E-Paper
Advertisement

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?

Lok Sabha Speaker: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది భారత చరిత్రలో ఇంతకుముందు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు. మోదీతోపాటు 71 మంది సభ్యుల మంత్రుల మండలి కూడా ప్రమాణం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు కేటాయించే శాఖలకు సంబంధించి ప్రకటన చేయనున్నారు. అయితే, లోక్ సభ స్పీకర్ పదవి విషంలో ప్రస్తుతం పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగిస్తారా లేక ఆయన స్థానంలో మరో నేతను కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ నెల 18 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. అయితే, జూన్ 20 నాటికి తదుపరి లోక్ సభ స్పీకర్ ను ఎంపిక చేస్తారంటూ పలు మీడియాల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జూన్ 22న సెషన్లో ప్రసంగించవచ్చు మరియు ప్రొటెం స్పీకర్ తో ప్రమాణం కూడా చేయిస్తారు.. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడికున్నిల్ సురేష్ కావొచ్చంటూ అందులో పేర్కొన్నారు.

Daggubati Purandeshwari
Daggubati Purandeshwari

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నదని, అయితే ఈ పదవి కోసం దగ్గుబాటి పురందేశ్వరి పోటీ పడుతున్నారంటూ కూడా మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు. ఆమె 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా మరియు 2012లో వాణజ్యం మరియు పరిశ్రమల మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆమెను లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం లేకపోలేదంటూ వార్తలు వస్తున్నాయి.

Related News

ఆన్‌లైన్ బెట్టింగ్‌పై సుప్రీంకోర్టు సీరియస్.. రాష్ట్రాలకు ఫ్రీ హ్యాండ్!

బెంగాల్లో సంచలనం.. మమతకు షాకిచ్చిన స్పీకర్.. చీలిక వర్గానికి ప్రతిపక్ష హోదా

కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్‌ ప్రమాణం.. హాజరైన రాహుల్, ఖర్గే, రేవంత్ రెడ్డి

సీబీఎస్ఈ ఓఎస్ఎం సెగ.. కేంద్రం ఉక్కిరిబిక్కిరి, ఏకసభ్య కమిటీ విచారణ, మంత్రి రాజీనామాకు పార్టీల డిమాండ్

తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు.. బీజేపీకి అన్నామలై గుడ్ బై, పార్టీ అధ్యక్షుడికి లేఖ, మరో ఆరునెలల్లో

కలవర పెడుతున్న ఎబోలా వైరస్.. కేంద్రం ప్రత్యేక గైడ్‌లైన్స్.. కాకపోతే ఒక్క కేసు

కారుణ్య నియామకాలు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు, ఇకపై వారికి కూడా

ఆలస్యమైనా చల్లటి కబురు.. నైరుతి రుతుపవనాలు రాక, కేరళలోకి ప్రవేశం!-ఐఎండీ

Big Stories

×