E-Paper
Advertisement

విజయ్ సంచలన నిర్ణయం.. తాను రాజీనామా చేసిన స్థానం ఆ పార్టీకి!

విజయ్ సంచలన నిర్ణయం.. తాను రాజీనామా చేసిన స్థానం ఆ పార్టీకి!
Advertisement

తమిళనాడు రాజకీయాల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధ్యక్షుడు విజయ్ మరోసారి రాజ్‌భవన్‌లో గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్‌తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమ పార్టీని ఆహ్వానించాలని ఈ సందర్భంగా ఆయన గవర్నర్‌ను కోరారు. ఎన్నికల ఫలితాల అనంతరం విజయ్ గవర్నర్‌ను కలవడం ఇది మూడోసారి కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ తమకు ఉందని ఆయన గవర్నర్‌కు వివరించారు.

తమిళనాడు రాజకీయాల్లో గంట గంటకు సరికొత్త పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ తన ప్రభుత్వంలో మిత్రపక్షాలకు భాగస్వామ్యం కల్పించే విషయంలో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. తమకు మద్దతు ఇచ్చే పార్టీలను గౌరవిస్తూ అధికారంలో వాటా ఇవ్వాలని ఆయన నిశ్చయించుకున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి మూడు మంత్రి పదవులు కేటాయించనున్నట్లు వెల్లడించారు. అటు డీఎండీకే నేత ప్రేమలతకు కూడా మంత్రి పదవి ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. మిత్రపక్షాలను కలుపుకుపోవాలనే విజయ్ ఆలోచన రాజకీయ వర్గాల్లో కాస్త హాట్ టాపిక్ గా మారింది.

Advertisement

మరోవైపు వీసీకే పార్టీ విజయ్ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చేందుకు కొన్ని కీలక షరతులు విధించింది. మంత్రి పదవితో పాటు విజయ్ రాజీనామా చేసిన తిరుచ్చి ఈస్ట్ అసెంబ్లీ స్థానాన్ని తమకే కేటాయించాలని వీసీకే డిమాండ్ చేసింది. ఆ స్థానం నుంచి వీసీకే అధ్యక్షుడు తిరుమావళన్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రతిపాదనకు టీవీకే అధినేత విజయ్ సానుకూలంగా స్పందించి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో వీసీకే ప్రభుత్వంలో చేరడానికి మార్గం సుగమమైంది. చిన్న పార్టీలకు సైతం సముచిత స్థానం కల్పించడం ద్వారా సుస్థిర పాలన అందించాలని విజయ్ భావిస్తున్నారు.

ఈ పరిణామాల మధ్య వామపక్షాలు తమ వైఖరిని స్పష్టం చేశాయి. సీపీఐ, సీపీఎం పార్టీలకు తలా ఒక మంత్రి పదవిని కేటాయించినప్పటికీ వారు కేబినెట్‌లో చేరడానికి నిరాకరించారు. కేవలం టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు మాత్రమే తాము మద్దతు ఇస్తున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి. మంత్రి పదవులు తమకు వద్దని.. కేవలం ప్రజా సమస్యల పరిష్కారం కోసం బయట నుంచే మద్దతు ఇస్తామని వామపక్ష నేతలు స్పష్టం చేశారు. మతవాద శక్తులకు వ్యతిరేకంగా తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వారు పేర్కొన్నారు.

Advertisement

ప్రభుత్వ ఏర్పాటును పరోక్షంగా అడ్డుకోవాలని చూస్తున్న బీజేపీకి వామపక్షాల నిర్ణయం పెద్ద దెబ్బగా మారింది. అధికార దాహం లేకుండా కేవలం సిద్ధాంతాల కోసమే తాము పని చేస్తామని లెఫ్ట్ పార్టీలు నిరూపించాయి. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం భవిష్యత్తులో డీఎంకేతో కలిసి పోరాడతామని వామపక్షాలు వెల్లడించాయి. ప్రస్తుతానికి విజయ్ ప్రభుత్వం ఏర్పడటానికి సహకరిస్తూనే.. ప్రజా వ్యతిరేక విధానాలపై గళమెత్తుతామని వారు తెలిపారు. ఈ తాజా పరిణామాలతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

ALSO READ: అధికారం ముఖ్యం కాదు.. సిద్ధాంతం, విలువలే ప్రాణం, దళపతి వెనుక ఎంకే స్టాలిన్ వ్యూహం

Related News

ఆసుపత్రి నుంచే పార్లమెంట్ మార్చ్‌కు పిలుపు.. సోనమ్ వాంగ్‌చుక్ లేఖతో ఢిల్లీలో తీవ్ర ఉత్కంఠ!

కాశ్మీర్‌లో ప్రకృతి భీభత్సం.. ఆకస్మిక వరదలు, కుప్పలుగా వాహనాలు, 8 మంది మృతి

కర్ణాటకలో ఘోర విషాదం.. పెళ్ళయిన 15 రోజుల్లోనే నవవధువు మృతి.. అసలేం జరిగింది?

నగరాల్లో డెలివరీ బాయ్స్ అరాచకాలు.. ఇంట్లో ఒంటరిగా ఉందని డోర్ నెట్టుకుని లోపలికి, ఆపై..

లెక్కలు బయట పెట్టండి.. మౌనం సరికాదు, ప్రధాని నరేంద్రమోదీకి రాహుల్‌‌గాంధీ-ఖర్గే లేఖ

వానల కోసం సరికొత్త పూజ.. వర్షాలు కురవాలని గాడిదలకు స్వీట్లు తినిపించిన స్థానికులు!

జపాన్‌లో వర్క్ కల్చర్.. ఓ భారతీయుడి కీలక వ్యాఖ్యలు, వీకెండ్స్‌లో అయితే

అమర్‌నాథ్-వైష్ణోదేవి యాత్రలకు తాత్కాలికంగా బ్రేక్.. బేస్ క్యాంపుల ఆగిన యాత్రికులు, ఏం జరిగింది?

Big Stories

Advertisement
×