Samsung New 5G Phones: స్మార్ట్ఫోన్ ప్రియులకు శాంసంగ్ సంస్థ త్వరలోనే ఒక తీపి కబురు అందించబోతోంది. భారత మిడ్రేంజ్ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తమ పట్టును మరింత బలోపేతం చేసుకునేందుకు కంపెనీ సిద్ధమైంది. ఇందులో భాగంగా Galaxy M47 5G, Galaxy F70 Pro 5G అనే రెండు శక్తివంతమైన ఫోన్లను దేశీయ మార్కెట్లోకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది.
ఇటీవలే బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) సర్టిఫికేషన్ వెబ్సైట్లో ఈ రెండు ఫోన్లు కనిపించాయి. సాధారణంగా ఈ సర్టిఫికేషన్ లభించిందంటే ఆ ఫోన్లు మార్కెట్లోకి రావడానికి ఎంతో సమయం పట్టదని అర్థం. ఈ మోడళ్లు డ్యూయల్ సిమ్ సపోర్టుతో రానున్నట్లు తెలుస్తోంది. ఇవి రెండూ దాదాపు ఒకేలాంటి ఫీచర్లతో విభిన్న పేర్లతో విడుదలయ్యే అవకాశం ఉంది.
తాజాగా లీకైన నివేదికల ప్రకారం.. Galaxy M47 5G ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 6 జెన్ 3 ప్రాసెసర్తో రానుంది. దీనివల్ల మల్టీటాస్కింగ్, గేమింగ్ వంటివి చాలా స్మూత్గా సాగుతాయి. అంతేకాదు.. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ఆదా చేస్తుంది. అలాగే ఇందులో 8GB RAM వేరియంట్ అందుబాటులో ఉండనుంది.
Also Read: AC యూజర్స్కు అలర్ట్.. ఈ 6 మ్యాజిక్ సీక్రెట్స్ తెలిస్తే.. పవర్ బిల్లు సగానికి తగ్గడం ఖాయం!
ఈ సరికొత్త స్మార్ట్ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత వన్ యూఐ 8 సాఫ్ట్వేర్తో పనిచేస్తాయి. దీనివల్ల వినియోగదారులకు సరికొత్త, వేగవంతమైన మొబైల్ అనుభూతి లభిస్తుంది. యువతను, ఎక్కువగా ఫోన్ వాడేవారిని ఆకట్టుకునేలా దీని సాఫ్ట్వేర్ డిజైన్ ఉండబోతోంది. శాంసంగ్ తమ ఫోన్లకు ఇచ్చే దీర్ఘకాలిక సాఫ్ట్వేర్ అప్డేట్ల వ్యూహం ఇందులోనూ కొనసాగనుంది.
ప్రస్తుతం మార్కెట్లో మిడ్రేంజ్ ఫోన్ల మధ్య పోటీ చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో పెట్టుకుని శాంంసంగ్ ఈ ఫోన్లను అందుబాటు ధరలోనే ప్రీమియం ఫీచర్లతో లాంచ్ చేయనుంది. ముఖ్యంగా ఆన్లైన్ ప్రియులను ఆకట్టుకునేలా Galaxy F70 Pro 5G మోడల్ను మంచి బ్యాటరీ బ్యాకప్, బడ్జెట్ ధరలో అందించే అవకాశం ఉంది.
శాంసంగ్ ఈ ఫోన్ల విడుదల తేదీని అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. కానీ రానున్న కొద్ది వారాల్లోనే ఇవి మార్కెట్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. కెమెరా, బ్యాటరీ సైజ్, ఖచ్చితమైన ధర వంటి మరిన్ని వివరాలు త్వరలోనే వెల్లడి కానున్నాయి. బడ్జెట్ ధరలో మంచి 5G ఫోన్ కోసం చూసేవారికి ఇవి ఉత్తమ ఎంపిక కానున్నాయి.
Also Read: మన ఏసీల వాడకం చూసి తెల్లబోయిన అమెరికా అమ్మడు.. ఇండియాకు, యూఎస్కు ఇంత తేడా ఉందా!