Robin Uthappa: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై ( Gautam Gambhir) మాజీ క్రికెటర్ రాబిన్ ఉతప్ప ( Robin Uthappa) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా క్రికెటర్లు ఆడి గెలిపిస్తే క్రెడిట్ మొత్తం దొంగలిస్తున్నాడని మండిపడ్డారు. దక్షిణాఫ్రికా వన్డే సిరీస్ లో భాగంగా ఇదే జరిగిందని రాబిన్ ఉతప్ప వెల్లడించారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తో పాటు రోహిత్ శర్మను ( Rohit Sharma) తొక్కేసే ప్రయత్నం జరుగుతోందని కూడా బాంబు పేల్చారు. దీంతో స్టార్ క్రికెటర్ రాబిన్ ఉతప్ప చేసిన కామెంట్లు వైరల్ గా మారాయి.
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ క్రెడిట్ దొంగతనం చేసే వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు రాబిన్ ఉతప్ప. దక్షిణాఫ్రికా వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించాలని గుర్తు చేశారు. ఆ ఇద్దరి వల్లే టీమిండియా వన్డే సిరీస్ గెలిచిందని గుర్తు చేశారు రాబిన్ ఉతప్ప. వన్డే సిరీస్ ఇద్దరు క్రికెటర్లు గెలిపిస్తే క్రెడిట్ మొత్తం గౌతమ్ గంభీర్ తన ఖాతాలో వేసుకున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే మొన్న టెస్ట్ సిరీస్ గెలిస్తే మాత్రం టీమిండియా ప్లేయర్ల వైఫల్యం అంటూ వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేశాడు రాబిన్ ఉతప్ప.
ఇలాంటి హెడ్ కోచ్ ఉంటే టీమిండియా కు ప్రమాదమే అంటూ ఫైర్ అయ్యారు రాబిన్ ఉతప్ప. టీమిండియా గెలవాలంటే అందరూ రాణించాల్సిందే, ఓడితే అందరూ బాధ్యత వహించాల్సిందేనని పేర్కొన్నారు. టీమిండియా ఓడిపోయినప్పుడు హెడ్ కోచ్ అన్ని బాధ్యతలు వహించాలని చురకలు అంటించారు. అంతేకానీ గెలిస్తే నాది, ఓడిపోతే మీది అన్నట్లుగా గౌతమ్ గంభీర్ వ్యవహరిస్తే, అతన్నీ ఎవరు కాపాడలేరని మండిపడ్డారు. కాగా దక్షిణాఫ్రికా తో జరిగిన వన్డే సిరీస్ లో రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ అద్భుతంగా ప్రదర్శన కనబరిచినట్లు ప్రశంసించారు. వాళ్ళిద్దరు ఇలాగే కొనసాగితే 2027 వరల్డ్ కప్ టీమ్ ఇండియా వశం అవుతుందన్నారు రాబిన్ ఉతప్ప.
ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య 3 వన్డేల సిరీస్ ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. మొదట టెస్ట్ సిరీస్ కోల్పోయిన టీమ్ ఇండియా.. ఇప్పుడు వన్డే సిరీస్ మాత్రం గెలిచింది. మొదటి అలాగే మూడవ వన్డే గెలిచిన టీమిండియా, వన్డే సిరీస్ కైవసం చేసుకోగలిగింది. ఇక మొన్న డిసెంబర్ 9వ తేదీ నుంచి 5 టీ20 ల సిరీస్ కూడా ప్రారంభమైంది. ఇందులో మొట్టమొదటి టి20 మ్యాచ్ లో కూడా టీమిండియా విజయం సాధించింది. ఇవాళ మరో టి20 జరగనుంది.
Robin Uthappa said – "What I found surprising is the post-match of South Africa ODI series, in the press conference, I didn't see Gautam Gambhir giving credit to either Rohit Sharma or Virat Kohli. Here are a couple of guys who've batted out of their skins and shown us how good… pic.twitter.com/P8DzPcVjgr
— Tanuj (@ImTanujSingh) December 11, 2025