E-Paper
Advertisement

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని

MS Dhoni – Sakshi: స్టెప్ క్యాచ్ ప‌ట్టిన బుమ్రా…ఎగిరి గంతేసిన సాక్షి సింగ్, ప‌రువు తీసిన‌ ధోని
Advertisement

MS Dhoni – Sakshi:  టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament )  ఫైనల్స్ కు చేరుకుంది టీమిండియా. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ( Wankhede Stadium, Mumbai) గురువారం టీమిండియా వర్సెస్ ఇంగ్లాండ్ ( Team India vs England 2nd Semi-Final) మధ్య రెండో సెమీ ఫైనల్ పోరు జరిగింది. అయితే ఇందులో విజయం సాధించిన టీమిండియా, ఫైనల్స్ లో అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ పై ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ అర్హత సాధించింది. అయితే ఈ మ్యాచ్ లో జాక‌బ్ బెతెలె కొట్టిన ఓ బంతిని జస్‌ప్రీత్ బుమ్రా ( Jasprit Bumrah ) స్టెప్ క్యాచ్ పడ‌తాడు. దీంతో అది ఔట్ అనుకొని, ధోని భార్య సాక్షి సింగ్ ( Sakshi’s Animated Celebration ) సంబరాలు చేసుకున్నారు. తాను కూర్చున్న కుర్చీ లోంచి లేచి మరి గంతేశారు. అయితే అక్కడే ఉన్న ధోని అది ఔట్ కాదు తల్లి, స్టెప్ క్యాచ్ అంటూ సమాధానం ఇచ్చాడు. దీంతో పరువు పోయిన సాక్షి సింగ్ ( Sakshi Dhoni ), గమ్మున కూర్చుంది. ఈ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఈ వీడియోని చూసిన ధోని ( MS Dhoni ) అభిమానులు నవ్వుకుంటున్నారు. వదినమ్మ సాక్షికి స్టెప్ క్యాచ్ ఏదో..? స్ట్రేట్‌ క్యాచ్ ఏంటో తెలియడం లేదా? అంటూ దారుణంగా ఆడుకుంటున్నారు.

Also Read: T20 World Cup 2026: శ్రీలంకలో ఆ పాకిస్తాన్ ప్లేయ‌ర్ అరాచ‌కాలు…హోట‌ల్ ప‌ని మ‌నిషిపై లైంగిక దాడి !

ఫైన‌ల్స్ లో అడుగుపెట్టిన టీమిండియా

Advertisement

టి20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో ( T20 World Cup 2026 tournament )   భాగంగా ఫైనల్స్ లో టీమిండియా అడుగు పెట్టింది. ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లాండ్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య రెండో సెమీఫైనల్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఏడు పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ఇండియా మొదట బ్యాటింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా నిర్ణిత 20 ఓవర్లు ఆడేసింది టీం ఇండియా. ఈ సందర్భంగా ఏడు వికెట్లు నష్టపోయిన టీమ్ ఇండియా  (Team India )  253 పరుగులు సాధించింది.

ఇక ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఇంగ్లాండ్ కూడా గట్టిగానే పోరాడింది అని చెప్పవచ్చు. 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయిన ఇంగ్లాండు 246 పరుగులు చేయగలిగింది. అప్పటికే బంతులు అయిపోగా మ్యాచ్ ఓడిపోయింది. దీంతో టీమిండియా ఏడు పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్స్ లో అడుగు పెట్టింది. మార్చి 8వ తేదీన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ ( Team India VS New Zealand ) మధ్య అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం ( Narendra Modi Stadium ) వేదికగా ఫైనల్ ఉంటుంది. ఈ మేరకు రేపు మోడీ స్టేడియానికి చేరుకోనుంది టీమిండియా.

Advertisement

Also Read: SA vs NZ 1st Semi-Final: ద‌క్షిణాఫ్రికా కొంప‌ముంచిన క్యాచ్‌..వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్స్ కు చేరిన న్యూజిలాండ్

 

 

 

Related News

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

Big Stories

Advertisement
×