Sangareddy Crime: సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ ఇందిరమ్మ కాలనీ వద్ద కారు అతివేగంగా రావడం అదుపుతప్పి.. ఎదురుగా వస్తున్న బైక్ ను ఢీకొట్టడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఒక్క స్పాట్ లోనే మృతిచెందారు. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికుల సమచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. ప్రమాదం ఎలా జరిగిందో స్థానికులను ఆరా తీశారు.
ఈ దుర్ఘటనకు సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా భావిస్తున్నారు.
ALSO READ: Road Accident: అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిని బలంగా ఢీకొట్టిన కారు, స్పాట్లోనే..