Timmaraju palli TV OTT: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో కామెడీ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం తిమ్మరాజు పల్లి టీవీ. టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నిర్మాతగా నిర్మించిన ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. తాజాగా ఈ విషయాన్ని ఆహా అధికారకంగా తెలియజేశారు. ఈ సినిమా తెలుగు ఓటీటీ హక్కులను కైవసం చేసుకున్న ఆహా వీడియో(Aha video) ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సంబంధించి అధికారక ప్రకటన తెలియజేశారు. ఈ సినిమా థియేటర్లలో ఏప్రిల్ 17వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా మొత్తం ఊర్లో ఉన్న ఒక టీవీ చుట్టూ కొనసాగుతుంది.
వి. మునిరాజ్ దర్శకత్వంలో కిరణ్ అబ్బవరం నిర్మాతగా తెరకెక్కిన ఈ సినిమాలో సాయి తేజ్ (Sai Tej)హీరోగా పరిచయమయ్యారు. ఇక హీరోయిన్ గా వేద జలంధర్ నటించి సందడి చేశారు. థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ కు సిద్ధమైంది. మే 15వ తేదీన ఈ సినిమా డిజిటల్ మీడియాలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ విషయాన్ని ఆహా అధికారకంగా తెలియజేస్తూ..”ఒక టీవీ మిస్సింగ్, ఒక దొంగ పై నిందా.. నిజం కోసం ఎదురుచూసే ఒక గ్రామం.. తిమ్మరాజు పల్లి టీవీ మే 15న ఆహాలో ప్రీమియర్ కానుందని తెలియజేశారు.
ఇక ఆహా గోల్డ్ యూజర్లకు మరొక ఆఫర్ కూడా ఇచ్చారు. ఆహా గోల్డ్ యూజర్లు ఈ సినిమాని 24 గంటల ముందే అంటే మే 14వ తేదీనే ఆహాలో ఈ సినిమా చూసే వెసులు బాటును కల్పించింది. కిరణ్ అబ్బవరం నిర్మాతగా దాదాపు కొత్త నటీనటులను పరిచయం చేస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు. థియేటర్లలో పర్వాలేదు అనిపించుకున్న ఈ సినిమా ఓటీటీలో ఏ విధమైనటువంటి ఆదరణను సొంతం చేసుకుంటుందనేది తెలియాల్సి ఉంది. మరి ఈ సినిమా కథ ఏంటి అనే విషయానికి వస్తే..
One missing TV.
One blamed thief.
One village waiting for the truth.#ThimmarajupalliTV premieres on May 15 only on #aha.24 Hours early acess for #ahaGold users. pic.twitter.com/DeFV7M4wnj
— ahavideoin (@ahavideoIN) May 7, 2026
తిమ్మరాజు పల్లి టీవీ సినిమా కథ 1996 రాయలసీమ బ్యాక్ ప్రాబ్లం కొనసాగుతుంది. తిమ్మరాజు పల్లి అనే ఒక పల్లెటూరులో ప్రతి శివ రాత్రికి ఊరు జనాలంతా కలిసి చందాలు వేసుకొని ఎంతో ఘనంగా పండుగను జరుపుకుంటారు. అలాగే సాయంత్రం అద్దెకు తెచ్చుకున్న టీవీ విసిఆర్ లో కొత్త సినిమాలు వేసుకొని వినోదాన్ని పొందుతారు. ఇలాంటి ఊరిలోకి రాజప్ప (ప్రదీప్ కొట్టే) ఒక టీవీ కొనుక్కొని తెచ్చుకుంటాడు. ఇలా తమ ఊర్లో టీవీ ఉండేసరికి ఊరి ప్రజలంతా ఇంట్లోనే టీవీ చూస్తూ కాలక్షేపం చేస్తుంటారు. మరోవైపు దొంగతనాలు చేసే సతీష్ (సాయి తేజ్) రాజప్ప చెల్లి శారద (వేద జలంధర్) ను ప్రేమిస్తుంటాడు. టీవీ పేరుతో ప్రతిరోజు వారి ఇంటికి వెళ్లి శారదను కలుస్తుంటాడు. ఈ విషయం తెలిసి ఇంట్లో పెద్ద గొడవ జరుగుతుంది. ఆ సమయంలోనే రాజప్ప ఇంట్లో టీవీ దొంగతనం అవుతుంది. కచ్చితంగా టీవీ దొంగతనం సతీష్ చేసి ఉంటారని అందరూ నిందిస్తారు. మరి నిజంగానే సతీష్ దొంగతనం చేశారా? తనుకు ఇచ్చిన గడువులో దొంగతనం చేయలేదని నిరూపించుకున్నారా? చివరికి సతీష్ శారద ప్రేమ గెలిచిందా? అనేది ఈ సినిమా కథ
Also Read: నిర్మాత ఆర్. బి. చౌదరికి నివాళులు అర్పించిన విజయ్..