Human life 150 Years| ఎక్కువ కాలం జీవించాలనే ప్రతి మనిషి కోరుకుంటాడు. అందుకే మనిషి జీవితకాలం పెంచే విధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రయోగాలు నిరంతరం జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనా బయోటెక్ కంపెనీ లాన్వీ బయోసైన్సెస్ (Lonvi Biosciences) ఒక అద్భుత ప్రకటన చేసి ప్రపంచ శాస్త్రవేత్తలను షాకిచ్చింది. మనుషులు 150 ఏళ్ల వరకు జీవించవచ్చని ఈ కంపెనీ సైంటిస్టులు పేర్కొన్నారు. ప్రస్తుతం సమయంలో మనిషి జీవించే సగటు ఆయుష్షు 65-70 ఏళ్ల మధ్య ఉండగా.. చైనా కంపెనీ చేసిన దావా దీనికి రెండింతలు. ఈ కంపెనీ ఒక పిల్ (మాత్ర) కనిపెట్టింది. ఆ పిల్ ద్వారా ఆయుష్షు పెరుగుతుందని కంపెనీ చెప్పింది. అదే నిజమైతే మానవ జీవితం పూర్తిగా మారిపోతుంది. అయితే లాన్వీ కంపెనీ చేసిన దావా ఇంకా పూర్తి స్థాయిలో ధృవీకరణ కాలేదు. కానీ ప్రయోగాలు దాదాపు విజయవంతమయ్యాయి.
మనిషి శరీరంలో సెల్యులర్ స్థాయిలో వయసు క్రమంగా పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే వృద్ధాప్యం వస్తుంది. ఆ తరువాత మరణం సంభవిస్తుంది. ఇప్పుడు చైనా పిల్ ఈ వృద్ధాప్యాన్ని కలుగజేసే సెల్స్ని లక్ష్యంగా చేసుకుంటుంది. మన శరీరంలో “జాంబీ సెల్స్” అని పిలువబడే మరణించని వృద్ధ కణాలు ఉంటాయి. ఇవి వాపు (ఇన్ఫ్లమేషన్) కలిగించి, వృద్ధాప్య సమస్యలకు కారణమవుతాయి. ఈ మాత్ర ఆ హానికర కణాలను తొలగిస్తుంది. ఫలితంగా ఆయుష్షు గణనీయంగా పెరుగుతుందని కంపెనీ చెబుతోంది.
మాత్రలోని ముఖ్యంగా ప్రొసయానిడిన్ సి1 (Procyanidin C1 – PCC1) ఉంటుంది. ఇది ద్రాక్ష గింజల నుంచి సహజంగా లభిస్తుంది. ఇది యాంటీ-ఏజింగ్ లక్షణాలు కలిగి, వృద్ధ కణాలను సమర్థవంతంగా తొలగిస్తుంది. సహజ మూలాల నుంచి వచ్చినందున ఇది సురక్షితమైనది.
ఎలుకలపై జరిపిన ప్రయోగాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ప్రయోగం చేసిన ఎలుకలు సాధారణంగా 9.4% ఎక్కువ కాలం జీవించాయి. చికిత్స ప్రారంభమైన తర్వాత మిగిలిన ఆయుష్షు 64% వరకు పెరిగింది. ఇది పరిశోధకులను ఆకట్టుకుంది. అయితే మనుషులపై పరీక్షలు ఇంకా పూర్తి కాలేదు.
కంపెనీ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ల్యూ ఖింగ్హువా (Lyu Qinghua)కు తమ టెక్నాలజీపై పూర్తి నమ్మకం ఉందని అన్నారు. “150 ఏళ్లు జీవించడం సాధ్యమే. త్వరలోనే ఇది నిరూపితమవుతుంది.” అని ఆయన చెప్పారు. కంపెనీ వృద్ధాప్య చికిత్సను మార్చే లక్ష్యంతో పరిశోధనలు కొనసాగిస్తామన్నారు.
చైనాలో దీర్ఘాయుష్షు పరిశోధనలపై ఆసక్తి పెరుగుతోంది. ప్రస్తుతం చైనా పౌరుల సగటు ఆయుష్షు 79 ఏళ్లు – ప్రపంచ సగటుకంటే 5 ఏళ్లు ఎక్కువ. ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులు పెరుగుతున్నాయి. గతంలో వృద్ధాప్య ప్రయోగాలకు అమెరికన్ ధనవంతులకు మాత్రమే పెట్టుబడులు పెట్టేవారు. ఇప్పుడు చైనా ప్రజలు స్వయంగా పెట్టుబడులు పెడుతున్నారు. ఇది చాలా పెద్ద మార్పు.
మనిషి జీవితకాలం పెంచే ప్రయోగాల ప్రమాదకరమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాలు వాటి ఫలితాలు ప్రాథమిక సంకేతాలు మాత్రమే. మానవ పరీక్షలు అవసరం. డోసేజ్ చాలా కచ్చితంగా ఉండాలి. సైడ్ ఎఫెక్ట్స్, దీర్ఘకాలిక ప్రభావాలు తెలుసుకోవాలి. దీనికి సంవత్సరాలు పడుతుంది. రెగ్యులేటరీ అనుమతులు తప్పనిసరి.
ఈ పిల్ చాలా పెద్ద ఆవిష్కరణ. లాన్వీ దావా నిజమైతే మానవ జాతి చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది! ఇది పూర్తిస్థాయిలో విజయవంతమైతే.. ఆరోగ్య వ్యవస్థలు, రిటైర్మెంట్ వయస్సు, జనాభా డైనమిక్స్, ఆర్థిక మోడల్స్ – అన్నీ తలకిందులవుతాయి. భవిష్యత్తులో సెల్యులర్ రిపేర్, జెనెటిక్ మార్పులు, కాంబినేషన్ థెరపీలు వంటి బహుళ మార్గాలు అన్వేషిస్తున్నారు. వృద్ధాప్య పరిశోధన రంగం వేగంగా అభివృద్ధి చెందుతోంది.
Also Read: ఏఐ పవర్.. 2030 నాటికి మానవులు మృత్యువుని జయించగలరు.. శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారంటే?