E-Paper
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ

Uttarakhand  Tunnel Accident: ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం.. రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీ
Advertisement

Uttarakhand Tunnel Accident: ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. విష్ణుగడ్-పీపల్‌కోటి ప్రాంతంలో జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణ పనుల కోసం ఏర్పాటు చేసిన సొరంగంలో అర్ధరాత్రి రెండు లోకోమోటివ్ రైళ్లు ఢీకొన్నాయి. కార్మికులు షిఫ్ట్ మారుతున్న సమయంలో ఓ రైలు.. మెటీరియల్‌తో వస్తున్న మరో రైలుని ఢీ కొట్టింది.

ఉత్తరాఖండ్‌‌లోని టన్నెల్ సొరంగంలో పెను ప్రమాదం

Advertisement

ఈ ఘటనలో దాదాపు 60 మందికి పైగానే గాయపడినట్టు తెలుస్తోంది. మోనో రైళ్లు ఢీకొన్న సమయంలో ఓ రైలులో 109 మంది వరకు కార్మికులు ఉన్నారు. ఈ ఘటనతో సొరంగం లోపల కార్మికులు భయాందోళనకు గురయ్యారు. ఆ తర్వాత గట్టిగా కేకలు పెట్టారు. సొరంగం లోపల అంతా చీకటిగా ఉండడంతో ఏం జరిగిందో తెలియక కాసేపు గందరగోళానికి గురయ్యారు కార్మికులు.

ఈ ఘటనలో 60 మంది వరకు గాయపడినట్టు తెలుస్తోంది. 10 మందిని గోపేశ్వర్‌లో జిల్లా ఆసుపత్రికి, 17 మందిని పీపల్‌కోటిలోని వివేకానంద ఆసుపత్రికి అంబులెన్సుల్లో తరలించారు. మిగతావారికి టన్నెల్ బయటకు ప్రాథమిక చికిత్స అందించారు అధికారులు. మోనోరైలులో ఒకదాని బ్రేకులు ఫెయిల్ కావడంతో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం జరిగినట్టు ఆ ప్రాంతంలోని అధికారి మీడియాకు తెలిపారు.

Advertisement

ఢీ కొన్న రెండు లోకోమోటివ్ రైళ్లు 

ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న వెంటనే జిల్లా అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు ముమ్మరం చేశారు. సొరంగం లోపల చిక్కుకున్న కార్మికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ ప్రాణాపాయం లేదని తెలిపారు. పొడవైన సొరంగాల్లో కార్మికులు-మెటీరియల్‌ను తీసుకెళ్లడానికి లోకోమోటివ్ రైళ్లను ఉపయోగిస్తుంటారు.

సిగ్నల్ లోపమో, లేక మరేదైనా కారణమా? అనేది ఇంకా తెలీదు. అలకనంద నదిపై 444 మెగావాట్ల సామర్థ్యంతో విష్ణుగడ్-పీపల్‌కోటి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతోంది. వచ్చే ఏడాదికి పూర్తి చేయాలని లక్ష్యంగా అడుగులు వేస్తోంది నిర్మాణ కంపెనీ. అంతలోనే ఈ ఘటన జరిగింది.

ALSO READ:  జపాన్ ను అధిగమించిన భారత్.. ప్రపంచంలో నాలుగో ఆర్థిక వ్యవస్థ మనదే

 

 

Related News

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

వైద్యులపై దాడికి దిగితే.. కనికరం చూపొద్దు.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×