Alipay+ India UPI| చైనాకు చెందిన యాంట్ ఇంటర్నేష్నల్ (Ant International) కంపెనీ.. భారత ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అధికారులతో ఇటీవలే చర్చలు ప్రారంభించింది. ఈ చర్చల లక్ష్యం Alipay+ (అలిపే+) ను భారత్ డిజిటల్ పేమెంట్ సిస్టమ్ UPIతో జత చేయడం. ఈ విషయం Reuters (రాయిటర్స్) ఏక్స్క్లూసివ్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చింది. క్రాస్-బార్డర్ డిజిటల్ పేమెంట్లను మరింత సులభతరం చేయడమే ఈ చర్చల ఉద్దేశ్యం. ఈ ఏర్పాటు అమలులోకి వస్తే విదేశాల్లో ప్రయాణించే భారతీయులకు చాలా సౌకర్యం కలుగుతుంది.
ఈ సిస్టమ్ అమలైతే భారతీయ యూజర్లు యుపిఐ ద్వారా Alipay+ నెట్వర్క్లో ఉన్న విదేశీ మర్చంట్ల వద్ద చెల్లింపులు చేయగలుగుతారు. టూరిస్టులు, బిజినెస్ ప్రయాణికులు, విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. అలిపే+ ఇప్పటికే అనేక అంతర్జాతీయ డిజిటల్ వాలెట్లను ఒకే ప్లాట్ఫాంమ్లో జత చేసి పనిచేస్తోంది. ఈ ఇంటిగ్రేషన్ ద్వారా UPI ప్రపంచవ్యాప్తంగా త్వరగా విస్తరించే అవకాశం ఉంది.
యాంట్ ఇంటర్నేష్నల్ సింగపూర్ ఆధారిత కంపెనీ. అయితే దీన్ని చైనా ఫిన్టెక్ దిగ్గజం Ant Group స్థాపించింది కానీ ఇప్పుడు స్వతంత్రంగా పనిచేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అలిపే+ 1.8 బిలియన్ల యూజర్ అకౌంట్లను నిర్వహిస్తోంది. 150 మిలియన్లకు పైగా మర్చంట్లతో జత చేసి సేవలు అందిస్తోంది. ఆసియా, యూరప్, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా వంటి ప్రాంతాల్లో దీని ఉపస్థితి ఉంది.
భారత్లో యుపిఐ చెల్లింపుల విధానం అత్యంత ప్రజాదరణ పొందిన డిజిటల్ పేమెంట్ విధానం. ప్రతి నెల సుమారు 18 బిలియన్ ట్రాన్సాక్షన్లు జరుగుతున్నాయి. రోజువారీ కొనుగోళ్లు, బిల్లుల చెల్లింపులకు మిలియన్ల మంది యుపిఐని ఉపయోగిస్తున్నారు. ప్రభుత్వం UPIని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కృషి చేస్తోంది. దీనివల్ల విదేశాల్లో ఉండే భారతీయులు రూపాయల్లోనే సులభంగా చెల్లింపులు చేయగలుగుతున్నారు.
యుపిఐ, Alipay+ జత అయితే విదేశీ ప్రయాణాల్లో చెల్లింపులు చాలా సులభం అవుతాయి. మల్టీ పేమెంట్ సిస్టమ్స్ తీసుకెళ్లాల్సిన అవసరం తగ్గుతుంది. సాధారణంగా UPI యాప్లో స్కాన్ చేసి చెల్లించవచ్చు. ఇది ఫాస్ట్ సెటిల్మెంట్, మంచి యూజర్ ఎక్స్పీరియన్స్ని అందిస్తుంది.
Also Read: ఇన్స్టాగ్రామ్లో యాడ్స్తో విసిగిపోయారా? ఈ సెట్టింగ్స్తో ఈజీగా ఆఫ్ చేయండి
Alipay చైనా నేపథ్యం కలిగి ఉండటం వల్ల జాతీయ భద్రతా ఆందోళనలు ఉన్నాయి. భారత ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా భద్రతా అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. డేటా సెక్యూరిటీ, జియోపాలిటికల్ రిస్క్లపై దృష్టి పెట్టాలి. భారతీయ యూజర్ల డేటా సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇస్తాయి.
ఈ చర్చలు ఇంకా ప్రారంభ దశలో ఉన్నాయి. ఇది ఇంకా బహిరంగంగా ప్రకటించలేదు. 2020లో సరిహద్దు ఉద్రిక్తతల తర్వాత చైనా పెట్టుబడులపై భారత్ కఠిన నియమాలు విధించింది. ఆ నియమాలు ఇప్పటికీ అమలులో ఉన్నాయి. కాబట్టి ఈ నిర్ణయం టెక్నాలజీతో పాటు రాజకీయ, భద్రతా అంశాలపై ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రతిపాదనకు అనుమతి లభించాలంటే.. సాంకేతిక, వ్యూహాత్మక అంచనాలు అవసరం. భద్రతా క్లియరెన్స్, డిప్లొమాటిక్ అంశాలు కీలకం. ఒకవేళ ఆమోదం లభిస్తే UPI ప్రపంచ స్థాయి డిజిటల్ పేమెంట్ నెట్వర్క్గా మారవచ్చు.