E-Paper
Advertisement

ఆఫీస్ టైమ్ కంటే ఎక్కువ సేపు పని చేయమంటున్నారా?.. కొత్త లేబర్ కోడ్ ఏం చెబుతోంది?

ఆఫీస్ టైమ్ కంటే ఎక్కువ సేపు పని చేయమంటున్నారా?.. కొత్త లేబర్ కోడ్ ఏం చెబుతోంది?
Advertisement

Over Time Work Labour Code: మన దేశంలోని చాలా కంపెనీల్లో చూసే సాధారణ విషయం.. ఆఫీస్ టైమ్ ముగిసినా ఉద్యోగిని పనిచేయించడం. పెండింగ్‌ పనిని పూర్తి చేయాలని బాస్ ఆర్డర్ వేయడం, ఎక్స్ ట్రా వర్క్ ఇవ్వడం సాధారణంగా చూస్తుంటాం. కొన్ని సంస్థలు ఎక్స్ ట్రా టైమ్ పనిచేసిన కార్మికులు అదనపు వేతనాలు చెల్లిస్తుంటాయి. నిర్ణీత గంటల కంటే ఎక్కువ సమయం పనిచేయాలని ఆర్డర్స్ మౌఖికంగా వస్తాయి. ఉద్యోగి బాస్‌కు ‘నేను ఎక్కువ సమయం పనిచేయను’ అని చెప్పి ఇంటికి వెళ్లిపోవచ్చని కొందరు అనవచ్చు, కానీ అది చెప్పినంత సులభం కాదని ఉద్యోగులందరికీ తెలిసిన సంగతే. ఆ తర్వాత పరిస్థితులు, ఉద్యోగి కుటుంబం పోషణ, లోన్ ఈఎంఐలు, పిల్లల స్కూల్ ఫీజులు, ఇతర ఖర్చులు ఉన్నప్పుడు ఉద్యోగి ఎక్కువ సమయం చేయలేనని బాస్ కు చెప్పలేడన్నది వాస్తవం.

ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కార్పొరేట్ల రంగంలోని కంపెనీలలో ఉద్యోగులు సాధారణంగా ఎక్కువ సమయం పనిచేయాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. భారతీయ కార్పొరేట్ సంస్కృతిలో ఇది ఒక భాగంగా మారిందంటున్నారు. కానీ ఇది చట్టబద్ధం కాదని నిపుణులు అంటున్నారు. భారతదేశంలో ఉద్యోగులను ఓవర్‌టైమ్ పనిచేయమని బలవంతం చేయలేరని, అందుకు నిబంధనలు ఒప్పుకోవని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓవర్‌టైమ్ అనేది ఎప్పుడూ స్వచ్ఛందంగానే ఉండాలి, అందుకు యజమానులు నిర్దిష్ట అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

అందుకే ఓవర్ టైమ్ అనేది ఎప్పుడూ మౌఖికంగానే ఉంటుంది. అధికారికంగా కాగితాలపై ఉండదనేది వాస్తవం. రాతపూర్వకంగా ఓవర్‌ టైమ్ చేయమని చెబితేనే చట్టబద్ధంగా చెల్లుతుందని, మౌఖిక ఆదేశాలకు చట్టబద్ధత ఉండదనేది నిపుణులు చెబుతున్నారు.

ఓవర్ టైమ్ పై కొత్త కార్మిక చట్టాలు ఏం చెబుతున్నాయి?

  • దేశంలోని ప్రైవేట్ కంపెనీలలో పని గంటలు, ఓవర్‌టైమ్‌ను నియంత్రించే చట్టలు ఉన్నాయి. ఫ్యాక్టరీల చట్టం 1948 సెక్షన్లు 51, 54, 55, 56, 59 ప్రకారం.. రోజువారీ పనిని 9 గంటలకు, వారపు పనిని 48 గంటలకు పరిమితం చేశారు. వారానికి 48 గంటలు లేదా రోజుకు 9 గంటలు మించిన పనికి, సాధారణ వేతనం కంటే రెట్టింపు చెల్లించాల్సి ఉంటుంది.
  • వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల (OSH) కార్మిక కోడ్, 2020: ఫ్యాక్టరీల చట్టం, 1948తో సహా 13 పాత కార్మిక చట్టాలను విలీనం చేసి కొత్త లేబర్ కోడ్ లను రూపొందించారు. ఈ చట్టాల ప్రకారం.. అన్ని సంస్థలలోని కార్మికులకు ఓవర్‌టైమ్ కు సంబంధించి ఒకేరీతిలో నిబంధనలను రూపొందించారు. కార్మికుడి సాధారణ వేతనాల రేటుకు రెట్టింపు చొప్పున ఓవర్‌టైమ్‌కు పరిహారం చెల్లించాలి. ఆ చెల్లింపును సంబంధిత వేతన కాలంలోనే విడుదల చేయాల్సి ఉంటుంది.
  • రాష్ట్రాల్లోని షాపులు, సంస్థల చట్టాలు: ఆఫీసులు, ఇన్ఫోటెక్ కంపెనీలు, దుకాణాలు, సేవా కంపెనీలకు ఈ చట్టాలు వర్తిస్తాయి. ఈ మేరకు ప్రతి రాష్ట్రానికి దాని సొంత చట్టం ఉంటుంది. ఇవన్నీ పని గంటలపై పరిమితి విధించి, ఓవర్‌టైమ్ చెల్లింపును తప్పనిసరి చేశాయి.
  • పారిశ్రామిక ఉపాధి (స్టాండింగ్ ఆర్డర్స్) చట్టం, 1946 ప్రకారం, యజమానులు నిర్ణయించిన మేరకు పని గంటలు, షిఫ్ట్ లు, ఓవర్‌టైమ్‌ కు వేతనాలు ఉంటాయి.

