E-Paper
Advertisement

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?

Lok Sabha Speaker: తదుపరి లోక్‌సభ స్పీకర్ ఎవరంటే..?
Advertisement

Lok Sabha Speaker: నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి భారత ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇది భారత చరిత్రలో ఇంతకుముందు పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మాత్రమే సాధించారు. మోదీతోపాటు 71 మంది సభ్యుల మంత్రుల మండలి కూడా ప్రమాణం చేసింది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో నిర్వహించే తొలి కేబినెట్ సమావేశంలో మంత్రులకు కేటాయించే శాఖలకు సంబంధించి ప్రకటన చేయనున్నారు. అయితే, లోక్ సభ స్పీకర్ పదవి విషంలో ప్రస్తుతం పెద్ద ప్రశ్న తలెత్తుతుంది. లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగిస్తారా లేక ఆయన స్థానంలో మరో నేతను కొనసాగిస్తారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది.

ఈ నెల 18 నుంచి లోక్ సభ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉంది.. అయితే, జూన్ 20 నాటికి తదుపరి లోక్ సభ స్పీకర్ ను ఎంపిక చేస్తారంటూ పలు మీడియాల్లో వార్తా కథనాలు వస్తున్నాయి. ప్రెసిడెంట్ ద్రౌపది ముర్ము జూన్ 22న సెషన్లో ప్రసంగించవచ్చు మరియు ప్రొటెం స్పీకర్ తో ప్రమాణం కూడా చేయిస్తారు.. ఆయన కేరళ ప్రదేశ్ కాంగ్రస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొడికున్నిల్ సురేష్ కావొచ్చంటూ అందులో పేర్కొన్నారు.

Daggubati Purandeshwari
Daggubati Purandeshwari
Advertisement

Also Read: ఏ రాష్ట్రానికి ఎక్కువ మంత్రి పదవులు దక్కాయో తెలుసా..?

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లానే కొనసాగే అవకాశం ఎక్కువగా ఉన్నదని, అయితే ఈ పదవి కోసం దగ్గుబాటి పురందేశ్వరి పోటీ పడుతున్నారంటూ కూడా మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. దగ్గుబాటి పురందేశ్వరి.. తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కుమార్తె. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు. ఆమె 2009లో మానవ వనరుల అభివృద్ధి మంత్రిగా మరియు 2012లో వాణజ్యం మరియు పరిశ్రమల మంత్రిగా పని చేశారు. ఈ క్రమంలోనే ఆమెను లోక్ సభ స్పీకర్ గా ఎన్నుకునే అవకాశం లేకపోలేదంటూ వార్తలు వస్తున్నాయి.

Related News

సీఎం యోగి కాన్వాయ్ సమీపంలో పేలుడు, ఉలిక్కిపడిన అధికారులు, మధుర వెళ్లే దారిలో ఘటన

బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఆఫీసర్ జాబ్స్.. కనీస వేతనం రూ.50,000.. పూర్తి వివరాలివిగో

ISRO: ఇస్రో ‘నాటీ బాయ్’ ప్రయోగం సక్సెస్.. చైనా-పాక్‌లపై నిఘా నేత్రం, ప్రతీ 10 నిమిషాలకు చుక్కలే

రైల్వే జాబ్స్.. RRB NTPCలో మొత్తం 5,165 ఖాళీలు.. డిగ్రీ ఉంటే చాలు

బెంగాల్‌లో ప్రతీకార రాజకీయాలు.. అభిషేక్ బెనర్జీ ఆఫీసుపై దాడులు, వెలుగులోకి షాకింగ్ వీడియో

ఆపరేషన్ సింధూర్ హీరో జితేంద్ర మిశ్రా.. రామ్‌మందిర్ సీఈఓగా ఎలా అయ్యారు? వెనుక జరిగింది ఏమిటి?

ఇంజినీరింగ్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ కంపెనీ GAIL‌లో ట్రైనీ జాబ్స్.. ఫ్రెషర్స్‌కు సూపర్ ఛాన్స్

అయోధ్య రామ మందిరానికి తొలి సీఈవో‌గా జితేంద్ర మిశ్రా!

Big Stories

Advertisement
×