E-Paper
Advertisement

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు! వైవీకి బిగ్ రిలీఫ్, విజయసాయిరెడ్డి చూపంతా
Advertisement

Amaravati: తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం చివరి అంకానికి చేరిందా? ఏకసభ్య కమిటీ నివేదిక ఇవ్వడంతో చర్యలకు సిద్ధమైందా? రాజకీయ నేతలు-ఉద్యోగులపై చర్యలకు ప్రభుత్వం రెడీ అయ్యిందా? జరుగుతున్న పరిణామాలను విజయసాయిరెడ్డి గమనిస్తున్నారా? ఈ వ్యవహారంపై రేపోమాపో ఆయన మీడియా ముందుకు రానున్నారా? అవుననే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి.

తిరుమల లడ్డూ వ్యవహారం.. చెవిరెడ్డి, భూమున, ధర్మారెడ్డిపై కఠినచర్యలు!

Advertisement

తిరుమల కల్తీ నెయ్యి కేసు వ్యవహారం చివరి అంకానికి చేరింది. ఏక సభ కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరడంతో కఠినచర్యలకు సిద్ధమైంది ప్రభుత్వం. ఈ కేసులో మాజీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిలను కమిటీ ప్రధానంగా ప్రస్తావించింది. వీరితోపాటు పలువురు ఉద్యోగులను పేర్కొంది.

వారిపై కఠినచర్యలకు సిద్ధమైనట్టు సచివాలయం వర్గాలు చెబుతున్నాయి. పైముగ్గురు నేతలు భవిష్యత్తులో తిరుమలలో ఎలాంటి పదవి చేపట్టకుండా చర్యలు తీసుకోవాలని భావిస్తోందని సమాచారం. కమిటీ ప్రస్తావించినట్టుగా కీలక అధికారులను సస్పెండ్ చేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది.

Advertisement

వైవీకి రిలీఫ్ వ్యవహారం.. విజయసాయిరెడ్డి చూపంతా అటువైపు

చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయాలపై విమర్శలు లేకపోలేదు.  కొనుగోలు కమిటీ సభ్యుల హోదాలో టెండరు నిబంధనల సడలింపుకు వీరిద్దరూ పచ్చజెండా ఊపినట్లు గుర్తించింది. కన్వీనర్ హాజరు లేకుండానే సమావేశంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం, డైరీలను రెండేళ్లపాటు ఎంపానల్ చేయాలన్న సూచనను నిర్లక్ష్యం చేశారట.

టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఈ వ్యవహారం నుంచి బయటపడినట్టు తెలుస్తోంది. ఆయన పాత్రపై దర్యాప్తు ఫోకస్ చేయలేదు. ఒకవిధంగా చెప్పాలంటే వైవీ సేఫ్‌గా బయటపడినట్టే. ఈ కుంభకోణం లో స్పష్టమైన పాత్ర కనిపిస్తున్నా నిందితుడిగా చేర్చలేదు సిట్. కేవలం ఆయన ​పీఏ చిన్నప్పన్న లంచం ఎవరి వద్దకు వెళ్లిందో తేలకుండానే దర్యాప్తు ముగిసింది. ​

ALSO READ: రాళ్ల‌తో కొట్టి చంపండి..! అద‌ప్పుడు కేసీఆర్ స్ట్రాట‌జీ.. ఇప్పుడు క‌విత నోటి వెంటా అవే..!

బ్యాంకు ఖాతాలు పరిశీలించకుండానే నిందితుల జాబితా నుంచి సుబ్బారెడ్డిని తప్పించడం అనేక అనుమానాలు లేకపోలేదు. దీనిపై కూటమిలో చర్చ జరుగుతోంది. ఈ విధంగా చర్యలు తీసుకోవాలి? సిట్ నివేదిక, కమిటీ నివేదికతో చర్చలు చేపట్టాలని భావిస్తోంది. శనివారం హైదరాబాద్ సీఎం చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య దీనిపై చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.

కల్తీ నెయ్యి వ్యవహారంలో సిట్ నివేదిక, కమిటీ రిపోర్టు అంశాలను విజయసాయిరెడ్డి క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు మరోవైపు వార్తలు వస్తున్నాయి. దీనిపై రేపో మాపో ఆయన మీడియా సమావేశానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా తర్వాత మీడియా ముందుకొస్తారా? ముందే వస్తారా అనేది చూడాలి.

Related News

రాడు.. రానేరాడు.. వస్తే గిస్తే.. సీఎంగానే వ‌స్త‌డు.. ఏం చేసుకుంట‌రో చేసుకోండి..!

కేసీఆర్‌ది లీ క్వాన్ యూ స్థాయి.. సింగ‌పూర్ త‌ర‌హా అత్యున్న‌త మ‌ర్యాద‌ను ఇవ్వాల్సిందిపోయి….. కేటీఆర్ ఆస‌క్తిక‌ర కామెంట్స్‌..!

347 కోట్ల మంది మ‌హిళ‌లు.. ఆర్టీసీలో ఫ్రీ ప్ర‌యాణం! రూ. 12,167 కోట్ల మేర ఆ కుటుంబాల‌కు ఆదా..!

వెయ్యి రోజులుగా కేసీఆర్ మేధోమ‌థ‌నం….కొంగొత్త ప‌థ‌కాల‌కు రూప‌క‌ల్ప‌న‌..! బీఆరెస్ స‌మ‌ర్థింపు ప్ర‌క‌ట‌న‌లు…

ఆయ‌నంతే .. ఓడితే అజ్ఞాతవాసే..! అది ఉద్య‌మ స‌మ‌యం నుంచే ఆయ‌న‌కు అల‌వాటు.. ఎవ‌రేమ‌నుకున్నా స‌రే అదే తీరు..!

కాంగ్రెస్ @ 1000 డేస్.. ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

బీఆరెస్ సోష‌ల్ మీడియాపై స‌ర్కార్ సీరియ‌స్ న‌జ‌ర్.. వెన‌క్కి త‌గ్గ‌ని పింక్ వారియ‌ర్స్‌

వెయ్యి రోజుల ర‌గ‌డ‌…! పోటాపోటీ వారోత్స‌వ పోరాటాలు! నా బంగారు పుట్ట‌లో వేలు పెడితే నీ ఫామ్‌హౌజ్‌ను కుట్ట‌నా?

Big Stories

Advertisement
×