Shreyas Iyer: టీమిండియా స్టార్ క్రికెటర్, వన్డే వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer) జాతకం ఏమాత్రం బాగా లేనట్లే అనిపిస్తోంది. 2025 చివరలో ఆస్ట్రేలియా గడ్డపై తీవ్రంగా గాయపడ్డాడు శ్రేయాస్ అయ్యర్. దీంతో దాదాపు టీమిండియా జట్టుకు మూడు నెలల పాటు దూరమయ్యాడు శ్రేయాస్ అయ్యర్. కడుపులో బలంగా గాయం కావడంతో జట్టుకు దూరం అయ్యాడు. ఇక ఇప్పుడిప్పుడే కోలుకొని న్యూజిలాండ్ జట్టుతో ( New Zealand tour of India, 2026) వన్డేలు ఆడేందుకు సిద్ధమయ్యాడు. ఇలాంటి నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కు మరో పెను ప్రమాదం తప్పింది. ఓ పెంపుడు కుక్క శ్రేయాస్ అయ్యర్ పై దాడి చేసింది. కొంచం లో మిస్సయింది కానీ… లేకపోయి ఉంటే శ్రేయాస్ అయ్యర్ ( Shreyas Iyer Dog) ఖండ పీకేది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.
విజయ్ హజారే టోర్నమెంట్ ఫినిష్ చేసుకున్న శ్రేయాస్ అయ్యర్ విమానాశ్రయంలో మెరిశాడు. న్యూజిలాండ్ తో జరిగే మొదటి వన్డే కోసం వడోదర విమానాశ్రయానికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా శ్రేయాస్ అయ్యర్ ను చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. అయితే అక్కడే ఉన్న ఓ అభిమానికి చెందిన పెంపుడు కుక్క, శ్రేయాస్ అయ్యర్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది. అభిమాని రావడంతో కాస్త క్లోజ్ గా వెళ్లాడు. ఈ నేపథ్యంలోనే ఆ అభిమాని దగ్గర ఉన్న ఓ పెంపుడు కుక్క, శ్రేయాస్ అయ్యర్ పై దాడి చేసే ప్రయత్నం చేసింది.
కానీ చాక చక్యంగా ఆ కుక్క దాడి నుంచి తప్పించుకున్నాడు శ్రేయాస్ అయ్యర్. ఈ వీడియో మనం కింద చూడవచ్చు. ఇది చూసిన శ్రేయాస్ అయ్యర్ ఫ్యాన్స్ దారుణంగా స్పందిస్తున్నారు. జాగ్రత్త సర్పంచ్ సాబ్, కొంచెం అయితే ఖండ పీకేది.. మళ్లీ ఆసుపత్రి పాలు అయ్యేవాడివి.. అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఆ పెంపుడు కుక్కను కాస్త జాగ్రత్తగా చూడండి.. జనాలపై పడిపోతుంది.. ఇలా కుక్కలను బయటకు తీసుకురాకండి అని మరి కొంతమంది సూచిస్తున్నారు. దీంతో ఈ సంఘటన హాట్ టాపిక్ అయింది.
న్యూజిలాండ్ వర్సెస్ టీమిండియా ( New Zealand tour of India, 2026) మధ్య జనవరి 11వ తేదీ నుంచి వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ నేపథ్యంలో శ్రేయాస్ అయ్యర్ కూడా సెలెక్ట్ అయ్యాడు. దానికి తగ్గట్టుగానే ఫిట్నెస్ సాధించిన శ్రేయాస్ అయ్యర్, వన్డే సిరీస్ కు సిద్ధమయ్యాడు. ఈ సిరీస్ నేపథ్యంలో వైస్ కెప్టెన్ గా శ్రేయాస్ అయ్యర్ వ్యవహరించనున్నాడు. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
?igsh=MXIxaGNqaXQ2NGg0Ng==