Tamil Nadu Politics: ప్రముఖ హీరో, టీవీకే అధినేత విజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర ప్రభుత్వం బీజేపీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే ఒంటరిగానే విజయం సాధిస్తుంద న్నారు. అందుకు తగ్గ సైన్యం తమ వద్ద ఉందన్నారు విజయ్. జరిగేది ఎన్నికల పోరు కాదని.. ప్రజాస్వామ్య యుద్ధమన్నారు.
అన్నాడీఎంకే ప్రత్యక్షంగా.. డీఎంకే పరోక్షంగా బీజేపీ సరెండర్ అయ్యాయని విమర్శించారు. అయితే టీవీకే ఎలాంటి ఒ త్తిళ్లకు తలొగ్గదన్నారు. అంతేకాదు.. డీఎంకే ప్రభుత్వాన్ని సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. ఎవరికీ తలవంచ మని.. దేనికీ రాజీపడే ప్రసక్తే లేదన్నారు టీవీకే అధినేత విజయ్. దుష్ట శక్తులను, అవినీతి పరులను ఎదుర్కొనే ధైర్యం తమ పార్టీకి మాత్రమే ఉందన్నారు విజయ్.
ALSO READ: సస్పెన్షన్ వేటుతో కుంగిపోయిన ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి.. సోషల్ మీడియాలో ఎమోషనల్ వీడియో వైరల్!