Ravi Shastri pick indian ODI Wc 2027 Squad: 2027 వన్డే వరల్డ్ కప్ కోసం (ODI Wc 2027 Squad ) ఇప్పటి నుంచి అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి. అటు ఇప్పటికే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ కు సంబంధించిన కొత్త ఫార్మాట్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ విడుదల చేసింది. దీని ప్రకారం బలమైన జట్ల మధ్య ఎక్కువ మ్యాచ్ లు జరగనున్నాయి. ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య కూడా మొత్తం మూడు మ్యాచ్లు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అంటే 2027 వన్డే వరల్డ్ కప్ టోర్నమెంట్ చాలా ఉత్కంఠ భరితంగా సాగనుందన్నమాట. ఈ క్రమంలో 2027 వన్డే వరల్డ్ కప్ కోసం టీమిండియాకు చెందిన 15 మంది సభ్యులను ప్రకటించారు మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి. తానే కోచ్ గా ఉంటే… బలమైన జట్టును తయారు చేస్తానని.. మొత్తం 15 మంది ప్లేయర్లను ప్రకటించాడు.
2027 వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో తన డ్రీమ్ టీమిండియా జట్టును రవి శాస్త్రి ప్రకటించడం జరిగింది. ఆయన ప్రకటించిన జట్టులో నలుగురు డేంజర్ బౌలర్లు ఉన్నారు. మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, బుమ్రా లాంటి భయంకరమైన నలుగురు బౌలర్లు ఈ జట్టులో ఉండడం గమనార్హం. ఈ నలుగురు బరిలోకి దిగితే మాత్రం టీమిండియాను తట్టుకోవడం కష్టమే. దక్షిణాఫ్రికా గడ్డపైన ఈ నలుగురు బౌలర్లు అత్యంత ప్రమాదకరంగా బౌలింగ్ చేసే ఛాన్సులు ఉంటాయి. బౌన్సర్లు వేయడంలో వీళ్లు దిట్ట. ఇలాంటి క్రమంలో నలుగురు పేర్లను రవి శాస్త్రి ఫైనల్ చేశాడు.. అయితే ఇందులో ముగ్గురిని గౌతమ్ గంభీర్ ఇప్పటికే పక్కకు పెట్టాడు. బుమ్రాను మాత్రమే గంభీర్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రసిద్ కృష్ణ, హర్షిత్ రాణా, గురునూర్ లాంటి బచ్చా క్రికెటర్లకు అవకాశం ఇచ్చేలా గంభీర్ ప్లాన్స్ కనిపిస్తున్నాయి.
వన్డే వరల్డ్ కప్ 2027 టోర్నమెంట్ ( ODI World Cup 2027 ) నేపథ్యంలో రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ అవసరం టీమిండియాకు చాలా ఉందని రవిశాస్త్రి వెల్లడించారు. ఆ ఇద్దరి అనుభవం టీమిండియాకు వరల్డ్ కప్ లో ఉపయోగపడుతుందని తెలిపారు. అదే సమయంలో యశస్వి జైష్వాల్, కేఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్ లాంటి కీలక బ్యాటర్లకు కూడా అవకాశం ఇచ్చారు. ఇక ఆల్రౌండర్ల కింద హార్దిక్ పాండ్యా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజాలను పరిగణలోకి తీసుకున్నాడు. కుల్దీప్ యాదవ్ ఒక్కడే స్పిన్నర్ గా ఉన్నాడు. అంటే కుల్దీప్ యాదవ్ తో పాటు అక్షర్ పటేల్ లేదా రవీంద్ర జడేజా స్పిన్ విభాగంలో మెరువనున్నారు.
Also Read: Hasan Ali in a pickpocketing case: పిక్ పాకెట్ కేసులో హసన్ అలీ..తోలు తీసిన ఇండియన్ పోలీసులు !