ఏడాదిలో ఇస్రో తొలి రాకెట్ను ప్రయోగించింది. ఏపీలోని శ్రీహరి కోట అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 10గంటల 17నిమిషాలకు PSLV C62 రాకెట్ను ప్రయోగించారు. కాగా.. నిన్న ఉదయమే PSLV C62 రాకెట్ ప్రయోగానికి కౌంట్డౌన్ ప్రారంభమైంది.
2026లో.. ఇది ఇస్రో చేపడుతున్న తొలి ప్రయోగం. అంతేకాదు PSLV రాకెట్ ప్రయోగంలో ఇది 64వది. ఈ మిషన్ ద్వారా 1485 కిలోలు బరువు కలిగిన.. ఈవోఎస్-ఎన్ 1 అనే ఉపగ్రహాన్ని కక్ష్యలోకి పంపారు. ఈ ఉపగ్రహానికి అన్వేష అనే పేరు పెట్టారు. దీనితో పాటు 7 స్వదేశీ, 8 విదేశీ మైక్రో ఉపగ్రహాలను కక్ష్యలోకి చేరుకుంటాయి. కాగా.. ఇప్పటివరకు 442 విదేశీ ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రయోగించినట్లు ఇస్రో ఛైర్మన్ నారాయణ్ వెల్లడించారు.
ఇందులో DRDO అభివృద్ధి చేసిన ఈవోఎస్-ఎన్1 ప్రధాన పేలోడ్. ఇది మన దేశంలోని వ్యవసాయం, సిటీ మ్యాపింగ్, పర్యావరణ పర్యవేక్షణ, బార్డర్లలో వ్యూహాత్మక నిఘా వంటి రంగాల్లో సామర్థ్యాలను మరింత బలోపేతం చేస్తుంది. దీనికి తోడు ఈ మిషన్లో భారతీయ స్టార్టప్లు, అకాడమిక్ సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు అభివృద్ధి చేసిన ఆయుల్ శాట్, ఎంవోఐ-1, కీస్ట్రెల్ ఇనీషియల్ డెమోన్ స్ట్రేటర్ వంటి ఆసక్తికరమైన 14కో-ప్యాసెంజర్ పేలోడ్లు ఉన్నాయి.
ALSO READ: ఘోర ప్రమాదం.. ఎగ్జిబిషన్లో జనాలపైకి దూసుకెళ్లిన కారు!