Bandla Ganesh:ప్రముఖ నటుడిగా, నిర్మాతగా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న బండ్ల గణేష్ (Bandla Ganesh).. ఈమధ్య సోషల్ మీడియాలో ఎక్కువగా ఆక్టివ్ గా ఉంటూ అటు సమాజంలో జరిగే విషయాలపై ఇటు సినీ ఇండస్ట్రీలో జరిగే విషయాలపై స్పందిస్తూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే..ఈ క్రమంలోనే నిన్న రెండవ నిర్మాణ సంస్థను ప్రారంభించినట్లు అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. బీజీ బ్లాక్ బాస్టర్స్ అంటూ ఒక ప్రొడక్షన్ హౌస్ స్థాపించాను అంటూ ఈ హౌస్ ద్వారా అన్ని సున్నితమైన కథలను ప్రేక్షకులకు అందిస్తానని చెప్పి అభిమానులను సంబరపరిచిన విషయం తెలిసిందే. అంతలోనే ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు బండ్ల గణేష్ . మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
తాజాగా తన ట్విట్టర్ వేదికగా ఒక సుదీర్ఘ పోస్టును పంచుకున్నారు బండ్ల గణేష్. విషయంలోకి వెళ్తే.. ఈరోజుతో 2025 సంవత్సరం ముగియనుంది. రేపటితో 2026 కొత్త సంవత్సరం ప్రారంభం కానుంది. ఈ క్రమంలోనే ఈ ఏడాది అనుభవాలను, జ్ఞాపకాలను వర్ణిస్తూ కొత్త సంవత్సరానికి వెల్కమ్ చెబుతూ ఒక పోస్ట్ పెట్టారు బండ్ల గణేష్.
2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారి ద్రవిస్తోంది. ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం మాత్రమే కాదు నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం. నా బ్రతుకుకి కొత్త అర్థాన్ని, కొత్త దారిని చూపించిన మహత్తర సమయం. నేను ఊహించనంత ప్రేమను, అండను, అద్భుతాలను నాకు ప్రసాదించిన సంవత్సరం. ముఖ్యంగా భగవంతుడే స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలోకి అడుగుపెట్టిన సమయం . ఇలాంటి దివ్యమైన రోజులు వెళ్ళిపోతున్నాయి అంటే ఎందుకో చెప్పలేనంత బాధ నాలో కలుగుతోంది.
also read:Meenakshi: మరోసారి సంక్రాంతి టార్గెట్ అంటున్న మీనాక్షి.. డబుల్ ట్రీట్!
భగవంతుడిని ఒకటే ప్రార్థిస్తున్నాను. 2025 సంవత్సరంలాగే ఆశ నింపే రోజులు, విశ్వాసాన్ని బలపరిచే సంఘటనలు, అలాగే నా సంకల్పాన్ని దృఢం చేసే అనుభవాలు రాబోయే ప్రతి సంవత్సరంలో కూడా నాతో పాటు మనందరికీ కూడా దక్కాలని.. అందరి జీవితాలలో వెలుగులు నిండాలని కోరుకుంటున్నాను. ఇదే నా హృదయపూర్వక సంకల్పం” అంటూ ట్వీట్ చేశారు బండ్ల గణేష్. మొత్తానికైతే 2025 సంవత్సరంలాగే తనతో పాటు ప్రతి ఒక్కరికి కూడా మంచి జరగాలని కోరుతూ చేసిన ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.
నటుడిగా కెరియర్ ను మొదలుపెట్టి.. ఆ తర్వాత కమెడియన్ గా , నిర్మాతగా మారిన బండ్ల గణేష్ ఆంజనేయులు, గబ్బర్ సింగ్ , తీన్మార్, గోవిందుడు అందరివాడేలే, నీ జతగా నేనుండాలి , ఇద్దరమ్మాయిలతో, బాద్ షా , టెంపర్ వంటి చిత్రాలకు నిర్మాతగా వ్యవహరించాడు. పరమేశ్వర ఆర్ట్ ప్రొడక్షన్ బ్యానర్ పై చివరిగా టెంపర్ చిత్రాన్ని నిర్మించిన ఈయన.. ఇప్పుడు బండ్ల గణేష్ బ్లాక్ బాస్టర్స్ అంటూ కొత్త నిర్మాణ సంస్థను స్థాపించారు . మరి వచ్చే ఏడాది ఈ బ్యానర్లో ఎలాంటి కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తారో చూడాలి.
**“2025 సంవత్సరం ముగుస్తోంది అనగానే నా హృదయం భారంగా మారుతోంది.
ఎందుకంటే ఇది కేవలం ఒక సంవత్సరం కాదు…
నా జీవితాన్ని తిరిగి రచించిన కాలం.
నా బతుకుకి కొత్త అర్థం, కొత్త దారి చూపించిన మహత్తర సమయం.భగవంతుడు స్వయంగా మనుషుల రూపంలో నా జీవితంలో అడుగుపెట్టి,
నేను ఊహించనంత ప్రేమను, అండను,…— BANDLA GANESH. (@ganeshbandla) December 31, 2025