E-Paper
Advertisement

In-Call Scam Alert: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది

In-Call Scam Alert: సైబర్ దొంగల గేమ్ ఓవర్.. పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ వచ్చేసింది
Advertisement

In-Call Scam Alert| భారత్‌లో రోజూ లక్షల మంది స్మార్ట్‌ఫోన్ యూజర్లు ఫ్రాడ్ కాల్స్, స్పామ్ కాల్స్ బారిన పడి మోసపోతున్నారు. ఈ తీవ్ర సమస్యకు పరిష్కారంగా ఒక పవర్‌ఫుల్ యాంటీ ఫ్రాడ్ ఫీచర్ తీసుకొచ్చింది గూగుల్. ఇది ఒక అద్భుతమైన సెక్యూరిటీ ఫీచర్ తెచ్చింది. దీని పేరు “ఇన్-కాల్ స్కామ్ ప్రొటెక్షన్”. ఈ ఫీచర్ సైబర్ మోసగాళ్ల నుంచి మీ డబ్బును 100 శాతం కాపాడుతుంది. ఈ కొత్త ఫీచర్ ఎలా పని చేస్తుందో చూద్దాం!

ఈ ఫీచర్ ఎలా పని చేస్తుంది?

మీకు కొత్త నెంబర్ లేదా తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే ఈ ఫీచర్ ఆటోమాటిక్‌గా ఆన్ అవుతుంది. కాల్‌లో ఉండగానే మీరు ఏదైనా బ్యాంక్ యాప్ లేదా పేమెంట్ యాప్ (Google Pay, Paytm, PhonePe) ఓపెన్ చేయగానే స్క్రీన్‌పై పెద్ద వార్నింగ్ వస్తుంది – “జాగ్రత్త! ఇది మోసం కావచ్చు!” అని రాసి ఉంటుంది.

రెండో సారి ఓపెన్ చేసినా లేదా పొరపాటున ఓపెన్ చేసినా..

Advertisement

మొదటి వార్నింగ్‌ను కొందరు పట్టించుకోరు. మళ్లీ యాప్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తే… ఫోన్ 30 సెకన్ల పాటు లాక్ అయిపోతుంది! ఆ 30 సెకన్లలో మీరు ఆలోచించే అవకాశం వస్తుంది – “నిజంగానే బ్యాంక్ నుంచి కాల్ వచ్చిందా? లేదా మోసమా?” అని మీరు ఆ సమయంలో పరిశీలించాలి. ఈ చిన్న ఆలస్యం వల్ల మీ బ్యాంక్ లో ఉండే డబ్బును ఎవరూ దోచుకోకుండా కాపాడుతుంది.

30 సెకన్ల ఆలస్యం ఎందుకు ముఖ్యం?

మోసగాళ్లు ఎప్పుడూ “త్వరగా చెయ్… అకౌంట్ లాక్ అయిపోతుంది… ఇప్పుడే డబ్బు పంపు” అని ఫోన్ లో మాట్లాడుతూ ఒత్తిడి చేస్తారు. ఆ ఒత్తిడిని ఈ ఫీచర్ 30 సెకన్లు పూర్తిగా ఆపేస్తుంది. ఆ సమయంలో మీరు కాల్ కట్ చేసి సురక్షితంగా ఉండవచ్చు.

ఏ యాప్స్‌తో ఈ ఫీచర్ పని చేస్తుంది?

Advertisement

ఇప్పటికే గూగుల్ పే, పేటిఎం, Navi వంటి పెద్ద పేమెంట్ యాప్స్‌తో ఈ ఫీచర్ లింక్ అయింది. త్వరలో ఫోన్‌పె, భారత్‌పే, లాంటి మిగతా యాప్స్ కూడా ఈ ఫీచర్ తో లింక్ అవుతాయి. ప్రస్తుతం ఇది ఇంకా పైలట్ ప్రాజెక్ట్‌గా ఉంది, కానీ చాలా బాగా పని చేస్తోంది.

మీ ఫోన్‌లో ఈ ఫీచర్ రావాలంటే ఏం చేయాలి?

మీ ఫోన్ ఆండ్రాయిడ్ 11 లేదా అంతకంటే కొత్త వెర్షన్‌లో ఉండాలి. పాత ఫోన్ ఉంటే ఈ ఫీచర్ పని చేయదు. ఇప్పుడే సెట్టింగ్స్‌లోకి వెళ్లి సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోండి. ఈ ఫీచర్ ప్రస్తుతం కేవలం భారత్‌లోనే లభిస్తోంది.

మోసగాళ్లు సాధారణంగా ఇలా చేస్తారు

తాము బ్యాంక్ సిబ్బంది అని ఫోన్ చేసి.. “సర్ మీ అకౌంట్‌లో రూ.50 వేలు డిపాజిట్ అయింది… త్వరగా Google Pay ఓపెన్ చేసి OTP చెప్పండి” అని చెప్పి భయపెట్టడం లేదా ఒత్తిడి చేస్తారు. ఆ తొందరపాటులోనే చాలామంది వారు చెప్పినట్లు చేసి మొత్తం అకౌంట్‌లోని డబ్బులు పోగొట్టుకుంటారు. అందుకే ఇకపై ఇలాంటి కాల్స్ వచ్చినప్పుడు గూగుల్ ఫీచర్ మిమ్మల్ని హెచ్చరిస్తుంది. మోసగాళ్లకు ఇక చాన్స్ ఉండదు.

Also Read: స్వయంగా పనులన్నీ చేసే ఫోన్ లాంచ్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏజెంటిక్ AI  స్మార్ట్‌ఫోన్.. టచ్ చేయాల్సిన అవసరం లేదు

Related News

Facebook వాడే ప్రతి ఒక్కరూ మార్చాల్సిన 5 సీక్రెట్ సెక్యూరిటీ సెట్టింగ్స్ ఇవే!

iPhone 18 Pro Max లీక్స్.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లాకే, కానీ ఆ ఒక్కటే పెద్ద ట్విస్ట్!

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

Big Stories

Advertisement
×