Khammam News: ఖమ్మం జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ భూక్యా గౌతమి సస్పెన్షన్ ఉదంతం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తూ.. ప్రైవేట్ విద్యాసంస్థల అడ్మిషన్ల కోసం ఆమె ప్రమోషన్ చేయడంతో పెద్ద వివాదానికే దారితీసింది.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం.. ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ ఇతర సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించడం లేదా ప్రైవేట్ ప్రయోజనాల కోసం ప్రచారం చేయడం నిషిద్ధం. గౌతమి ఒక ప్రైవేట్ స్కూల్లో పిల్లలను చేర్పించాలంటూ సోషల్ మీడియాలో వీడియోలు చేయడంతో.. విద్యాశాఖ అధికారులు దీనిని తీవ్రంగా పరిగణించి ఆమెను విధుల నుండి సస్పెండ్ చేశారు.
సస్పెన్షన్ అనంతరం గౌతమి సోషల్ మీడియాలో తన భావోద్వేగపూరితమైన వీడియోను విడుదల చేశారు. అందులో ఆమె కన్నీళ్లు పెట్టుకుంటూ తన ఆవేదనను పంచుకున్నారు. ‘ప్రైవేట్ స్కూళ్లకు ప్రమోషన్ చేయకూడదని తనకు ఎవరూ చెప్పలేదని, తెలియక చేసిన తప్పుగా ఆమె పేర్కొన్నారు. ఈ పరిణామాల వల్ల తాను తీవ్ర మనోవేదనకు గురవుతున్నానని.. తనకు ఆత్మహత్య చేసుకోవాలని అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు’. సోషల్ మీడియాలో తనకు ఉన్న పాపులారిటీ కారణంగానే సదరు స్కూల్ యాజమాన్యం తనతో ప్రమోషన్ చేయించుకుందని ఆమె వివరించారు.
ప్రభుత్వ టీచర్గా ఉంటూ ప్రైవేట్ విద్యను ప్రోత్సహించడం నైతికంగా తప్పని కొందరు వాదిస్తుంటే.. ఆమె అవగాహన లేక చేసిన పొరపాటును క్షమించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటన ప్రస్తుతం ఉపాధ్యాయ వర్గాల్లో , సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది.
ALSO READ: పేగులు తీసి రోడ్డు మీద పడేస్తా.. సొంత క్యాడర్కు చింతకాయల విజయ్ మాస్ వార్నింగ్!
ప్రభుత్వ స్కూల్లో పని చేస్తూ ప్రైవేట్ పాఠశాలకు Insta లో ప్రమోషన్స్
అధికారుల దృష్టికి రావడంతో టీచర్ సస్పెండ్
ఖమ్మం ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న ఇన్ఫ్లుయెన్సర్ గౌతమి
ఓ ప్రైవేట్ స్కూల్ కి ప్రమోషన్ చేస్తూ వీడియో పోస్ట్
విద్యాశాఖ అధికారుల దృష్టికి వెళ్లడంతో… pic.twitter.com/DmmONRaunV
— BIG TV Breaking News (@bigtvtelugu) January 25, 2026