ఉద్యోగి చట్టపరంగా ఏం చేయగలరు?

ఓవర్ టైమ్ కు సంబంధించిన ఆదేశాలు వస్తే వెంటనే వాటిని రికార్డు చేసుకోవాలి. వాట్సాప్ సందేశాలు, ఇ-మెయిల్, ఇతర సూచనలకు సంబంధించిన డిజిటల్ ఆధారాలను భద్రపరుచుకోవాలి. ఓవర్ టైమ్ ఆదేశాలు మౌఖికంగా ఉన్నప్పటికీ, వాటి తదుపరి వివరాలను ఇ-మెయిల్ ద్వారా ఒక లిఖితపూర్వక ఆధారంగా రూపొందించాలి. కంపెనీల అంతర్గత ఫిర్యాదుల కమిటీకి ఓవర్ టైమ్ పై ఫిర్యాదు చేయవచ్చు. సంబంధిత రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా లేబర్ ఇన్‌స్పెక్టర్‌కు ఉద్యోగి ఫిర్యాదు చేయవచ్చు. తమ ఓవర్‌టైమ్ వేతన హక్కులు ఉల్లంఘిస్తే, ఉద్యోగులు ఫిర్యాదు చేయడానికి లేదా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి హక్కు ఉంటుంది.

Advertisement

Also Read:  భారత కార్మిక రంగంలో నవశకం.. అమల్లోకి వచ్చిన 4 లేబర్ కోడ్స్.. గిగ్ వర్కర్లకు తొలిసారిగా పీఎఫ్, ఈఎస్‌ఐ సౌకర్యం!

ఎవరు అర్హులు కాదు

ఉద్యోగి ఓవర్‌టైమ్ వేతనాలకు సంబంధించి పారిశ్రామిక వివాదాల చట్టం, 1947లోని సెక్షన్ 33C (2) కింద లేబర్ కోర్టును ఆశ్రయించవచ్చు. ఒప్పంద ఉద్యోగులు అయితే సివిల్ కోర్టులను ఆశ్రయించవచ్చు. ఉద్యోగి రోజుకు 8–9 గంటలు లేదా వారానికి 48 గంటలు మించి పనిచేస్తే రెట్టింపు వేతనాలు పొందడానికి అర్హులు అవుతారు. అయితే ఫ్యాక్టరీల చట్టం, 1948 ప్రకారం, కార్య నిర్వాహక లేదా అడ్మినిస్ట్రేషన్ హోదాలో పనిచేసే వ్యక్తులు, లేదా ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ సంపాదించే వారు ఓవర్‌టైమ్ వేతనానికి అర్హులు కారు.

 

Related News

ఉక్రెయిన్‌లో ఘోరం.. కార్గో నౌకపై దాడి.. నలుగురు భారతీయుల మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఇథనాల్ కంటైనర్, కారు ఢీ.. ఆరుగురు సజీవదహనం!

ఎంపీలను కలవనిస్తేనే దీక్ష విరమణ.. లేఖ విడుదల చేసిన సోనమ్ వాంగ్‌చుక్!

సీజేపీ ర్యాలీతో రంగంలోకి దిగిన కేంద్రం.. కేంద్ర మంత్రి నడ్డా ముందు 3 కీలక డిమాండ్లు!

పార్లమెంట్‌లో తొలిరోజే హైడ్రామా.. నీట్ రచ్చ.. సభలు వాయిదా వేసినా తగ్గని విపక్షాలు!

పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో గన్‌తో కాల్చుకుని.. డీజీపీ అనురాగ్‌ ఆత్మహత్య, అసలు ఏం జరిగింది?

రేషన్‌కార్డు దారులకు తీపి కబురు.. ఒకేసారి మూడునెలల కోటా, ఇంకెందుకు ఆలస్యం

ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత.. సీజేపీ ఆందోళనకారులపై లాఠీచార్జ్.. అసలేం జరుగుతుంది?

Big Stories

Advertisement
×