kohli-Rohit : టీమిండియా సౌతాఫ్రికా జట్టుతో నవంబర్ 30, 2025న తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో థ్రిల్లింగ్ విజయం సాధించిన విషయం తెలిసిందే. కానీ ఆ విజయం సాధించి కొద్ది గంటలు కూడా గడవక ముందే భారత జట్టులో వాతావరణం అస్సలు బాగా లేదనే వార్తలు సంచలనం రేపుతున్నాయి. ముఖ్యంగా టీమిండియా కోచ్ గౌతమ్ గంభీర్, స్టార్ క్రికెటర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ మధ్య విభేదాలు ఉన్నట్టు తెలుస్తోంది. గంభీర్-రోహిత్, విరాట్ కోహ్లీ మధ్య బంధాలు అంత బాలేవని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరు ప్లేయర్ల భవిష్యత్ పై విశాఖ లేదా రాయ్ పూర్ లో మీటింగ్ జరిగే ఛాన్స్ ఉందని జాతీయ మీడియా తెలిపింది.
Also Read : Rohit Sharma: మరోసారి బయటపడ్డ రోహిత్ శర్మ మతిమరుపు..ఈ సారి న**గ్నంగా ఫోటోలు !
ముఖ్యంగా టెస్టులకు వీరు రిటైర్మెంట్ ప్రకటించినప్పటి నుంచే వివాదాలు మొదలైనట్టు సమాచారం. రోహిత్ శర్మ, సెలెక్టర్ అగార్కర్ మధ్య కూడా సంబంధాలు సరిగ్గా లేవని జాతీయ మీడియా వెల్లడించింది. వాస్తవానికి టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. కోచ్ గంభీర్ తో అసంతృప్తిగా ఉండటానికి కారణం ఏమిటంటే..? రాంచీ వన్డేకు ముందు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ జట్టుతో కాకుండా విడిగా ప్రాక్టీస్ చేయాలని కోరారట. ఈ విషయం గౌతమ్ గంభీర్ కి తెలియగానే.. ‘వాళ్లు నా దగ్గరకు వచ్చి మాట్లాడమనండి’ అని అన్నట్టు సీనియర్ క్రీడా విలేకర్లు పేర్కొన్నారు. ఒకవేళ ఈ సమాచారం కనుక వాస్తవం అయితే.. ఇది టీమ్ వాతావరణానికి ఏ మాత్రం మంచిది కాదని.. రాంచీ వన్డేలో కోహ్లీ, రోహిత్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన తరువాత.. గంభీర్ వీడియోలు కూడా వైరల్ గా మారాయి. ఈ ముగ్గురి మధ్య ఏదో సరిగ్గా లేదని.. అభిమానులు సోషల్ మీడియాలో రకరకాలుగా ఊహించుకోవడం ప్రారంభించారు.
టీమిండియా రాంచీ వన్డే గెలిచిన తర్వాత హోటల్లో చోటు చేసుకున్న సంఘటనలు ఈ విభేదాలకు మరింత బలాన్ని చేకూర్చాయి. జట్టులోని ఆటగాళ్లు అందరూ కలిసి విజయాన్ని కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటుండగా, విరాట్ కోహ్లీ మాత్రం ఆ వేడుకలో పాల్గొనకుండా నేరుగా తన రూమ్కు వెళ్లిపోయాడట. అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్ చాలా సేపు సీరియస్ మూడ్లో మాట్లాడుకోవడం కనిపించింది. వీరిద్దరి మధ్య అంతా సవ్యంగా లేదనేలా వారి హావభావాలు ఉన్నాయని అక్కడి వర్గాలు చెబుతున్నాయి. ఈ సంఘటనలు జట్టులో అంతర్గతంగా ఏదో సమస్య నడుస్తోందని స్పష్టం అవుతోంది. ప్రస్తుతం టీమిండియా రాంచీ నుంచి రాయ్ పూర్ కు చేరుకుంది. ఇక్కడ డిసెంబర్ 03న దక్షిణాఫ్రికాతో రెండో వన్డే మ్యాచ్ జరుగనుంది. ఇప్పటికే భారత జట్టు వన్డే సిరీస్ లో 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది.
Also Read : Tim David Bowling : సునీల్ నరైన్ లాగా మారిపోయిన టిమ్ డేవిడ్.. బంతి దాచుకొని మరి బౌలింగ్
🚨 CHAOS INSIDE INDIA ODI TEAM 🚨
– Gambhir, Virat & Rohit are not talking to each other.
– Virat & Rohit wanted to have a separate practice session, but Gambhir denied the request.
– The atmosphere in the ODI team is very bad. (Abhishek Tripathi). pic.twitter.com/U4moF47xBT
— Sheri. (@CallMeSheri1_) December 1, 2025