Meher Ramesh:చెందిన అగ్రనటులు, దర్శకులు, నిర్మాతలు తరలి రావడంతో రిసెప్షన్ కళకళలాడింది .ఈ వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం మెగాస్టార్ చిరంజీవి.మొహర్ రమేష్ కు చిరుకి ఉన్న బంధుత్వం అందరికీ తెలిసిందే.చిరంజీవి పిన్ని కొడుకే మొహర్ రమేష్
అందుకే ఈ వేడుకకు చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి వచ్చి కొత్త పెళ్లి కొత్త దంపతులకు తమ ఆశీర్వాదాలు అందించారు. ఇక విక్టరీ వెంకటేష్ నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు .మొహర్ రమేష్ విక్టరీ వెంకటేష్ తో షాడో అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.అలాగే ఈ రిసెప్షన్ కనుక కొరియోగ్రాఫర్ అండ్ డైరెక్టర్ ప్రభుదేవా,మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ వచ్చి తమ విషెస్ ని నూతన జంటకి అందించారు.
also read :పద్మశ్రీ అందుకున్న తొలి కమెడియన్.. రేలంగి వెనుక ఉన్న ఈ కన్నీటి గాథ తెలుసా?
ఇక ఈవెంట్లో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకుల తాకిడి కూడా గట్టిగానే కనిపించింది. ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ రామకృష్ణం రాజు తో పాటు పలువురు ప్రముఖ రాజకీయ నాయకులు కొత్త దంపతులకు తమ ఆశీస్సులు అందించారు.మొహర్ రమేష్ సినిమాల విషయానికి వస్తే ఒకప్పుడు ఆయన కమర్షియల్ సినిమాలకి పెట్టింది పేరుగా ఉండేవారు.ఎన్టీఆర్ తో కంత్రి, శక్తి, ప్రభాస్ తో బిల్లా వంటి భారీ బడ్జెట్ సినిమాలను నిర్మించి టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు.
also read :టైమ్ కన్నా ముందే వారణాసి ప్యాకప్..జక్కన్న స్పీడ్ మాములుగా లేదుగా
ముఖ్యంగా బిలా చిత్రంలో ప్రభాస్ ని స్టైలిష్ గా చూపించిన విధానం ఇప్పటికి రెబల్ ఫ్యాన్స్ మర్చిపోలేరు.ఇక చాలా రోజుల తర్వాత 2023లో మెగాస్టార్ చిరంజీవితో తీసిన బోలా శంకర్ అట్టర్ ప్లాప్ అయినా చిరుని సరికొత్త మాస్ లుక్ లో ప్రజెంట్ చేయడంలో సక్సెస్ అయ్యాడు.ఇక ఇండస్ట్రీలో ఎంతమందితో మెహర్ రమేష్ కు ఎంతటి సాహిత్యం ఉందో ఈ ఈవెంట్ కి వచ్చిన జనాలని చూస్తేనే అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ రిసెప్షన్ కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో తెగ ట్రెండ్ అవుతున్నాయి.