Sabdham OTT:ఆది పినిశెట్టి హీరోగా నటించిన హారర్ థ్రిల్లర్ సినిమా శబ్ధం ఇప్పుడు OTTలో అందుబాటులోకి రావడంతో ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి నెలకొంది. ఈ సినిమా థియేటర్లలో ఫిబ్రవరి 2025లో విడుదలై మంచి స్పందన పొందింది. అయితే చాలా కాలంగా ఈ సినిమా డిజిటల్ విడుదల కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు ఇప్పుడు శుభ వార్త వచ్చింది.
ఈ సినిమా మార్చి 24, 2026 నుంచి ప్రముఖ OTT ప్లాట్ఫామ్ ZEE5 లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనిపై అధికారిక ప్రకటనను ZEE5 తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భయానికి శబ్దం వచ్చేసింది అనే ట్యాగ్లైన్తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
శబ్ధం సినిమా కథ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. కథలో ఒక పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ ప్రధాన పాత్రలో ఉంటాడు. అతను మున్నార్లోని ఒక మెడికల్ కాలేజీలో జరుగుతున్న అనుమానాస్పద మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తాడు. ఈ కేసులో డాక్టర్ అవంతిక అనే వ్యక్తితో కలిసి పనిచేస్తాడు.
ఈ క్రమంలో 40 సంవత్సరాల క్రితం జరిగిన కొన్ని భయంకరమైన ప్రయోగాల గురించి అతనికి సమాచారం లభిస్తుంది. ముఖ్యంగా పిల్లలపై జరిగిన ఆ ప్రయోగాలు కథలో కీలకంగా మారతాయి. ఈ ఘటనల వెనుక ఒక భయంకరమైన ఆత్మ ఉన్నట్లు అతను తెలుసుకుంటాడు. ఆ ఆత్మ ఎవరు? ఎందుకు ఇలా జరుగుతోంది? చివరికి నిజం ఏమిటి? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవడమే సినిమా ప్రధాన కథ.
ఈ సినిమాలో ఆది పినిశెట్టి నటన ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆయనతో పాటు లక్ష్మీ మెనన్, సిమ్రాన్, లైలా, ఎంఎస్ భాస్కర్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాను అరివళగన్ దర్శకత్వం వహించగా, సంగీతాన్ని ఎస్. థమన్ అందించారు.
టెక్నికల్గా కూడా ఈ సినిమా మంచి స్థాయిలో రూపొందింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్.. ఎడిటింగ్.. అన్ని కలిసి.. సినిమా సస్పెన్స్ను మరింత పెంచాయి. ముఖ్యంగా హారర్ సీన్స్ ప్రేక్షకులను భయపెడుతూ ఆకట్టుకుంటాయి.
హారర్.. థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే వారికి శబ్ధం మంచి ఎంపికగా చెప్పవచ్చు. ఇప్పుడు ఇది OTTలో అందుబాటులో ఉండటంతో, ఇంట్లోనే కూర్చొని ఈ సినిమాను ఆస్వాదించే అవకాశం లభించింది.
ALSO READ: Niharika Konidela: నాగబాబు సినిమాల పై నిహారిక షాకింగ్ కామెంట్స్…మోసం చేశారంటూ!