటిషన్ లో పేర్కొన్నారు. విచారణ విషయాలను మీడియాకు ఉద్దేశపూర్వకంగా విడుదల చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్ స్టేషన్ లోనూ సరైన సుదుపాయాలు లేవని పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రణీత్ రావు తరఫున సీనియర్ లాయర్ గండ్ర మోహనరావు వాదనలు వినిపించారు.

Advertisement

పోలీసులు తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు వాదనలు వినిపించారు. కింది కోర్టు ఆదేశాల ప్రకారమే కస్టడీలో ప్రణీత్ రావును పోలీసులు విచారణ చేస్తున్నారని తెలిపారు. ఆయనను ప్రశ్నిస్తున్న పోలీస్ స్టేషన్ లో అన్ని సౌకర్యాలున్నాయని వివరించారు. ఫోన్ ట్యాపింగ్ పై ఫిర్యాదు చేసిన ఏసీపీ రమేష్ కు ప్రణీత్ రావు కేసు దర్యాప్తుతో ఎలాంటి ప్రమేయం లేదని స్పష్టం చేశారు. ప్రణీత్ రావు కుటుంబ సభ్యులతోనూ ఫోన్ లో మాట్లాడుతున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు.

Also Read: రాడిసన్‌ డ్రగ్స్‌ కేసులో ప్రధాన నిందితులు అరెస్ట్.. రూ. కోటి విలువైన కారు స్వాధీనం..

Advertisement

ప్రణీత్ రావు దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నాగేశ్వరరావు కోరారు. ఇరుపపక్షాల వాదనలు విన్న తెలంగాణ హైకర్టు ప్రణీత్ రావు పిటిషన్ ను కొట్టివేసింది. ఇప్పటికే ప్రణీత్ రావు పోలీస్ కస్టడీ నాలుగు రోజులు పూర్తైంది. మరో 3 రోజుల ఆయనను పోలీసులు ప్రశ్నించనున్నారు.

Tags

Related News

తెలంగాణ సీఎం భద్రతా సమాచారం లీక్.. తెలుగు స్క్రైబ్ నిర్వాహకులపై కేసు, అసలేం జరిగింది?

రేవంత్‌ కేబినెట్‌లోకి మరో ఫైర్‌బ్రాండ్.. హైకమాండ్‌తో విజయశాంతి మంతనాలు, ఆ శాఖ కోసం పట్టు

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

Big Stories

Advertisement
×