E-Paper
Advertisement

Mohsin Naqvi: ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయ‌ర్ల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేసి, రోడ్డుకు ఇడ్చుతా

Mohsin Naqvi: ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయ‌ర్ల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేసి, రోడ్డుకు ఇడ్చుతా
Advertisement

Mohsin Naqvi:  ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament ) కారణంగా పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ (PSL 2026 ) ప్రమాదంలో పడింది. 6 వేదికలలో ప్రేక్షకులతో ఈ టోర్నమెంట్ నిర్వహించాలని ముందుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు నిర్ణయం తీసుకుంది. కానీ చాలా మంది విదేశీ క్రికెటర్లు మెల్లిమెల్లిగా ఐపిఎల్ వైపు మొగ్గుచూపుతో జారుకుంటున్నారు. దీంతో పాకిస్తాన్ సూపర్ లీగ్ నిర్వహణ గందరగోళంగా మారింది. దీంతో ప్రేక్షకులు లేకుండానే రెండు వేదికల్లో మాత్రమే ఈ ఈవెంట్ నిర్వహించేందుకు తాజాగా నిర్ణయం తీసుకుంది పాకిస్తాన్ క్రికెట్ బోర్డు. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) కూడా ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్ కోసం పేర్లు నమోదు చేసుకొని, ఐపీఎల్ ఆడేందుకు వెళ్లే ప్లేయర్లపై కచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. ఒక్కో ప్లేయర్ పైన మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధించేలా చర్యలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు మొహ్సిన్ న‌ఖ్వీ. అలా ఐపీఎల్ వెళ్లే వెధ‌వ‌ల‌పై యాక్ష‌న్ క‌చ్చితంగా ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

Also Read:  Clash in SRH: కావ్య మారన్ కు మ‌రో త‌ల‌నొప్పి.. SRH లో ప్లేయ‌ర్ల మ‌ధ్య గొడ‌వ‌..కెప్టెన్ ఇషాన్ పైనే తిరుగుబాటు

ఐపీఎల్ లోకి వెళ్లే ప్లేయ‌ర్ల‌పై 3 ఏళ్ల బ్యాన్ వేసి, రోడ్డుకు ఇడ్చుతా

Advertisement

ఐపీఎల్ 2026 టోర్నమెంట్ అలాగే పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంట్లు రెండు రోజుల గ్యాప్ లోనే ఒకేసారి ప్రారంభమవుతున్నాయి. మార్చి 26వ తేదీన పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ప్రారంభం కాబోతోంది. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంటు మార్చి 28వ తేదీన ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో చాలామంది ఐపీఎల్ కు గాయాల కారణంగా దూరమవుతున్నారు. అయితే వాళ్లను భర్తీ చేసే క్రమంలో పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటుకు పేర్లు నమోదు చేసుకున్న ప్లేయర్లు జింబాబ్వే ఆటగాడు బ్లెస్సింగ్ ముజారాబానీ, శనకా లాంటి ప్లేయర్లు ఐపీఎల్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

ఈ నేపథ్యంలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ చైర్మన్ మొహ్సిన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) సీరియస్ అయ్యారు. ముందుగా తమతో డీలింగ్ కుదుర్చుకొని ఇప్పుడు ఐపీఎల్ కోసం వెళ్లే ప్లేయర్లపై యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ టోర్నమెంటును వదిలి ఐపీఎల్ లోకి వెళ్లే ఆటగాళ్లపై న్యాయపరమైన చర్యలు కచ్చితంగా ఉంటాయని.. వాళ్లపై మూడు సంవత్సరాల పాటు బ్యాన్ విధిస్తామని హెచ్చరించారు మొహ్సిన్ న‌ఖ్వీ. ఆ ప్లేయర్లు అందరినీ రోడ్డుకు ఈడ్చడం గ్యారంటీ అన్నారు. గతంలో దక్షిణాఫ్రికాకు సంబంధించిన బాష్ ఇలాగే వెళ్తే ఏడాది పాటు బ్యాన్ వేసినట్లు గుర్తు చేశారు మొహ్సిన్ న‌ఖ్వీ. కొంత మంది ఐపిఎల్ లోకి వెళ్లిన పర్వాలేదు… అంతకంటే మంచి ప్లేయర్లు ఇప్పుడు వస్తున్నారని వివరించారు. కానీ వెళ్లిన వాళ్లపైన కచ్చితంగా యాక్షన్ ఉంటుందని హెచ్చరించారు మొహ్సిన్ న‌ఖ్వీ.

Advertisement

Also Read: Tanveer Ahmed: ఐపీఎల్ జోలికి వెళ్లొద్దు రా..వెంట‌నే PSL షెడ్యూల్ మార్చండి, లేక‌పోతే సంక‌నాకి పోతాం

 

 

 

Related News

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

మిస్ట‌ర్ భువీ..ఇక చాలు, అన్ని మూసుకుని రిటైర్మెంట్ ఇచ్చి ఇంట్లో కూర్చో

ఇలానే వదిలేస్తే, ఇమ్రాన్ ఖాన్ ఏ క్షణమైనా చావడం పక్కా..!

దున్న‌పోతుల్లా తిన‌డం త‌ప్ప‌…మా ద‌ద్ద‌మ్మ‌ల‌కు ఆడ‌టం చేత‌కాదు

Big Stories

Advertisement
×