Andre Russell: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) నేపథ్యంలో ఇప్పటికే రిటెన్షన్ ప్రక్రియ ముగిసిన సంగతి అందరికీ తెలిసిందే. నవంబర్ 15వ తేదీన రెండు రోజుల కిందట రిటెన్షన్ లిస్టును అలాగే రిలీజ్ లిస్టును 10 జట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇందులో కీలక ప్లేయర్లను అంటిపెట్టుకొని ఉన్న జట్లు, అదే సమయంలో కొంతమంది డేంజర్ ప్లేయర్లను వదిలేశారు. ఈ లిస్టులో కేకేఆర్ డేంజర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ( Andre Russell ) కూడా ఉన్నాడు. దాదాపు 11 సంవత్సరాల పాటు కేకేఆర్ కు సేవలు అందించిన ఆండ్రీ రస్సెల్ ఇప్పుడు మినీ వేలంలోకి దిగబోతున్నాడు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో డిసెంబర్ 16వ తేదీన మినీ వేలం జరగనుంది. ముంబైలో కాకుండా అబుదాబి వేదికగా ఈ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. మొత్తం 77 స్లాట్ ల కోసం ఈ మినీ వేలాన్ని నిర్వహిస్తున్నారు. 77 స్లాట్ ల కోసం వందల సంఖ్యలో ప్లేయర్లు పాల్గొంటారని సమాచారం. అదే సమయంలో మొన్న రిలీజ్ అయిన ప్లేయర్లు కూడా బరిలో ఉండే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో కేకేఆర్ డేంజర్ ఆల్ రౌండర్ ఆండ్రీ రస్సెల్ ను ఎవరు కొనుగోలు చేస్తారనే టెన్షన్ అందరిలోనూ ఉంది. సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు (Sunrisers Hyderabad team ) కన్ను పడిందట.
ఎలాగైనా అతని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారట కావ్య పాప. ఆండ్రీ రస్సెల్ లాంటి ప్లేయర్ జట్టులోకి వస్తే, ఆల్రౌండర్ గా బాగా పనికి వస్తాడు. ఆడం జంపాను వదిలేసారు కాబట్టి , విదేశీ ప్లేయర్ కింద ఆండ్రీ రస్సెల్ ను కొనుగోలు చేసే ఛాన్సులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి తగ్గట్టుగానే తాజాగా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సంబంధించిన సోషల్ మీడియా అకౌంటును ఆండ్రీ రస్సెల్ ఫాలో అయినట్లు తెలుస్తోంది. దీంతో వీళ్ళ ఇద్దరి మధ్య డీలింగ్ కుదిరినట్లు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. దీంతో తెలుగు అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాక్షసుడు లాంటి ఆండ్రీ రస్సెల్ హైదరాబాద్ లోకి వస్తే, ఇక చుక్కలే అంటున్నారు.
ఐపీఎల్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం చాలా తెలివిగా ముందుకు వెళ్తోంది. ఇందులో భాగంగానే కీలక ప్లేయర్లను రిటైన్ చేసుకుంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, అనికేత్ వర్మ, సమరన్, ఇశాన్ కిషన్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, హర్ష దుబే, ప్యాట్ కమిన్స్ లాంటి ప్లేయర్లను మరోసారి జట్టులోకి తీసుకుంది. మహమ్మద్ షమీని ట్రేడ్ ప్రక్రియ ద్వారా లక్నో పంపించింది. ఇక ఇప్పుడు హైదరాబాద్ పర్స్ వ్యాల్యూ రూ.20 లక్షలు మాత్రమే ఉంది.