BSNL Rapid Growth| దేశంలో ప్రభుత్వ టెలికాం కంపెనీ బిఎస్ఎన్ఎల్ రోజురోజుకూ తన నెట్వర్క్ పెంచుకుంటూ పోతోంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల కంటే తక్కువ ధరలో ఎక్కువ బెనిఫిట్స్ ఇచ్చే రీఛార్జ్ ప్లాన్స్ తో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఈ కారణంగా బిఎస్ఎన్ఎల్ యూజర్ బేస్ వేగంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రి జ్యోతిరాదిత్య స్కిందియా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారత్ టెలికాం రంగంపై కీలక అప్డేట్లు ఇచ్చారు. వోడాఫోన్ ఐడియా భవిష్యత్తు, బీఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరణ, 5G ప్రణాళికలపై చర్చించారు.
స్కిందియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. వోడాఫోన్పై ఇటీవల వచ్చిన సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం సమీక్షిస్తోంది. అధికారులు తీర్పును అధ్యయనం చేస్తూ.. అందుబాటులో ఉన్న ఆప్షన్లను పరిశీలిస్తున్నారు. ఇప్పుడు ఉన్న నిబంధనలను అణుగుణంగా అడుగులు వేయడం జరుగుతుంది. తుది నిర్ణయం తీసుకున్న తర్వాతే ప్రభుత్వం విధానం వివరంగా వెల్లడిస్తామని చెప్పారు.
ప్రైవేట్ టెలికాం ఆపరేటర్ వోడాఫోన్ ఐడియా (విఐ)లో ప్రభుత్వ వాటా 49 శాతానికి మించి ఉండదని.. వాటాని పెంచబోమని స్కిందియా స్పష్టం చేశారు. ఆ పరిమితి దాటితే కంపెనీ పబ్లిక్ సెక్టార్ యూనిట్ (PSU)గా మారిపోతుంది. అలాంటి ఉద్దేశం ప్రభుత్వానికి లేదని చెప్పారు. వోడాఫోన్ ప్రైవేట్ యాజమాన్యంలోనే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు.
వోడాఫోన్ ప్రస్తుతం మంచి క్యాష్ ఫ్లో కలిగి ఉందని స్కిందియా తెలిపారు. కంపెనీ ఆదాయం బాగానే ఉంది. ఫాలో-ఆన్ పబ్లిక్ ఆఫర్ ద్వారా దాదాపు రూ.20,000 కోట్లు సమీకరించింది. ఇక ఏజిఆర్ (AGR – Adjusted Gross Revenue) స్పెక్ట్రమ్ డ్యూస్ మినహాయిస్తే లెవరేజ్ తక్కువగానే ఉంది. దేశవ్యాప్తంగా సుమారు 20 కోట్ల కస్టమర్లకు సేవలందిస్తోంది. అయితే నెట్వర్క్ పెట్టుబడులు చాలా కీలకమని, సర్వీస్ క్వాలిటీ కాపాడుకోవాలంటే భారీ మూలధనం ఖర్చు చేయాల్సి ఉంటుందని అన్నారు.
వోడాఫోన్ ఐడియాకు సుమారు రూ.83,400 కోట్ల AGR బకాయిలు ఉన్నాయి. మార్చి నుంచి ప్రతి సంవత్సరం దాదాపు రూ.18,000 కోట్లు చెల్లించాలి. ఇది కంపెనీపై ఆర్థికంగా ఒత్తిడి తెస్తోంది. ప్రభుత్వం ఈ పరిస్థితిని సమీపంగా పర్యవేక్షిస్తోంది.
బిఎస్ఎన్ఎల్ 4G విస్తరణ ప్రణాళిక ప్రకారం సాగుతోందని స్కిందియా చెప్పారు. 1 లక్ష టవర్లలో 4G సేవలకు అనుమతి ఇచ్చాం. ఇప్పటివరకు దాదాపు 19,700 టవర్లు పనిచేస్తున్నాయి. దేశవ్యాప్తంగా నెట్వర్క్ను బలోపేతం చేయడమే లక్ష్యం.
బిఎస్ఎన్ఎల్ కస్టమర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 8.55 కోట్ల నుంచి దాదాపు 9.26 కోట్లకు చేరింది. మెరుగైన నెట్వర్క్ కవరేజ్ వల్లే ఈ వృద్ధి సాధ్యమైంది. ప్రభుత్వం ఈ పురోగతిని సానుకూలంగా చూస్తోంది.
బిఎస్ఎన్ఎల్ ముందు 4G రోల్అవుట్ పూర్తి చేసి స్థిరంగా అమలు చేసిన తర్వాతే 5Gకు వెళ్తామని స్కిందియా అన్నారు. బిఎస్ఎన్ఎల్ 5Gకి మారే రోజులు దూరంలో లేవు కానీ కచ్చితమైన టైమ్లైన్ గురించి చెప్పలేదు. క్వాలిటీతో కూడిన టెక్నాలజీ దేశవ్యాప్తంగా అమలు చేయడమే ప్రాధాన్యం.
గత దశాబ్దంలో టెలికాం రంగం వేగంగా వృద్ధి చెందింది. సబ్స్క్రైబర్లు 900 మిలియన్ నుంచి 1.2 బిలియన్ పైగా పెరిగారు. ఇంటర్నెట్ యూజర్లు 250 మిలియన్ నుంచి ఒక బిలియన్ పైగా ఉన్నారు. బ్రాడ్బ్యాండ్ కనెక్షన్లు 60 మిలియన్ నుంచి 945 మిలియన్కు చేరాయి.
2014లో నిమిషానికి కాల్ ధర 50 పైసలు ఉండేది. ఇప్పుడు కేవలం 0.03 పైసలు మాత్రమే. ఇది 97 శాతం తగ్గుదల. ఈ తక్కువ ధరల వల్ల దేశవ్యాప్తంగా డిజిటల్ యాక్సెస్ మెరుగైంది.
భారత్ ఇప్పుడు సొంత 4G టెక్నాలజీ స్టాక్ కలిగి ఉంది. ఇంతకు ముందు దక్షిణ కొరియా, చైనా, స్వీడన్, ఫిన్లాండ్ దేశాలు మాత్రమే ఈ సామర్థ్యం కలిగి ఉన్నాయి. ఇప్పుడు భారత్ ఈ ఎలైట్ గ్రూప్లో చేరింది.
ప్రభుత్వం స్థిరమైన టెలికాం వృద్ధిపై దృష్టి పెట్టింది. పెట్టుబడులు, ఆవిష్కరణలు, సరసమైన ధరలు ప్రధాన లక్ష్యాలు. భారత్ టెలికాం రంగం దీర్ఘకాలిక విస్తరణకు సిద్ధంగా ఉంది.