E-Paper
Advertisement

Aus ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..

Aus ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జోబర్న్స్, నా టాలెంట్ చూపిస్తా..
Advertisement

Australia ex cricketer Joe Burns focus T20 WC: ఆసీస్ మాజీ ఆటగాడు జో బర్న్స్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. ఇప్పటికే ఆస్ట్రేలియాను వీడాడు ఈ ఆటగాడు. ఇటలీ క్రికెట్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాలని నిర్ణయం తీసుకోవడం, ప్రకటించడం జరిగింది. మరో రెండేళ్లలో టీ20 ప్రపంచకప్ జరగనుంది. అప్పటికి ఇటలీ జట్టు అర్హత సాధించేలా చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నాడు.

ఇటలీ ఇప్పటివరకు ఏ ఫార్మాట్‌లోనూ ప్రపంచకప్‌కు అర్హత సాధించలేదు. జూన్ 9 జరగనున్న వరల్డ్ కప్ రీజియన్ క్వాలిప్లయర్స్‌లో ఆ జట్టు తన అదృష్టాన్ని పరీక్షంచుకోనుంది. ఇందులో ఇటలీ, ఫ్రాన్స్, ఇసిల్ ఆఫ్ మ్యాన్, లక్సంబర్గ్, టర్కీ జట్లు పోటీ పడుతున్నాయి.

Advertisement

బర్న్స్ ఇటలీ పౌరసత్వం కలగడానికి కారణాలు చాలానే ఉన్నాయి. ముఖ్యంగా ఆయన తల్లికి అక్కడి పౌరసత్వం ఉండడంతో ఆ దేశానికి ప్రాతినిథ్యం వహించేందుకు అర్హత సాధించాడు. ఈ ఏడాది జో బర్న్స్ సోదరుడు డొమ్నిక్ చనిపోయాడు. సోదరుడు గౌరవార్థం తన జెర్సీపై 85 నెంబరు ధరించనున్నాడు. డొమ్నిక్ తన చివరి మ్యాచ్‌లో అదే నెంబర్ గల జెర్సీని ధరించినట్టు వెల్లడించాడు.

ALSO READ: అమెరికాలో తొలిసారి.. టీ 20 ప్రపంచకప్ క్రికెట్ పోటీలు

Advertisement

అన్ని‌వైపుల నుంచి క్లారిటీ రావడంతో ఇటలీ జట్టుపై ఫోకస్ పెట్టాడు జో బర్న్స్. 34 ఏళ్ల ఈ ఆటగాడు 2014-20 మధ్యలో ఆసీస్ తరపున 23 టెస్టులు, ఆరు వన్డేలు ఆడాడు. అందులో నాలుగు టెస్ట్ సెంచరీలు, 8 హాఫ్ సెంచరీలున్నాయి.

 

Tags

Related News

తమిళనాడులో పార్టీ పెడితే, వచ్చే ఎన్నికల్లో ధోని సీఎం కావడం పక్కా?

నా అల్లుడిపై బ్యాన్ వేస్తే, అంద‌రి భాగోతాలు బ‌య‌ట‌పెడ‌తా..ఇంజ‌మామ్ హెచ్చ‌రిక‌

మ‌రో వివాదంలో మ‌హ్మ‌ద్ రిజ్వాన్..డ్ర‌గ్స్ తీసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు !

బాబ‌ర్ ఆజం గొప్పోడని డ‌బ్బా కొట్ట‌డం త‌ప్ప‌, పీకిందేమీ లేదు..అంతా ప్ర‌చారం మాత్ర‌మే

ఓయో రూంల్లో ఉండ‌నున్న టీమిండియా ప్లేయ‌ర్లు ?

ధోని చాణ‌క్యం…బెంగాలీ రాద‌ని డ్రామాలు ఆడి బంగ్లా ప‌ళ్లు రాలగొట్టాడు

ఇంగ్లండ్ చేతిలో వైట్ వాష్ అయినా, టీమిండియా అంతు చూస్తాం !

స్మృతి మందాన‌ బ్యాట్ లో AI చిప్స్…అందుకే సెంచ‌రీ చేసింది

Big Stories

Advertisement
×