E-Paper
Advertisement

Cyber Security:- సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్‌షిప్.. దేశంలో మొదటిసారి..

Cyber Security:- సైబర్ సెక్యూరిటీలో ఇంటర్న్‌షిప్.. దేశంలో మొదటిసారి..
Advertisement

Cyber Security:- సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది పెరిగిన తర్వాత సైబర్ సెక్యూరిటీ అనేది కూడా మనిషి జీవితంలో ఒక భాగమయిపోయింది. సైబర్ సెక్యూరిటీ సెల్ అనేది ఎంత మెరుగ్గా పనిచేసినా కూడా అందులో మెలకువలో తెలిసిన వారు సైబర్ క్రైమ్స్ చేయడంలో తమ సామర్థ్యాన్ని అంతా ఉపయోగిస్తున్నారు. అందులో సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే సైబర్ సెక్యూరిటీపై ఆసక్తి ఉన్నవారి కోసం ప్రభుత్వం ఒక విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది.

విద్యార్థి స్టేజ్ నుండే సైబర్ సెక్యూరిటీపై అవగాహన ఉండాలని నిపుణులు చెప్తున్నారు. అలా అయితేనే వారు సమయం గడిచేకొద్దీ సైబర్ సెక్యూరిటీ విభాగంలో మెరుగ్గా పనిచేయగలరని అంటున్నారు. అందుకే కొయంబత్తూరు సిటీ పోలీసులను పలువురు విద్యార్థులను సెలక్ట్ చేసి వారికి సైబర్ సెక్యూరిటీపై అవగాహన కల్పించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు దాదాపు 30 మంది సైన్స్‌తో పాటు ఆర్ట్స్ స్టూడెంట్స్ కూడా సైబర్ సెక్యూరిలో ఇంటర్న్‌షిప్‌ను పూర్తిచేశారని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం 15 మంది స్టూడెంట్లు ఇంటర్న్‌షిప్‌లో పాల్గొంటున్నారని తెలుస్తోంది.

Advertisement

కొయంబత్తూరు పోలీసులు ప్రారంభించిన ఈ ప్రోగ్రాంలో కర్ణాటకలోని మైసూరు విద్యార్థులను కూడా భాగస్వాములను చేసుకోవాలని ఆ రాష్ట్ర సైబర్ క్రైమ్ పోలీసులు కోరారు. అయితే త్వరలోనే ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాల్లో ప్రవేశపెట్టాలని సైబర్ టీమ్ అనుకుంటోంది. ఈ ప్రోగ్రాంలో సైబర్ స్పేస్‌ను క్రిమినల్స్ ఎలా ఉపయోగించుకుంటారు, నేరాలకు ఎలా పాల్పడతారు అనే విషయాలపై విద్యార్థులకు అవగాహన రానుంది. అంతే కాకుండా పోలీసులు కావాలనే లక్ష్యం ఉన్నవారికి ఈ ప్రోగ్రాం ఎన్నో కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఉపయోగపడుతుందని సైబర్ పోలీసులు చెప్తున్నారు.

ఈ ఏడాది జనవరిలో సైబర్ సెక్యూరిటీ ఇంటర్న్‌షిప్‌ను ప్రారంభించినట్టుగా పోలీసులు తెలిపారు. ఈ ఇంటర్న్‌షిప్ 14 రోజులు, ఒక నెల, రెండు నెలలుగా కేటాగిరీల వారీగా విభజించి ఉంటుందని చెప్పారు. ప్రస్తుతం ఇతర రాష్ట్ర విద్యార్థులకు కూడా ఈ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలని ఉన్నా కూడా సరిపడా సౌకర్యాలు లేకపోవడం వల్ల వారు ముందడుగు వేయలేకపోతున్నామని కోయంబత్తూరు పోలీసులు వాపోతున్నారు. ప్రస్తుతం కోయంబత్తూరులో కోర్సుతో సంబంధం లేకుండా ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఈ ఇంటర్న్‌షిప్ అందుబాటులో ఉంటుందన్నారు.

Tags

Related News

జియో, విఐ బెటర్ అంటున్న యూజర్లు.. ఎయిర్‌టెల్ 5G హాట్‌స్పాట్ బ్యాన్‌పై సోషల్ మీడియాలో ఆగ్రహం!

స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్, భారీ బ్యాటరీ.. గేమర్స్ కోసం నెక్ట్స్ లెవెల్ టాబ్లెట్ వచ్చేసింది!

కెమెరా పక్కనే మరో డిస్‌ప్లే.. ఇన్ఫినిక్స్ కొత్త బడ్జెట్ ఫోన్ లుక్ చూశారా?

రెడ్‌మీ నోట్ 17కు రీబ్రాండెడ్‌గా Poco X8, M8 పవర్.. ఫీచర్లు, ధరల వివరాలు ఇవే!

ఇంటిని థియేటర్‌గా మార్చే బెస్ట్ బడ్జెట్ పోర్టబుల్ ప్రొజెక్టర్లు.. ధరలు కూడా బడ్జెట్‌లోనే!

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

Big Stories

Advertisement
×