E-Paper
Advertisement

IPL : సూర్య, డేవిడ్ మెరుపులు.. ముంబై విక్టరీ.. జైస్వాల్ సెంచరీ వృథా..

IPL : సూర్య, డేవిడ్ మెరుపులు.. ముంబై విక్టరీ.. జైస్వాల్ సెంచరీ వృథా..

IPL : ముంబై మళ్లీ గెలుపుబాట పట్టింది. రెండు వరుస పరాజయాల తర్వాత రోహిత్ సేన విజయం సాధించింది. రాజస్థాన్ తో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో 6 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్.. యశస్వి జైశ్వాల్ (124, 62 బంతుల్లో 16 ఫోర్లు, 8 సిక్సులు) సూపర్ సెంచరీతో 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

జైస్వాల్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఫోర్లు, సిక్సులతోనే 112 పరుగులు రాబట్టాడు. కానీ రాజస్థాన్ జట్టులో మరొక బ్యాటర్ పట్టుమని 20 పరుగులు కూడా చేయలేదు. ఒకరిద్దరూ బ్యాటర్లు జైస్వాల్ తోడుగా బాగా ఆడుంటే రాజస్థాన్ స్కోర్ 250 దాటేది. ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా 2 వికెట్లు,మెరిడిత్, ఆర్చర్ తలో వికెట్ పడగొట్టారు.

213 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై తొలి నుంచి ధాటిగానే ఆడింది. ఇషాన్ కిషన్ (28), గ్రీన్ (44), సూర్యకుమార్ యాదవ్ (55), తిలక్ వర్మ (29 నాటౌట్), టిమ్ డేవిడ్ (45 నాటౌట్, 14 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్సులు) రాణించడంతో ముంబై 19.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. మ్యాచ్ ఉత్కంఠగా సాగినా.. చివరిలో టిమ్ డేవిడ్ వీరవిహారం చేయడంతో ముంబై గెలిచింది.

రాజస్థాన్ బౌలర్లలో అశ్విన్ 2 వికెట్లు, బౌల్ట్, సందీప్ శర్మ తలో వికెట్ తీశారు. అద్భుత సెంచరీతో అదరగొట్టిన జైస్వాల్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×