Mohsin Naqvi On Team India: పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. పాకిస్తాన్ క్రికెట్ జట్టు (Pakistan cricket team) దారుణమైన పరిస్థితికి కారణం మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) అంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. వెంటనే అతడిని రాజీనామా చేయించాలని డిమాండ్లు చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో తనను ట్రోల్ చేసే వాళ్లకు మొహ్సిన్ నఖ్వీ తన స్టైల్ లో రియాక్ట్ అయ్యారు. ఐర్లాండ్ చేతిలో కూడా టీమిండియా ఓడిపోయిందని… అప్పుడు ఈ ట్రోల్ చేసేవాళ్లు పడుకున్నారా? ఒక్క సిరీస్ ఓడిపోతే నన్ను రాజీనామా చేయమంటారా ? అంటూ రేంజ్ లో ఫైర్ అయ్యారు. దీంతో మొహ్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇంగ్లాండ్ వర్సెస్ పాకిస్తాన్ (England vs Pakistan) మధ్య టెస్ట్ సిరీస్ జరుగుతున్న నేపథ్యంలో తనపై వస్తున్న ట్రోలింగ్ ను ఉద్దేశించి మొహ్సిన్ నఖ్వీ ( Mohsin Naqvi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణాఫ్రికా ఇటీవల కాలంలోనే నమీబియా చేతిలో ఓడిపోయింది… అటు ఐర్లాండ్ చేతిలో ఇండియా కూడా ఓడిపోయిందని గుర్తు చేసిన మొహ్సిన్ నఖ్వీ.. పాకిస్తాన్ ఒకే ఒక్క మ్యాచ్ ఓడిపోతే ఏమైంది ? అంటూ ప్రశ్నించారు. ఒక సిరీస్ ఓడిపోతే పాకిస్తాన్ క్రికెట్ అంతరించిపోతుందా? అంటూ నిలదీశారు. అందరూ భ్రమ పడుతున్నారు కానీ.. పాకిస్తాన్ క్రికెట్ ( Pakistan Cricket) ఎక్కడ కూడా అంతరించిపోదు.. వరల్డ్ కప్ ల మీద వరల్డ్ కప్ లు గెలుస్తామని ఎదురు దాడికి దిగారు మొహ్సిన్ నఖ్వీ. ఐర్లాండ్ చేతిలో గెలవలేని టీమిండియా కూడా విర్రవీగుతూ మాట్లాడడం చాలా దారుణం అన్నారు. దీంతో మొహ్సిన్ నఖ్వీ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
బాబర్ ఆజం కెప్టెన్సీలోని పాకిస్తాన్ జట్టు ఇటీవల ఇంగ్లాండ్ గడ్డపై అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే ఇంగ్లాండ్ తో రెండు టెస్టులు ఆడింది. ఇందులో రెండింటిలో ఓడిపోయింది పాకిస్తాన్. దీంతో మరో టెస్ట్ మిగిలి ఉండగానే సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ క్రికెట్ జట్టు పై దారుణంగా విమర్శలు వస్తున్నాయి. వైట్ వాష్ కావడం గ్యారెంటీ అని క్రికెట్ అభిమానులు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా, సెప్టెంబర్ 9వ తేదీ నుంచి ఇంగ్లండ్ వర్సెస్ పాకిస్తాన్ మధ్య మూడో టెస్ట్ జరుగనుంది.