Youtuber Car Accident: విజయవాడ నగరంలోని భవానిపురం ప్రాంతంలో ఉన్న బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ఆదివారం రాత్రి పెను ప్రమాదం చోటుచేసుకుంది. సరదాగా గడపడానికి వచ్చిన సందర్శకులపైకి ఓ కారు ఒక్కసారిగా దూసుకెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా బీభత్సం నెలకొంది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో మహిళలు, చిన్నపిల్లలు కూడా ఉన్నట్లు సమాచారం.
ఎగ్జిబిషన్ కావడంతో గ్రౌండ్స్ వద్ద ప్రజలు రద్దీ ఎక్కువగా ఉంది. ఆ సమయంలో అతివేగంతో వచ్చిన ఓ కారు అదుపుతప్పి పాదచారులపైకి దూసెకెళ్లింది. కారు వేగానికి కొందరు గాలిలో ఎగిరి పడగా.. మరికొందరు వాహనం కింద పడి నలిగిపోయారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు భయాందోళనలకు గురై అటు ఇటు పరుగులు తీశారు.
కారు నడుపుతున్న వ్యక్తి విపరీతంగా మద్యం సేవించి ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. మద్యం మత్తులో వాహనంపై నియంత్రణ కోల్పోవడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా విర్దారించారు. స్థానికుల సమాచారంతో పోలీసుల ఘటనా స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన అనంతరం నిందితుడు అక్కడి నుండి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరపగా.. ఆ కారు ప్రముఖ యూట్యూబర్కు చెందినదిగా గుర్తించారు.
ALSO READ: పందెం రాయుళ్లపై పోలీసుల ఉక్కుపాదం.. నున్నలో కోడి పందాల బరులు ధ్వంసం!
విజయవాడ భవానిపురం బొబ్బూరి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ ప్రాంగణంలో కారు పాదచారులపైకి దూసుకెళ్లి బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. నిందితుడు మద్యం సేవించి వాహనం నడిపినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ కారు ఒక యూట్యూబర్దిగా పోలీసులు గుర్తించారు. బాధితులను… pic.twitter.com/Z81NhFqwnf
— ChotaNews App (@ChotaNewsApp) January 11, 2026