E-Paper
Advertisement

ఇంకా అయిపోలేదు..వన్డేల్లో కూడా వైట్ వాష్ చేస్తాం

ఇంకా అయిపోలేదు..వన్డేల్లో కూడా వైట్ వాష్ చేస్తాం
Advertisement

Brendon McCullum:  టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ (Team India vs. England) మధ్య నిన్నటి వరకు జరిగిన టి20 సిరీస్ ముగిసింది. ఈ టోర్నమెంటులో టీమిండియా క్రికెటర్లు చెత్త ప్రదర్శన కనబరిచి, దారుణంగా ఓడిపోయారు. ఈ క్రమంలో ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయిన టీమిండియా… ఇంగ్లాండ్ చేతిలో కూడా 4-0 తేడాతో అత్యంత దారుణంగా ఓటమిపాలైంది. ఈ ఓటమి నేపథ్యంలో టీ20 ర్యాంకింగ్స్ లో కూడా టీమిండియా దిగజారి రెండో స్థానానికి పరిమితం అయింది. అయితే ఈ టోర్నమెంట్ ముగిసిన నేపథ్యంలో వన్డే సిరీస్ కూడా ఈ రెండు జట్ల మధ్య జరగనుంది. ఎల్లుండి నుంచి అంటే జూలై 14 వ తేదీ నుంచి ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య వన్డే సిరీస్ షురూ అవుతుంది. ఈ క్రమంలో టీమిండియాకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్‌కలమ్ (Brendon McCullum). టి20 సిరీస్ తరహాలోనే వన్డే సిరీస్ లో కూడా టీమిండియాను వైట్ వాష్ చేస్తామని హెచ్చరించారు. ఈ మేరకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వెల్లడించారు.

Also Read: Mohammad kaif blasts selectors Over Team India Vs England : శివమ్‌ దూబే కంటే ముందు హ‌ర్షిత్ రాణాను తీసుకురావ‌డం గంభీర్ ముర్ఖ‌త్వమే 

ఇంకా అయిపోలేదు..వన్డేల్లో కూడా వైట్ వాష్ చేస్తామంటూ

Advertisement

టీమిండియా ఇప్పటికే టీ20 సిరీస్ లో వైట్ వాష్ అయిన సంగతి తెలిసిందే. జూలై 14 వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం కానుంది. ఇలాంటి క్రమంలో టీమిండియా జట్టుకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బ్రెండన్ మెక్‌కలమ్ (Brendon McCullum). టి20 సిరీస్ లో టీమిండియాను పక్కా ప్లాన్ తో దెబ్బ కొట్టినట్లు వివరించారు. తమ ప్లేయర్లు అద్భుతంగా రాణించి సిరీస్ కైవసం చేసుకున్నట్లు కొనియాడారు. ఇక ఇప్పుడు ODI సిరీస్ పైన ఫోకస్ చేసినట్లు స్పష్టం చేశారు. విరాట్ కోహ్లీ అలాగే రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్లు టీమిండియాలోకి వస్తున్నారు.

బుమ్రా, కేఎల్ రాహుల్, గిల్ కూడా రంగంలోకి దిగబోతున్నాడు. ఇలాంటి క్రమంలో సరికొత్త ప్లాన్ వర్కౌట్ చేసి ఇండియన్ ఓడిస్తామని హెచ్చరించారు. టి20 తరహాలోనే వన్డేల్లో కూడా టీమ్ ఇండియాను చిత్తుగా ఓడించకపోతే తన పేరు మార్చుకుంటాను అని సవాల్ కూడా విసిరారు. టీమిండియా నెగిటివ్ పాయింట్స్ అన్ని కూడా తమకు తెలుసని… రోహిత్ శర్మ అలాగే విరాట్ కోహ్లీ లాంటి కీలక ప్లేయర్లకు స్కెచ్ కూడా వేసినట్లు స్పష్టం చేశారు. వాళ్ల వికెట్లు తీస్తే టీమిండియా పని అయిపోతుందని వార్నింగ్ ఇచ్చారు. బుమ్రా బౌలింగ్ ను కూడా పరిగణలోకి తీసుకొని తమ ప్లేయర్లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు.

వన్డే సిరీస్ ఎప్పటి నుంచి అంటే ?

Advertisement

టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య తొలి వన్డే మ్యాచ్ జూలై 14 వ తేదీన జరగనుంది. జులై 16వ తేదీన రెండవ వన్డే  19వ తేదీన చిట్ట చివరి మ్యాచ్ ఉంటుంది. ఈ మ్యాచ్ లు మధ్యాహ్నమే ప్రారంభం కానున్నాయి.

Also Read: Inzamam-ul-Haq Reaction On Team India Kohli Vs Shreyas Iyer : కోహ్లీ కంటే శ్రేయ‌స్ అయ్య‌రే బెట‌ర్ కెప్టెన్‌..టీమిండియాకు ఎలాంటి ఢోకా లేదు

 

Related News

ఇది రివెంజ్ టైమ్..ఇంగ్లాండ్ ప్లేయ‌ర్ల ప్యాంట్లు త‌డిచిపోవాలి

న‌న్ను కాద‌నుకున్నారు…ఇక అనుభ‌వించండి, గంభీర్ కు సూర్య కౌంట‌ర్ !

ద‌రిద్రంగా మారిన మోడీ స్టేడియం..అప్పుడు ఆస్ట్రేలియా, CSK..ఇప్పుడు టీమిండియా !

ఐపీఎల్ లో ఆడి వీర్ర‌వీగారు..ఇప్పుడు విదేశీ గ‌డ్డ‌పై బొక్కా బోర్లా ప‌డ్డారు

నా అకాడమీలో చేరండి..ఫీల్డింగ్ నేర్పిస్తా, టీమిండియా ప‌రువు తీసిన వాన్‌

నువ్వు ఏం పీకావని ఏడ్చుస్తున్నావ్…వైభ‌వ్ పై రెచ్చిపోయిన కైఫ్‌!

ఇంగ్లండ్ బౌల‌ర్ల దెబ్బ‌కు..క్రీజులో ఉండ‌టానికే దూబే వ‌ణికిపోతున్నాడు

Big Stories

Advertisement
×