E-Paper
Advertisement

Memes on Pakistan team: టీమిండియాను ఓడించేందుకు పాక్ కొత్త కుట్రలు..?

Memes on Pakistan team: టీమిండియాను ఓడించేందుకు పాక్ కొత్త కుట్రలు..?
Advertisement

Memes on Pakistan team: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా ఆదివారం రోజు కీలక పోరు జరగబోతోంది. దాయాది పోరులో భారత్ – పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ తన తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ పై అరు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. ఇక పాకిస్తాన్ న్యూజిలాండ్ చేతులో తన తొలి మ్యాచ్ ని ఓడిపోయింది. భారత్ తన రెండవ మ్యాచ్ లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో రేపు తలపడబోతోంది. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల క్రీడాభిమానులతో పాటు.. ఇతర దేశాల అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Advertisement

ఎందుకంటే చాలా సంవత్సరాలుగా భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగలేదు. కేవలం ఐసీసీ ఈవెంట్లలో మాత్రమే తలపడ్డాయి. చివరిసారిగా ఈ రెండు జట్లు 2024 టీ-20 ప్రపంచ కప్ లో తలపడ్డాయి. తాజాగా మరోసారి పోరుకు సిద్ధం కావడంతో క్రీడాభిమానులలో ఆసక్తి నెలకొంది. ఒకప్పుడు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే యుద్ధ వాతావరణం తలపించేది. ప్లేయర్ల మధ్య వాగ్వాదం, ఉరిమి చూసుకోవడం వంటివి కనిపించేవి.

అందుకే ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ అంటే భద్రత ఏర్పాట్లు భారీగా ఉండేవి. అలాంటి మ్యాచ్ లు ఇప్పుడు కనిపించడం లేదు. అయితే ఫిబ్రవరి 23న ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ 2025లో భారత్ – పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ నేపథ్యంలో.. టీమ్ ఇండియాని ఓడించేందుకు పాకిస్తాన్ కుట్రలు రచిస్తోందంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ట్రై – నేషన్ సిరీస్ ఫైనల్ సందర్భంగా ఓ నల్ల పిల్లి మైదానంలోకి ప్రవేశించిన ఘటన మీకు గుర్తుండే ఉంటుంది.

Advertisement

దీంతో మ్యాచ్ కి కాసేపు అంతరాయం కలిగింది. ఆ సమయంలో ఆ పిల్లిపై ఓ గ్రద్ద దాడి చేసేందుకు ప్రయత్నించినా.. అది అదృష్టవశాత్తు తప్పించుకుంది. అనంతరం అది మైదానం నుంచి వెళ్ళిపోయింది. ఇక 2025 ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీలోని మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ – పాకిస్తాన్ జట్ల మధ్య జరిగింది. కరాచీలోని నేషనల్ బ్యాంక్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్ లోని రెండవ ఇన్నింగ్స్ సమయంలో ఈ నల్ల పిల్లి మైదానంలో మరోసారి కనిపించింది.

దీంతో ఆ నల్ల పిల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే భారత్ – పాకిస్తాన్ మ్యాచ్ నేపథ్యంలో.. టీమ్ ఇండియాని ఓడించేందుకు ఆ నల్ల పిల్లిని ఉపయోగించుకోవాలని చూస్తుందట పాకిస్తాన్. దానిని ఉపయోగించుకొని భారత ఆటగాళ్ల మైండ్ నీ డైవర్ట్ చేయాలని భావిస్తున్నారట. ముఖ్యంగా విరాట్ కోహ్లీ బ్యాటింగ్ సమయంలో ఈ ప్రణాళికని రచిస్తున్నారట.

 

ఎందుకంటే విరాట్ కోహ్లీ పాకిస్తాన్ అంటే చాలు తన బ్యాట్ కి చక్కగా పని చెబుతాడు. కోహ్లీ చాలా ఏళ్లుగా పాక్ జట్టును ఇబ్బంది పెడుతున్నాడు. ఈ నేపథ్యంలో విరాట్ కోహ్లీ నీ పెబిలియన్ చేర్చేందుకు ఆ నల్ల పిండిని పాకిస్తాన్ ఎత్తు ఉపయోగించుకోవాలని చూస్తుందని ఓ కామెంటేటర్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో పై భారత క్రీడాభిమానులు పలు రకాలుగా రియాక్ట్ అవుతున్నారు.

Related News

విజయ్ మాల్యాతో మందుకొట్టిన ధోనీ, రిషబ్ పంత్..షాకింగ్ వీడియో వైర‌ల్ !

డ్రెస్సింగ్ రూంలో త‌న్నుకున్న పాకిస్తాన్ క్రికెట‌ర్లు..!

ఐర్లాండ్ చేతిలో టీమిండియానే వైట్ వాష్ అయింది, అందుకే పాకిస్తాన్ ఓడిపోతోంది

ఎవ‌రెంత గింజుకున్నా, నేను రాజీనామా చేయ‌ను..న‌ఖ్వీ సంచ‌ల‌నం

ఒరేయ్ న‌ఖ్వీ? పాకిస్తాన్ జ‌ట్టును 9వ స్థానానికి దిగ‌జార్చావ్ క‌ద‌రా !

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఇండియాను వైట్ వాష్ చేస్తాం…రికీ పాంటింగ్ హెచ్చరిక

రిజ్వాన్ చేత‌కాని ద‌ద్ద‌మ్మ‌…భ‌విష్య‌తుల్లో పాకిస్తాన్ తరఫున మళ్లీ ఆడ‌కుండా చేస్తా

రెండు టైటిల్స్ గెలిచినా, RCB ప్లేయ‌ర్లను జంతువుల కంటే హీనంగా చూస్తున్నారు

Big Stories

Advertisement
×