Salman Ali Agha: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan) మధ్య మ్యాచ్ అంటే జనాలు ఎగబడి చూస్తారు. ఈ రెండు జట్ల మధ్య మ్యాచ్ జరిగితే, ప్రపంచంలోని నలుమూలలా ఉన్న అభిమానులు తిలకిస్తారు. ఇక వరల్డ్ కప్ లాంటి ఈవెంట్లలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, వ్యూయర్షిప్ ఓ రేంజ్ కి వెళుతుంది. బెట్టింగ్, ఇతర అంశాల ద్వారా కోట్లల్లో డబ్బులు చేతులు మారుతాయి. పహల్గామ్ సంఘటన తర్వాత ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే షేక్ హ్యాండ్ ( India vs Pakistan handshake controversy) లేకుండానే మమా అనిపిస్తున్నారు మనవాళ్లు. ఆసియా కప్ 2025, టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ సందర్భంగా ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ జరిగితే, ప్రత్యర్థి కెప్టెన్ సల్మాన్ అలీ అఘాకు (Salman Ali Agha) టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు సూర్య కుమార్ యాదవ్. దీనిపై ఇప్పటికీ వివాదం కొనసాగుతూనే ఉంది.
Also Read: Ramiz Raja Hug: కామెంట్రీలో చేస్తుండగా రొమాన్స్..రమీజ్ రాజా, లీసా హాట్ వీడియో వైరల్
సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడంపై తాజాగా పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ అలీ అఘా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మ్యాచ్ కంటే, ముందు జరిగే ప్రెస్ కాన్ఫరెన్స్, ఫోటో షూట్ సందర్భంగా సూర్య కుమార్ యాదవ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చేవాడని వెల్లడించారు. కానీ టాస్ సమయంలో అందరూ చూస్తారని షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వెళ్లిపోయేవాడని ఆరోపణలు చేశారు. ఇండియన్ ఫ్యాన్స్ ను పిచ్చోళ్లను చేసి.. సూర్య కుమార్ యాదవ్, బీసీసీఐ నాటకాలు ఆడిందని ఫైర్ అయ్యారు. దొంగచాటున షేక్ హ్యాండ్ ఇస్తూ, జనాల మధ్య మాత్రం ఇవ్వకుండా హీరో అన్నట్లుగా సూర్య బిల్డప్ ఇచ్చేవాడని విమర్శలు చేశారు. టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఉండదని రిఫరీలు వార్నింగ్ కూడా ఇచ్చారని షాకింగ్ నిజాలు బయట పెట్టారు.
గత సంవత్సరం కిందట పహల్గాం సంఘటన జరిగిన సంగతి తెలిసిందే. కాశ్మీర్ లోని ఈ పహాల్గం అనే పర్యాటక స్థలంలో పాకిస్తాన్ ఉగ్రవాదులు చొరబడి.. కాల్పులకు తెగబడ్డారు. మొత్తం 26 మంది పర్యాటకులను అన్యాయంగా చంపేశారు. ఇందులో ఇద్దరు విదేశీ పర్యాటకులు కూడా ఉన్నారు. అయితే ఈ సంఘటన తర్వాత ఆపరేషన్ సింధూర్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి, పాకిస్తాన్ ఉగ్రవాదులపై యుద్ధానికి దిగింది ఇండియా. ఈ క్రమంలో దాదాపు 100 మంది ఉగ్రవాదులను ఒకేసారి మట్టికరిపించింది. ఈ సంఘటన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకూడదని బిసిసిఐ ఆదేశాలు ఇచ్చింది. అందుకే పాకిస్తాన్ తో మ్యాచ్ జరుగుతున్నప్పుడు సూర్య కుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇవ్వకుండా వ్యవహరించాడు. అయితే టోర్నమెంట్ ఫోటో షూట్, కెప్టెన్ ప్రెస్ మీట్ సందర్భంగా మాత్రం పాకిస్తాన్ వాళ్లకు సూర్యకుమార్ యాదవ్ షేక్ హ్యాండ్ ఇచ్చిన అంశం హాట్ టాపిక్ అయింది. లేటెస్ట్ గా ఇదే అంశాన్ని గుర్తు చేశారు సల్మాన్ అలీ.
Also Read: PSLలో మరో అరాచకం.. డబ్బులు లేక ఆంటీలతో క్లీన్ చేయిస్తున్నారు, దొంగల్లా దూరేస్తున్నారు
Salman Ali Agha relieved about India vs Pakistan handshake controversy:
Before the match, there was a press conference and a trophy shoot, and there was a handshake there too. So when I was going for the toss, I was pretty normal. I said, “Obviously, I had an idea that things… pic.twitter.com/zImpcx7pG1
— TEJASH (@Tejashyyyyy) May 2, 2026