Ravi Shastri: టీం ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య గురువారం రోజున న్యూ చండీగఢ్ లోని ముల్లాన్పూర్ వేదికగా రెండో టి20 జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో సూర్య కుమార్ యాదవ్ సేన అత్యంత దారుణంగా విఫలమై ఓటమిపాలైంది. 51 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది టీమిండియా. అయితే ఈ ఓటమి నేపథ్యంలో టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి స్పందించారు. గౌతమ్ గంభీర్ కు కోచింగ్ చేయడం రావడంలేదని, చేతకాకపోతే ఇంట్లో కూర్చోవాలని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు రవి శాస్త్రి. అతడు ఇలాగే చేస్తే టీమిండియా గెలవడం కష్టమైందని పేర్కొన్నారు.
దక్షిణాఫ్రికా చేతిలో 51 పరుగుల తేడాతో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై విమర్శలు మళ్లీ పెరిగిపోయాయి. టీమిండియా అభిమానులు, మాజీ క్రికెటర్లు, మాజీ కోచ్ లు సీరియస్ అవుతున్నారు. ఇందులో భాగంగానే టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవి శాస్త్రి కూడా విమర్శలు చేశారు. టీమిండియా బ్యాటింగ్ లైనప్ పదే పదే మార్చడం దారుణమన్నారు. మూడో వికెట్ కు వచ్చే వాళ్లను అస్సలు డిస్టర్బ్ చేయకూడదని పేర్కొన్నారు. రెండో టి20లో అనవసరంగా అక్షర్ పటేల్ ను దించి గౌతమ్ గంభీర్ పెద్ద మిస్టేక్ చేసాడని మండిపడ్డారు రవి శాస్త్రి. 214 పరుగుల భారీ లక్ష్యం ఉన్న సమయంలో మూడవ నెంబర్లు తిలక్ వర్మాను దించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని చురకలు అంటించారు.
అలా కాకుండా అక్షర్ పటేల్ ను దించి చెత్త పని చేశావని ఫైర్ అయ్యారు. సూర్య కుమార్ యాదవ్ లేదా తిలక్ వర్మ మూడవ స్థానంలో వచ్చి ఉంటే టీమిండియా గెలిచేది అన్నారు. పాపం 5వ స్థానంలో తిలక్ వర్మాను దించడం వల్ల అతనిపై ఒత్తిడి పెరిగిందని నిప్పులు చెరిగారు. శివం దుబేకు సరిగా అవకాశం రాలేదన్నారు. అతన్ని కూడా కాస్త ముందుకు బ్యాటింగ్ చేయిస్తే ఫలితం బాగుంటుందన్నారు. అలా కాదని తన ఇష్టం వచ్చినట్లు గౌతమ్ గంభీర్ చేస్తే, టి20 వరల్డ్ కప్ గెలవడం కష్టమేనన్నారు.
చేతకాకపోతే ఇంట్లో గౌతమ్ గంభీర్ కూర్చోవాలని ఫైర్ అయ్యారు రవి శాస్త్రి. నీకంటే తోపు లాంటి వాళ్లు మరొకరు వస్తారని గుర్తు చేశారు. ఇది ఇలా ఉండగా ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్నిత 20 ఓవర్లు ఆడి, నాలుగు వికెట్లు నష్టపోయి 213 పరుగులు సాధించింది. ఇక దక్షిణాఫ్రికా విధించిన భారీ లక్ష్యాన్ని చేదించే క్రమంలో టీమిండియా జట్టు దారుణంగా విఫలమైంది. 19.2 ఓవర్లు ఆడిన టీమిండియా 162 పరుగులకు కుప్ప కూలింది. దీంతో 51 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా ఓటమిపాలైంది.