E-Paper
Advertisement

Veer Bal Diwas 2025:మతం మారేది లేదు.. మరణానికైనా సిద్ధమే! సిక్కు బాలల సింహ గర్జన

Veer Bal Diwas 2025:మతం మారేది లేదు.. మరణానికైనా సిద్ధమే!  సిక్కు బాలల సింహ గర్జన
Advertisement

Veer Bal Diwas 2025: పసి ప్రాయంలోనే మరణాన్ని చిరునవ్వుతో ఆహ్వానించిన బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్‌బలిదానం గురించి తెలిసిన వారు చాలా తక్కువ. సిక్కుల పదో గురువు, గురు గోవింద్ సింగ్ గారిఇద్దరు చిన్న కుమారులు (ఛోటే సాహిబ్జాదే) చూపిన సాహసం, మన గుండెల్లో స్ఫూర్తిని రగిలిస్తుందిచరిత్ర పుటల్లో ఎన్నో త్యాగాలు లిఖించబడి ఉన్నాయి. కానీ వీరి బలిదానానికి  సాటి వచ్చే ఘట్టం మానవ చరిత్రలోనే మరొకటి కనిపించదు. కేవలం 7 , 9 ఏళ్ల ప్రాయం.. ఆటపాటలతో గడపాల్సిన ఆ పసి వయసులో, మరణం కళ్లముందు కనిపిస్తున్నా చెరగని చిరునవ్వుతో ధర్మాన్ని కాపాడిన ఆ వీర కిశోరాలే బాబా జోరావర్ సింగ్ , బాబా ఫతే సింగ్. వీరి త్యాగాన్ని స్మరిస్తూ కేంద్ర ప్రభుత్వం డిసెంబర్ 26ను ‘వీర్ బాల్ దివస్’ గా ప్రకటించింది.

అచంచలమైన ధర్మనిష్ఠ:

Advertisement

1704వ సంవత్సరంలో సర్హింద్ నవాబు వజీర్ ఖాన్ ఈ చిన్నారులను బంధించి, తన దర్బారులో ప్రవేశపెట్టాడు. ముస్లిం మతంలోకి మారితే రాజభోగాలు, సంపద ఇస్తామని ఆశ చూపాడు. నిరాకరిస్తే కఠినమైన శిక్షలు తప్పవని బెదిరించాడు. కానీ.. ఆ చిన్నారులు ఏమాత్రం బెదరలేదు. “మా తాతగారు గురు తేగ్ బహదూర్ గారే ధర్మం కోసం ప్రాణాలర్పించారు. మేము కూడా అదే బాటలో నడుస్తాం తప్ప మతం మారంఅని సింహ గర్జన చేశారు.

గోడలో సజీవంగా.. కదిలించే బలిదానం:

Advertisement

పిల్లల మొండితనాన్ని చూసి ఆగ్రహించిన మొఘల్ పాలకులు, వారిని సజీవంగా గోడలో పెట్టి ఇటుకలతో కట్టాలని ఆదేశించారు. ఇటుకల గోడ మెడ వరకు వస్తున్నా.. మరణం కళ్లముందు కనిపిస్తున్నా ఆ బాలురు ఏమాత్రం చలించలేదు. ధైర్యంగా తమ గురువులను స్మరిస్తూ. ధర్మ రక్షణ కోసం అమరులయ్యారు. అంతటి చిన్న వయసులో అపారమైన ధైర్యం, ధర్మం పట్ల అంకితభావం చూపడం ప్రపంచ చరిత్రలోనే అద్భుతం.

Also Read: ఆర్థిక సంస్కరణల ఆద్యుడికి ఘన నివాళి.. మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం

దాచిపెట్టబడిన నిజమైన చరిత్ర:

దురదృష్టవశాత్తు..మన దేశాన్ని కాపాడటం కోసం తమ సర్వస్వాన్ని ధారపోసిన ఇలాంటి వీరుల గాథలు దశాబ్దాల పాటు పాఠ్యపుస్తకాల్లో సరైన స్థానం పొందలేదు. విదేశీ ఆక్రమణదారుల చరిత్రకు ఇచ్చిన ప్రాధాన్యత, మన మట్టి వీరుల త్యాగాలకు దక్కలేదు. కానీ ఇప్పుడు ఆ మరుగున పడ్డ సత్యాలు నెమ్మదిగా వెలుగులోకి వస్తున్నాయి. ఈ త్యాగాలు కేవలం సిక్కు మతానికి మాత్రమే పరిమితం కావు.. ఇవి భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీకలు.

పిల్లల బలిదానం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పుతుంది: “ఎంతటి ఆపద వచ్చినా, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా.. సత్యాన్ని, ధర్మాన్ని వీడకూడదు.” నేటి తరం పిల్లలకు ఇన్‌స్టాగ్రామ్ హీరోలు కాదు, ఇలాంటి నిజమైన వీర కిశోరాల చరిత్ర తెలియాలి. వీర్ బాల్ దివస్ సందర్భంగా ఆ చిన్నారుల సాహసానికి నివాళులు అర్పిస్తూ, మన అస్తిత్వాన్ని కాపాడుకోవడమే మనం వారికి ఇచ్చే నిజమైన గౌరవం.

Related News

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

బ్యాంక్ ఉద్యోగాల కోసం చూస్తున్నారా? IBPS RRBలో 13,706 పోస్టులు ఖాళీ.. పూర్తి వివరాలవిగో

23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

మమతా బెనర్జీకి బిగ్ షాక్.. 28 ఏళ్ల మేనకోడలు ఆత్మహత్య.. మరణానికి కారణం అదేనా?

సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు.. విద్యార్థులపై కేసులన్నీ కొట్టివేత.. సెప్టెంబర్ 5 ఢిల్లీ మార్చ్ రద్దు

Big Stories

Advertisement
×