E-Paper
Advertisement

వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్‌లో

వాహనదారులకు ఏఐతో చెక్.. ఇక తప్పించుకోలేరు, రేపో మాపో హైదరాబాద్‌లో
Advertisement

AI Traffic: టెక్నాలజీతో మమేకం కావడానికి పెద్దగా ఇష్టపడేవారు కాదు సామాన్యులు. ఇదంతా ఒకప్పటి మాట. సామాన్యులతోపాటు అన్ని ప్రభుత్వ విభాగాల్లో ఏఐ వినియోగం క్రమంగా పెరుగుతోంది. తాజాగా ట్రాఫిక్‌లో ఏఐ వినియోగం పెరుగుతోంది. రేపో మాపో హైదరాబాద్ నగరానికి ఆ తరహా పద్దతి రాబోతోంది. ఇంతకీ అసలు మేటరేంటి?

వాహనదారులకు ఏఐతో చెక్

హర్యానాలో మొట్టమొదటి ఏఐ-ఆధారిత స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ ప్రారంభమైంది. వాహనదారులకు ట్రాఫిక్ పరిస్థితులు, రహదారి భద్రత హెచ్చరికలు, సమాచారాన్ని వేగంగా అందించేందుకు ఆధునిక వ్యవస్థను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. ఓ వైపు పెరుగుతున్న సిటీ రద్దీకి ట్రాఫిక్ సమస్యకు సాంకేతిక పరిష్కారాలు అవసరం అవుతున్నాయి. ప్రమాదాలను తగ్గించడం, ప్రయాణాన్ని సురక్షితంగా మార్చడం లక్ష్యంగా తీసుకొచ్చిన ఈ సాంకేతికత వ్యవస్థ, రవాణా వ్యవస్థలో కీలక పాత్ర పోషించనుంది.

గురుగ్రామ్‌లో ఏఐ ఆధారంగా వాహనాల ట్రాఫిక్

Advertisement

మరోవైపు ఏఐ ఆధారిత విధానాలు రవాణా నిర్వహణను మరింత సమర్థవంతంగా మార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. అదే సమయంలో కొత్త వ్యవస్థ వల్ల వాహనాలు ట్రాఫిక్ సిగ్నల్ దాటుతున్నప్పుడు వాహనాల నెంబర్ ఆధారంగా పెండింగ్ ట్రాఫిక్ చలాన్లను ప్రదర్శిస్తుంది. దీనివల్ల ఎప్పటికప్పుడు వాహనదారుడు తమ చెలాన్ల గురించి తెలుసుకోవడమేకాదు, ట్రాఫిక్ పోలీసులకు చిక్కడం ఖాయం. సాంకేతికత ఆధారంగా పని తీరు చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇప్పటివరకు గురుగ్రామ్‌లో ఏఐ సామర్థ్యం గల డిస్‌ప్లేను ఇన్‌స్టాల్ చేశారు. దీనిపై మీరు చలాన్‌లను విస్మరించలేరు అని రాసి ఉంది. మరొక దానిలో హర్యానాలో మొట్టమొదటి స్మార్ట్ ట్రాఫిక్ హెచ్చరిక స్క్రీన్ గురుగ్రామ్‌లో ప్రత్యక్షమైందని ఉంది.

చలాన్లు ఉన్నా వెంటనే డిస్‌ప్లే

ఈ కూడలి గుండా వెళ్లే వాహనాలను గుర్తించి పెండింగ్‌లో ఉన్న చలాన్‌లకు సంబంధించిన సమాచారాన్ని తక్షణమే ప్రదర్శిస్తుంది. ఆ ఫుటేజ్‌లో స్క్రీన్ ఎలా పని చేస్తుందో తెలిపే అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఆ వీడియోపై ఆన్‌లైన్‌లో వినియోగదారుల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఈ చొరవను ట్రాఫిక్ ఉల్లంఘనలకు నిరోధకంగా ప్రశంసించారు. మరికొందరు ఇలాంటి సాంకేతికత పెద్ద సమస్యలను పరిష్కరిస్తుందా? అనవసరమైన ఆటంకాలను ఏమైనా సృష్టిస్తుందా అని ప్రశ్నిస్తున్నారు. ఆ తరహా పద్దతిని మిగతా రాష్ట్రాలు ఫాలో కావాలని ఆలోచన చేస్తున్నాయి.

Advertisement

ALSO READ: ఆఫర్ అంటే ఇదే.. రూ. 17 వేలకే 40 ఇంచీల టీవీ

 

 

 

 

 

Related News

తక్కువ ధరకే iPhone, Samsung ఫ్లాగ్‌షిప్ ఫోన్లు.. ఫ్లిప్‌కార్ట్ ధమాకా సేల్ డేట్స్ వచ్చేశాయ్!

వావ్.. గూగుల్ పిక్సెల్ 10 ఇంత తక్కువకా? Flipkart Freedom Saleలో షాకింగ్ ప్రైస్!

చేతికి అదిరిపోయే లుక్! రూ.1,899కే నాయిస్ రౌండ్ డయల్ స్మార్ట్‌వాచ్

వర్షాకాలంలో ఏసీతో పాటు ఇది కూడా ఆన్ చేస్తున్నారా? అయితే కరెంటు బిల్లు డబుల్ అవ్వడం ఖాయం!

ఇంట్లో పెట్స్ ఒంటరిగా ఉన్నాయా? రూ.3 వేలలో బెస్ట్ సెక్యూరిటీ కెమెరాలు ఇవే!

జియోట్యాగ్ 2 vs యాపిల్ ఎయిర్‌ట్యాగ్ 2.. ధరే కాదు, ఫీచర్ల‌లోనూ భారీ తేడా.. రెండిట్లో ఏది బెస్ట్?

మ్యూజిక్ లవర్స్‌కి గుడ్ న్యూస్.. ఒప్పో ఇయర్‌బడ్స్‌పై భారీ డిస్కౌంట్

అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్.. బడ్జెట్ నుండి ఫ్లాగ్‌షిప్స్ వరకు బెస్ట్ డీల్స్, తగ్గిన ధరలు చూస్తే..

Big Stories

Advertisement
×