E-Paper
Advertisement

Bengaluru: సీఈఓ సుచనా సేఠ్ కొడుకును ఎందుకు చంపింది ? పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు

Bengaluru: సీఈఓ సుచనా సేఠ్ కొడుకును ఎందుకు చంపింది ? పోలీసుల దర్యాప్తులో కీలక విషయాలు
Advertisement

Bengaluru: గోవాలో తన నాలుగేళ్ల కొడుకుని చంపి.. మృతదేహాన్ని బ్యాగులో ఉంచి.. కర్ణాటకకు తరలిస్తూ పోలీసులకు చిక్కిన మైండ్ పుల్ ఏఐ సంస్థ సీఈఓ సుచనా సేఠ్ కేసులో కీలక విషయాలు వెలుగుచూస్తున్నాయి. భర్త వెంకటరామన్.. తన కొడుకుతో గడిపేందుకు కోర్టు అనుమతించడమే హత్యకు దారి తీసిందని గోవా పోలీసులు తెలిపారు.

సుచనా సేఠ్ – వెంకటరామన్ ల విడాకుల ప్రక్రియ 2022లో మొదలైంది. ఈ క్రమంలో వారి కుమారుడు ఎవరి వద్ద ఉండాలన్నదానిపై వాదనలు జరగ్గా.. ప్రతి ఆదివారం తండ్రి కొడుకుతో సమయం గడిపేందుకు కోర్టు అనుమతించింది. ఈ ఉత్తర్వులతో సుచనా సేఠ్ తీవ్ర నిరాశకు గురైంది. వెంకటరామన్ కు కొడుకును దగ్గర కానివ్వకూడదన్న ఆలోచనతోనే.. అతడిని చంపాలని నిర్ణయించుకుందని పోలీసులు పేర్కొన్నారు. ఈ కేసులో సుచనాను మరింత లోతుగా విచారణ చేసేందుకు గోవా కోర్టు 6 రోజులపాటు పోలీసుల కస్టడీకి అప్పగించింది.

Advertisement

చిన్నారికి ఎక్కువ పరిమాణంలో దగ్గుమందు ఇచ్చి.. తలదిండు లేదా టవల్ తో బాలుడి గొంతునులిమి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హోటల్ రూమ్ లో తనిఖీలు చేయగా.. ఒక చిన్న, పెద్ద దగ్గుమందు సీసాలు లభ్యమయ్యాయని పోలీసులు వెల్లడించారు. కానీ.. సుచనా సేఠ్ మాత్రం తాను నిద్రనుంచి లేచేసరికే కుమారుడు చనిపోయి ఉన్నాడని చెబుతుందన్నారు. పోస్టుమార్టం అనంతరం బాలుడి మృతదేహాన్ని తండ్రికి అప్పగించగా.. ఆయన బెంగళూరులోని ఒక శ్మశాన వాటికలో అంత్యక్రియలను పూర్తి చేశారు.

బాలుడి మృతదేహానికి పోస్టుమార్టం చేసిన వైద్యుడు కుమారనాయక్ మాట్లాడుతూ.. బాలుడికి గుండెభాగంలో వాపు వచ్చిందని, ఊపిరాడకుండా చేసి హత్య చేశారని తెలిపారు. ఆదివారమే బాలుడిని చంపి ఉంటారని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×