OTT Movie : దీపావళి సీజన్ ముగిసినా, సినిమా ఫీవర్ మాత్రం తగ్గలేదు! థియేటర్లలో హిట్ అయిన సినిమాలు ఇప్పుడు కూడా ఓటీటీ ప్లాట్ ఫామ్లకు వచ్చేస్తున్నాయి. ఈ వీకెండ్లో ‘కే ర్యాంప్’, ‘డ్యూడ్’, ‘బైసన్’, ‘తెలుసు కదా’ వంటి మోస్ట్ అవైటెడ్ సినిమాలు స్ట్రీమింగ్ కి వస్తునాయి. రొమాన్స్, యాక్షన్, స్పోర్ట్స్ డ్రామా, మిస్టరీలతో వచ్చిన ఈ సినిమాలను మీ సోఫాలోనే కూర్చొని చూస్తూ ఎంజాయ్ చేయండి. ఇవి ఏ ఓటీటీలోకి రాబోతున్నాయి ? వీటి వివరాలు ఏమిటి ? అనే విషయాలను, తెలుసుకుందాం పదండి.
కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన ఈ కాలేజ్ రొమాంటిక్ డ్రామా, దీపావళికి థియేటర్లలో రిలీజ్ అయింది. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చింది. జైన్స్ నాని దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంతో పాటు, యుక్తి తరేజా, వెన్నెల కిషోర్, సాయికుమార్ నటించారు. ఈ సినిమా 2025 నవంబర్ 15న Aha Videoలో స్ట్రీమింగ్ కి సిద్ధంగా ఉంది. ఈ స్టోరీ గ్రామీణ బ్యాక్గ్రౌండ్ నుంచి సిటీ కాలేజ్ లైఫ్లోకి వచ్చిన ఒక యువకుడి చుట్టూ తిరుగుతుంది. లవ్, ఫ్రెండ్షిప్, చిన్న చిన్న కాన్ ఫ్లిక్ట్లతో ఎంగేజింగ్ గా అతని జర్నీ ఉంటుంది. మొదటి హాఫ్ ఫన్నీ గా, సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా ఉంటుంది. యూత్కి పర్ఫెక్ట్ వీకెండ్ వాచ్. థియేటర్లో మిస్ అయితే, Ahaలో చూసేయండి. ఇది ఐయండిబిలో 8.3/10 రేటింగ్ పొందింది.
ప్రదీప్ రంగనాథన్ మార్క్ కామెడీతో 100 కోట్లకు పైగా వసూళ్లు చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ మూవీ తమిళ, తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ అయింది. కీర్తిస్వరాన్ దర్శకత్వంలో ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు, ఆర్. సరత్కుమార్, హృదు హరూన్ లీడ్ రోల్స్ లో నటించారు. ఈ సినిమా Netflix లో 2025 నవంబర్ 14 నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ కథ ఈవెంట్ ప్లానర్ గా లైఫ్ ని స్టార్ట్ చేసే యువకుడి చుట్టూ తిరుగుతుంది. లవ్, సర్ప్రైజ్ ట్విస్ట్ల ఈ సినిమా ఆసక్తికరంగా ఉంటుంది. ఐయండిబిలో 6.8/10 రేటింగ్ ఉన్న ఈ సినిమా, ఫ్యామిలీ ఆడియన్స్ కి పర్ఫెక్ట్ వాచ్.
ధ్రువ్ విక్రమ్ కరెర్ లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్తో వచ్చిన ఈ తమిళ స్పోర్ట్స్ యాక్షన్ సినిమాకి మారి సెల్వరాజ్ దర్శకత్వం వహించాడు. అప్లాజ్ ఎంటర్టైన్మెంట్, నీలం స్టూడియోస్ బ్యానర్స్పై నిర్మించిన ఈ సినిమా, కబడ్డీ క్రీడాకారుడు మనతి గణేశన్ జీవితం ఆధారంగా తెరకెక్కింది. ఈ సినిమాలో ధ్రువ్ విక్రమ్, పశుపతి, అమీర్, లాల్, అనుపమ పరమేశ్వరన్, రజిషా విజయన్, అళగం పెరుమాళ్ ప్రధాన పాత్రల్లో నటించారు. బైసన్ దీపావళి సందర్భంగా అక్టోబర్ 17న విడుదలై ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇది థియేటర్లలో 50 కోట్లకు పైగా కలెక్షన్స్ కూడా రాబట్టింది. ఈ సినిమా Netflix లో 2025 నవంబర్ 14 నుంచి అందుబాటులో ఉండబోతోంది. ఐయండిబిలో దీనికి 8.3/10 రేటింగ్ ఉంది. స్పోర్ట్స్ ఫ్యాన్స్ కి ఇది మస్ట్ వాచ్ మూవీ.
ఈ తెలుగు రొమాంటిక్ సినిమాను టి. జి. విశ్వ ప్రసాద్ వివేక్ కుచిభోట్ల నిర్మించారు. ఈ సినిమాకి నీరజ కోన దర్శకత్వం వహించింది. ఇందులో సిద్దు జొన్నలగడ్డ, రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి ప్రధాన పాత్రలలో నటించారు. ఈ సినిమాకు తమన్ సంగీతం సమకూర్చాడు. సర్రోగసీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా, ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆసక్తిగా సాగుతుంది. ఈ సినిమా 2025 నవంబర్ 14 నుంచి Netflix లో స్ట్రీమింగ్ కి రాబోతోంది.
Read Also : ఫోన్ కాల్ తో కిర్రాక్ స్కామ్… ఈ వెబ్ సిరీస్ ను ఒక్కసారి చూడడం స్టార్ట్ చేస్తే ఆపరు భయ్యా