Baahubali: The Epic OTT : జక్కన్నతో పాటు ప్రభాస్, రానా, అనుష్క అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ‘బాహుబలి: ది ఎపిక్’ ఎట్టకేలకు ఓటీటీలలో స్ట్రీమింగ్ అవుతోంది. కానీ సదరు ఓటీటీ ప్లాట్ ఫామ్ పై తెలుగు ఆడియన్స్ మాత్రం గుర్రుగా ఉన్నారు. అసలు టాలీవుడ్ ప్రేక్షకులకు అలా కోపం రావడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం పదండి.
దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు ‘బాహుబలి: ది బిగినింగ్’, ‘బాహుబలి: ది కన్క్లూజన్’లను కలిపి ఒకే చిత్రంగా… ‘బాహుబలి: ది ఎపిక్’ అనే పేరుతో ఒకే ఎడిటెడ్ వెర్షన్లో విడుదల చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 3 గంటల 43 నిమిషాల నిడివి గల ఈ మూవీ థియేటర్లలో మరోసారి దుమ్మురేపింది. 2025 అక్టోబర్లో బిగ్ స్క్రీన్ పై సందడి చేసిన ‘బాహుబలి: ది ఎపిక్’ ఇప్పుడు డిజిటల్ ఎంట్రీ ఇచ్చింది. నెట్ఫ్లిక్స్ లో ప్రసారం అవుతోంది. అయితే ఈ ఓటీటీ విడుదల తెలుగు ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.
ఎందుకంటే ప్రస్తుతం ఈ సినిమా హిందీలో మాత్రమే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో అందుబాటులో ఉంది. తెలుగు వెర్షన్ విడుదల కాలేదు. నెట్ ఫ్లిక్స్ చేసిన ఈ పని చాలా మంది ప్రేక్షకులను నిరాశపరిచింది. చాలామంది తెలుగు వెర్షన్ ముందుగా అందుబాటులో ఉంటుందని ఆశించారు. కానీ అది జరగకపోగా, తెలుగు వెర్షన్ ఓటీటీ విడుదలకు సంబంధించి నిర్మాతలు లేదా నిర్మాణ సంస్థ నుండి ఎటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం ఆడియన్స్ ను అసహనానికి గురి చేస్తోంది. ఈ చిత్రం తెలుగులో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియని అయోమయ పరిస్థితిలో ఉన్నారు ఆడియన్స్. కాగా ఇందులో ప్రభాస్, అనుష్క శెట్టి, రానా దగ్గుబాటి, తమన్నా భాటియా, రమ్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించగా, ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోబు యార్లగడ్డ – ప్రసాద్ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మించారు.
Read Also : ఒక్కరాత్రిలో 5 మంది హత్య… మర్డర్స్ తో పోలీస్ కే కనెక్షన్… మైండ్ బెండయ్యే ట్విస్టులున్న క్రైమ్ థ్రిల్లర్
బాహుబలి కథ గురించి ఆడియన్స్ ను పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఇప్పటికే థియేటర్స్తో పాటు ఓటీటీ, టీవీలలో చాలా సార్లు ఈ మూవీ వచ్చింది. కాగా మాహిష్మతి సామ్రాజ్యపు రాజమాత శివగామి (రమ్యకృష్ణ) తన ప్రాణాలను పణంగా పెట్టి, కొడుకు భళ్లాల దేవ నుంచి మహేంద్ర బాహుబలి (ప్రభాస్)ని కాపాడుతుంది. అతను ఓ గూడెంలో పెరిగి పెద్దవాడు అవుతాడు. ప్రియురాలు అవంతిక (తమన్నా) ఆశయం నెరవేర్చడానికి మాహిష్మతి రాజ్యానికి పయనమవుతాడు. ఈ క్రమంలోనే అక్కడ తన తల్లి దేవసేన (అనుష్క శెట్టి) బందీగా ఉందని, భళ్లాల దేవుడు (రానా) తన తండ్రి అమరేంద్ర బాహుబలిని చంపించి, మాహిష్మతి సింహాసనాన్ని కైవసం చేసుకున్నాడని తెలుసుకుంటాడు. కట్టప్ప (సత్యరాజ్) సాయంతో మహేంద్ర బాహుబలి మాహిష్మతి రాజ్యాన్ని సొంతం చేసుకోవడానికి పెద్ద యుద్ధమే చేస్తాడు. చివరకు భళ్లాల దేవుడిని అంతమొందించి, అతను రాజు అవుతాడు.