Vikrant Gupta: టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య నిన్నటి వరకు జరిగిన టి20 సిరీస్ ముగిసింది. ఇందులో వరుసగా నాలుగింటిలో విజయం సాధించిన ఇంగ్లాండు వైట్ వాష్ చేసింది. ఐర్లాండ్ చేతిలో రెండు టీ20 లో ఓడిపోయిన టీమిండియా.. ఇంగ్లాండ్ చిత్తుగా ఓడాల్సి వచ్చింది. ఈ క్రమంలో టీమిండియా జట్టుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. అలాగే ఎల్లుండి నుంచి టీమిండియా ఆడబోయే వన్డే సిరీస్ నేపథ్యంలో కూడా ప్లేయర్లపై ఒత్తిడి నెలకొంది. టి20 సిరీస్ కోల్పోయిన నేపథ్యంలో… వన్డే సిరీస్ అయినా గెలవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారత స్పోర్ట్స్ జర్నలిస్టు విక్రాంత్ గుప్తా (Vikrant Gupta ) సంచలన వ్యాఖ్యలు చేశారు. టి20 సిరీస్ ఎలాగూ కోల్పోయాం… వన్డే సిరీస్ అయిన గెలవండి మీకు దండం పెడతా అంటూ వేడుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి దిగ్గజ క్రికెటర్లు వస్తున్నారు కాబట్టి కచ్చితంగా గెలవాలని.. ఇండియా పరువు కాపాడాలని సంచలన పోస్ట్ పెట్టారు.
జులై 14 వ తేదీ నుంచి టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే టీమిండియా పై స్పోర్ట్స్ జర్నలిస్టు విక్రాంత్ గుప్తా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంగ్లాండ్ అలాగే ఐర్లాండ్ చేతిలో ఇప్పటికే టీమిండియా చిత్తు చిత్తుగా ఓడిపోయినట్లు వెల్లడించిన విక్రాంత్ గుప్తా (Vikrant Gupta )… ఇంగ్లాండ్ పై వన్డే సిరీస్ మాత్రం గెలవాలని రిక్వెస్ట్ చేశారు. మొన్నటి వరకు యంగ్ టీమ్ ఇండియా… ఇంగ్లాండ్ ను తట్టుకోలేక చతికల పడిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, గిల్, కేఎల్ రాహుల్, బుమ్రా వస్తున్నారని… ఈ ప్లేయర్ల ఆధ్వర్యంలో టీమిండియా వన్డే సిరీస్ గెలవడం గ్యారెంటీ అన్నారు.
కుర్ర టీం ఇండియాను దెబ్బ కొట్టిన ఇంగ్లాండుపై సీనియర్ క్రికెటర్లు రివేంజ్ తీర్చుకోవాలని పోస్ట్ పెట్టారు. దయచేసి ఇండియా పరువు కాపాడేందుకు సీనియర్ క్రికెట్లను అద్భుతంగా రానించి… ఇంగ్లాండ్ ను వైట్ వాష్ చేయాలని స్పష్టం చేశారు. అప్పుడే టీమిండియా పరువు దక్కుతుందని వెల్లడించారు విక్రాంత్ గుప్తా. ఇది ఇలా ఉండగా, టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య ఎల్లుండి నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జూలై 14వ తేదీన మొదటి వన్డే జరుగుతుంది. జులై 16వ తేదీన రెండవ వండే ఉండగా చివరి వన్డే జూలై 19వ తేదీన లార్డ్స్ వేదికగా ఉంటుంది. ఈ మ్యాచ్ లు అన్నీ కూడా దాదాపు మధ్యాహ్నం ప్రారంభమవుతాయి.