E-Paper
Advertisement

వేసవిలో అతిగా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా? వైద్యులు చెప్పింది వింటే బిత్తరపోతారు!

వేసవిలో అతిగా ఫ్రిడ్జ్ వాటర్ తాగుతున్నారా? వైద్యులు చెప్పింది వింటే బిత్తరపోతారు!
Advertisement

Health Tips: ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగలకు జనం అల్లాడిపోతున్నారు. ఈ విపరీతమైన వేడి నుంచి ఉపశమనం పొందడానికి చాలామంది ఇళ్లకు రాగానే ఫ్రిడ్జ్ లో ఉన్న ఐస్ వాటర్ తాగేస్తున్నారు. అదే సమయంలో ఏసీని ఫుల్ స్పీడ్‌లో ఆన్ చేసి గదిలో కూర్చుండిపోతున్నారు. అయితే ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. హీట్‌వేవ్ (వడగాల్పుల) సమయంలో ఐస్ వాటర్, ఏసీల మితిమీరిన వాడకం వల్ల ఎలాంటి నష్టాలు కలుగుతాయో ఈ కథనంలో పరిశీలిద్దాం.

ఐస్ వాటర్ తాగుతున్నారా?

బయట ఎండలో తిరిగి రాగానే గొంతు ఎండిపోయి, చల్లటి నీరు తాగాలనిపించడం సహజం. కానీ తీవ్రమైన వేడిలో ఉన్న శరీరంపై ఒక్కసారిగా ఐస్ వాటర్ పడటం వల్ల ‘థర్మల్ షాక్’ (Thermal Shock) తగిలే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చల్లటి నీరు తాగడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి జీర్ణక్రియ ప్రక్రియ సైతం దెబ్బతింటుందని పేర్కొంటున్నారు. ఐస్ వాటర్ శరీరంలోని ముఖ్యమైన ‘వాగస్ నరాన్ని’ (Vagus Nerve) ప్రేరేపించి.. హృదయ స్పందన రేటు (Heart rate) ఒక్కసారిగా పడిపోయే చేస్తుందని చెబుతున్నారు. గొంతు నొప్పి, టాన్సిల్స్, శ్వాసకోశ సమస్యలు సైతం వచ్చే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు.

ఏసీల అతి వాడకంతో ముప్పు

Advertisement

ఎండల దెబ్బకు తట్టుకోలేక రోజంతా ఏసీల్లోనే గడపడం కూడా మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. ఏసీలు గదిలోని తేమను పీల్చేస్తాయని.. దీనివల్ల మనకు తెలియకుండానే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందని పేర్కొంటున్నారు. దీనివల్ల చర్మం పొడిబారిపోయి మంట, దురద సమస్య రావొచ్చని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఎక్కువ సమయం ఏసీలో కూర్చోవడం వల్ల కండరాలు పట్టేయడం, కీళ్ల నొప్పులు (Joint pains) రావడం వంటివి జరుగుతుందని తెలియజేస్తున్నారు. ఏసీ ఫిల్టర్లను సరిగ్గా శుభ్రం చేయకపోతే వాటిలో చేరే దుమ్ము, బ్యాక్టీరియా వల్ల ఆస్తమా, అలర్జీలు ఎక్కువవుతాయని వివరిస్తున్నారు.

ఉష్ణోగ్రతల్లో అకస్మాత్తు మార్పు

వైద్యుల ప్రకారం.. ఉష్ణోగ్రతల్లో వచ్చే అకస్మిక మార్పు అన్నిటికంటే ప్రమాదకరం. 40 డిగ్రీల ఎండ నుంచి నేరుగా వచ్చి 18 డిగ్రీల ఏసీ రూమ్‌లోకి ప్రవేశించడం లేదా ఏసీ రూమ్ నుంచి నేరుగా ఎండలోకి వెళ్లడం వల్ల శరీరం ఆ ఉష్ణోగ్రత తట్టుకోలేదు. దీనివల్ల రోగనిరోధక శక్తి బలహీనపడి జ్వరం, జలుబు, తలనొప్పి వంటి సమస్యలు తక్షణమే రావొచ్చని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అటు ఎండ నుంచి రాగానే ఫ్రిడ్జ్ వాటర్ తాగినా కూడా ఇలాంటి సమస్యలే ఉత్పన్నమవుతాయని పేర్కొంటున్నారు.

Advertisement

Also Read: ఇక ఫ్రిడ్జ్ అవసరమే లేదు.. ఇంట్లోని మట్టి కుండనే ‘ఐస్’లా మార్చేయండి!

ఈ జాగ్రత్తలు పాటిస్తే సేఫ్

వేసవిలో ఫ్రిడ్జ్ నీళ్లకు బదులుగా కుండలో ఉంచిన చల్లటి నీటిని తాగడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బయట నుంచి రాగానే కనీసం 10 నుండి 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుని శరీర ఉష్ణోగ్రత సాధారణ స్థితికి వచ్చాక నీరు తాగాలని సూచిస్తున్నారు. మరోవైపు ఏసీని మరీ చల్లగా కాకుండా 24 నుండి 26 డిగ్రీల సెల్సియస్ వద్ద సెట్ చేసుకోవడం ఆరోగ్యానికి మంచిదని తెలియజేస్తున్నారు. మరోవైపు మజ్జిగ, కొబ్బరినీళ్లు, నిమ్మరసం వంటి సహజ పానీయాలు శరీరాన్ని చల్లబరచడానికి ఉత్తమమైన మార్గాలని తెలియజేస్తున్నారు. మెుత్తంగా తాత్కాలిక ఉపశమనం కోసం ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Also Read: ఏసీలో వింత శబ్దాలు వస్తున్నాయా? కారణం ఇదే కావొచ్చు.. జాగ్రత్త భయ్యో!

Related News

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

వార్నీ.. ఇన్నాళ్లూ స్మార్ట్‌ఫోన్ పవర్ బటన్‌ను వేస్ట్‌గా వాడామా? ఇందులో ఇంత మ్యాజిక్ ఉందా!

బడ్జెట్ ధరలో ప్రీమియం లుక్.. సూపర్ ఏఐ ఫీచర్స్ రియల్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్

జియో క్యూ1 రిజల్ట్స్.. భారీగా పెరిగిన లాభాలు.. రికార్డు స్థాయిలో కస్టమర్లు!

బిగ్ బ్యాటరీ, క్రేజీ AI ఫీచర్లతో రంగంలోకి దిగనున్న iQOO Z11 Lite 5G.. రేటు కూడా బడ్జెట్‌లోనే!

Big Stories

Advertisement
×