WhatsApp Free Legal Advice Nyaya Setu AI | ఏదైనా చట్టపరమైన సమస్యలు వస్తే కోర్టు, పోలీస్ స్టేషన్ చట్టూ తిరగాల్సి వస్తుంది. లాయర్లకు ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి సమస్యలకు ఇప్పుడు కొంతవరకు పరిష్కారం లభించింది.
భారత ప్రభుత్వం న్యాయ సేతు చాట్బాట్ను వాట్సాప్లో ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. న్యాయ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ Xలో ప్రకటించింది. కొత్త సంవత్సరం ప్రారంభంలో ఈ ఫ్రీ సర్వీస్ ప్రారంభమైంది. పౌరులకు న్యాయ సహాయం సులభంగా.. అందరికీ అందేలా చేయడమే ఈ చాట్బాట్ లక్ష్యం. ఇకపై చిన్న చిన్న న్యాయ సమస్యలకు కోర్టులు లేదా లాయర్ల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేదు.
న్యాయ సేతు ఒక ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత న్యాయ సహాయ చాట్బాట్. భారత ప్రభుత్వం దీన్ని 2024 ఆగస్టులో ప్రారంభించింది. ఉచితంగా న్యాయ సమాచారం, సలహాలు ఇస్తుంది. క్లిష్టమైన న్యాయ భాషను సరళంగా వివరిస్తుంది. దేశవ్యాప్తంగా న్యాయం అందించడాన్ని సులభతరం చేస్తుంది. బ్యూరోక్రసీ, న్యాయ అవగాహన లోపం వల్ల వచ్చే అడ్డంకులను తొలగిస్తుంది. అవసరమైతే ప్రొఫెషనల్ లాయర్లతో కనెక్ట్ చేస్తుంది.
భారత్లో అత్యధికంగా ఉపయోగించే మెసేజింగ్ యాప్ వాట్సాప్. ఈ ప్లాట్ఫామ్లో న్యాయ సేతును అనుసంధానం చేశారు. ఇప్పుడు కేవలం మొబైల్ ఫోన్, వాట్సాప్ ఉంటే చాలు, ఎవరికైనా తక్షణం న్యాయ సహాయం అందుతుంది. న్యాయ మంత్రిత్వ శాఖ చెప్పినట్లు.. చట్టపరమైన సలహా, సాయం పొందడం ఇప్పుడు కేవలం ఒక మెసేజ్ దూరంలో ఉంది. దీని కోసం సాధారణ, సులభమైన ఇంటర్ఫేస్ ఉంది. న్యాయ ప్రశ్నలకు దశలవారీగా మార్గదర్శనం చేస్తుంది.
భారత్లో వాట్సాప్ యూజర్లందరూ ఈ ఫ్రీ సర్వీస్ని ఉపయోగించవచ్చు. ఆండ్రాయిడ్, ఐఓఎస్.. వాట్సాప్ వెబ్లో పనిచేస్తుంది. ప్రారంభించడానికి 7217711814 నంబర్కు మెసేజ్ పంపండి. ఈ నంబర్.. టెలీ-లా అని కనిపిస్తుంది. న్యాయ సలహా, సమాచారం లేదా లాయర్ కనెక్షన్ వంటి ఆప్షన్లు చాట్బాట్ చూపిస్తుంది. మరింత కచ్చితమైన సలహా కోసం మొబైల్ నంబర్ వెరిఫై చేయమని అడుగుతుంది. వెరిఫికేషన్ లేకుండా కూడా పరిమిత సహాయం అందుతుంది.
కుటుంబ పరమైన సమస్యలు, ఆస్తి వివాదాలు, కార్మిక సమస్యలు, క్రిమినల్ లా వంటి అనేక విభాగాల్లో సమాచారం ఇస్తుంది. సాధారణ భాషలో హక్కులు, ప్రక్రియలు వివరిస్తుంది. తర్వాతి దశలు ఏమిటో చెబుతుంది. అవసరమైతే ప్రొఫెషనల్ లాయర్లతో సంప్రదించేందుకు సాయపడుతుంది. ప్రైవెసీ, సురక్షిత సంభాషణను కాపాడుతుంది. బాధ్యతాయుతంగా ఏఐని ఉపయోగిస్తుంది.
Also Read: వచ్చేసింది హై సెక్యూరిటీ ఫోన్.. వాటర్ ప్రూఫ్ డిజైన్, రిమూవెబుల్ బ్యాటరీ ఫీచర్లతో లాంచ్
న్యాయం అందరికీ అందేలా చేయడమే ప్రభుత్వ లక్ష్యం. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని బలోపేతం చేస్తుంది. భౌతిక న్యాయ కార్యాలయాలపై ఆధారపడటం తగ్గిస్తుంది. సమయం, డబ్బు, ప్రయాణం ఆదా అవుతాయి. పౌరులకు న్యాయపరమైన అవగాహన కల్పించి సాధికారత కల్పిస్తుంది. అవగాహన పెంచి సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది.
చాలా మంది భయం, ఖర్చు వల్ల న్యాయ సహాయం తీసుకోరు. న్యాయ సేతు ఉచిత సేవతో ఈ ఆందోళనలు తొలగిస్తుంది. మొదటిసారి ఉపయోగించే వారికి కూడా ప్రక్రియలు అర్థమవుతాయి. ఒత్తిడి లేకుండా మార్గదర్శనం ఇస్తుంది. ముఖ్యంగా గ్రామీణ, దూరపు ప్రాంత పౌరులకు ఎంతో ఉపయోగం. స్థలం ఏమైనా న్యాయం అందేలా చేస్తుంది.