Mayank Agarwal: రంజీ ట్రోఫీ ఎలైట్ 2026 టోర్నమెంట్ ( Ranji Trophy Elite 2025-26 ) మొన్నటి వరకు కొనసాగిన సంగతి తెలిసిందే. ఇక ఈ టోర్నమెంట్ చివరి దశకు వచ్చింది. ఫిబ్రవరి 24వ తేదీన రంజీ ట్రోఫీ ఎలైట్ 2026 టోర్నమెంట్ ఫైనల్ ప్రారంభమైంది. టెస్ట్ ఫార్మాట్ లో జరుగుతున్న రంజీ ట్రోఫీ ఎలైట్ 2026 టోర్నమెంట్ ఫైనల్ లో ఇప్పటికే రెండు రోజులు పూర్తయ్యాయి. కర్ణాటక వర్సెస్ జమ్మూ కాశ్మీర్ ( Karnataka vs Jammu and Kashmir, ) మధ్య రంజీ ట్రోఫీ ఎలైట్ 2026 ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ ఫైనల్స్ సందర్భంగా జరిగిన ఓ వివాదం హాట్ టాపిక్ అయింది. జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా ( Jammu & Kashmir skipper Paras Dogra), కర్ణాటక బౌలర్ కె వి అన్వీష్ మధ్య గొడవ జరగగా.. ఆ గొడవను ఆపేందుకు హీరో రేంజ్ లో ఎంట్రీ ఇచ్చాడు మాయాంక్ అగర్వాల్ ( Mayank Agarwal). ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.
ఒక వైపు టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( ICC Men’s T20 World Cup 2026) జరుగుతున్న నేపథ్యంలోనే ఇటు రంజీ ట్రోఫీ ఎలైట్ 2026 టోర్నమెంట్ ( Ranji Trophy Elite 2025-26 ) ఫైనల్ కొనసాగుతోంది. జమ్ము కాశ్మీర్ అలాగే కర్ణాటక ( Karnataka vs Jammu and Kashmir, ) జట్ల మధ్య ఈ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది. అయితే ఈ మ్యాచ్ సందర్భంగా ప్లేయర్ల మధ్య గొడవ రాజుకుంది. కర్ణాటక బౌలర్ కె వి అన్వీష్ పట్ల జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రా ( Jammu & Kashmir skipper Paras Dogra) కాస్త ఓవర్ గా బిహేవ్ చేశాడు. బ్యాటింగ్ చేస్తూ ఒక్క సారిగా కర్ణాటక బౌలర్ కె.వి అన్వీష్ పైన దాడికి వెళ్ళాడు పరాస్ డోగ్రా.
తన హెల్మెట్ లో పరాస్ డోగ్రా బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇక ఇది గమనించిన మయాంక్ అగర్వాల్ రంగంలోకి దిగాడు. జట్టులో సీనియర్ ప్లేయర్ గా ఉన్న మయాంక్ అగర్వాల్, జమ్ము కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రాకు వార్నింగ్ ఇచ్చాడు. దమ్ముంటే ఇప్పుడు కొట్టు రా అన్నా రేంజ్ లో… కళ్ళు బయటకు పెట్టి బెదిరించాడు. ఆ తర్వాత రంగంలోకి కేఎల్ రాహుల్ కూడా దిగాడు. మొత్తానికి ఈ గొడవను చల్లార్చి ప్రయత్నం చేశారు కే ఎల్ రాహుల్, మాయాంక్ అగర్వాల్. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. రంజీ ట్రోఫీ ఫైనల్లో జరిగిన గొడవ నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్ కెప్టెన్ పరాస్ డోగ్రాపై ఫైన్ పడే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
?igsh=MWxubzRyaXB6a242Nw==