E-Paper
Advertisement

Shahid Afridi: మిస్ట‌ర్‌ న‌ఖ్వీ వెంట‌నే వెళ్లి, శ్రీలంక అధ్యక్షుడిని కొనేసేయ్‌..ఆరు నూరైనా ఇవాళ‌ పాకిస్తాన్ గెలివాలి

Shahid Afridi: మిస్ట‌ర్‌ న‌ఖ్వీ వెంట‌నే వెళ్లి, శ్రీలంక అధ్యక్షుడిని కొనేసేయ్‌..ఆరు నూరైనా ఇవాళ‌ పాకిస్తాన్ గెలివాలి

Shahid Afridi: టి20 ప్రపంచ కప్ 2026 టోర్నమెంట్ ( T20 World Cup 2026 tournament ) నేపథ్యంలో శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ( Pakistan vs Sri Lanka) మధ్య ఇవాళ రాత్రి పల్లెకెలే వేదికగా ( Pallekele International Cricket Stadium, Pallekele) మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. సూపర్ 8 లో భాగంగా ఈ రెండు జట్లు తలపడనున్నాయి. ఇవాళ రాత్రి 7 గంటల సమయంలో ఈ మ్యాచ్ జరగనుంది. అయితే ఇలాంటి నేపథ్యంలో శ్రీలంకపై పాకిస్తాన్ విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ లో అడుగుపెడుతుంది. భారీ పరుగుల తేడాతో శ్రీలంకపై గెలవాల్సిన అవసరం ఉంది. శ్రీలంక పైన 70 పరుగుల తేడాతో విజయం సాధించాలి లేదా 10.5 ఓవర్లలో చేజింగ్ అయినా చేయాలి. అప్పుడే పాకిస్తాన్ కు సెమీ ఫైనల్ అవకాశాలు ఉంటాయి.

Also Read: Abhishek Sharma-Yuvraj Singh: అభిషేక్ శ‌ర్మకు ఘోర అవ‌మానం…చెప్పులు చూపించిన యువ‌రాజు

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక మ్యాచ్ పై షాహిద్ ఆఫ్రీది వివాదాస్పద వ్యాఖ్యలు

శ్రీలంకపై పాకిస్తాన్ కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితుల నేపథ్యంలో మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రీది ( shahid afridi) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. శ్రీలంకతో ఫిక్సింగ్ చేసుకుంటేనే బతికి బయటపడతామని వెల్లడించారు షాహిద్ ఆఫ్రీది. వెంటనే శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేను కలిసి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అధ్య‌క్షుడు మొహ్సీన్ న‌ఖ్వీ ( Mohsin Naqvi ) మాట్లాడాలని కోరారు. అతనితో ఏదైనా డీలింగ్ కుదుర్చుకొని, శ్రీలంక ఓడిపోయేలా ప్లాన్ చేయాలని వెల్లడించారు షాహిద్ ఆఫ్రీది.

అవ‌స‌రం అయితే, శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేను ( Anura Kumara Disanayake ) కొనేసేయ్ అన సూచ‌న‌లు చేశారు. అప్పుడే మెరుగైన నెట్ రన్ రేట్ తో సెమీ ఫైనల్లో పాకిస్తాన్ అడుగుపెడుతుందని బాంబు పేల్చారు. పాకిస్తాన్ సెమీ ఫైనల్ కు వెళ్లిందంటే కచ్చితంగా ఫైనల్ దాకా వెళ్తుందని పేర్కొన్నారు. ఫైనల్స్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ( India vs Pakistan ) మ్యాచ్ జరుగుతుందని కూడా తెలిపారు. అప్పుడు మనమే విజయం సాధిస్తామని కూడా బాంబు పేల్చారు షాహిద్ ఆఫ్రీది.

పాకిస్తాన్ వర్సెస్ శ్రీలంక జట్ల మధ్య రికార్డులు

టి20 ఫార్మాట్ లో పాకిస్తాన్ ( Pakistan) అలాగే శ్రీలంక ( Srilanka) మధ్య రికార్డులు ఒకసారి పరిశీలిస్తే… ఈ రికార్డులలో పాకిస్తాన్ పై చేయి సాధించింది. ఇప్పటి వరకు ఈ రెండు జట్ల మధ్య 24 మ్యాచ్ లు జరిగాయి. ఇందులో పాకిస్తాన్ ఏకంగా 14 మ్యాచ్లలో విజయం సాధించింది. అటు శ్రీలంక కేవలం 10 మ్యాచ్లలో విజయం సాధించడం గమనార్హం. ఇది ఇలా ఉండగా ఇవాళ శ్రీలంక పైన పాకిస్తాన్ విజయం సాధిస్తేనే సెమీ ఫైనల్ కు వెళుతుంది. అలా కాదని ఈ మ్యాచ్ లైట్ తీసుకుంటే పాకిస్తాన్ ఇంటికి వెళ్తుంది. దీంతో న్యూజిలాండ్ సెమీ ఫైనల్ కు వెళ్లే ఛాన్స్ లు ఉంటాయి. కాబట్టి పాకిస్తాన్ ఆచితూచి ఆడాల్సి ఉంటుంది.

 

Also Read: Rinku Singh’s father dies: రింకూ ఇంట విషాదం..టీమిండియా ప్లేయ‌ర్లకు అసలు సిగ్గుందా..రీల్స్ చేస్తూ చేస్తారా?

 

 

Related News

Jos Buttler: న‌న్ను నంబ‌ర్ 4లో పంపి, ఆశిష్ నెహ్రానే స‌ర్వ నాశ‌నం చేశాడు !

బాబ‌ర్ పై ట్రోల్స్‌..ఇండియ‌న్స్ అనుకుని, ఆస్ట్రేలియా ఫ్యాన్స్ ను అరెస్ట్ చేసిన పాక్ !

మైదానంలోనే స్మోకింగ్..మ‌రో వివాదంలో టిమ్ డేవిడ్, ఇక ప‌ర్మినెంట్ బ్యాన్ !

టీమిండియాకు బిగ్ షాక్‌..బంగ్లాదేశ్ లోనే ఆసియా కప్ 2027, షెడ్యూల్ ఇదే

ఎలిమినేట‌ర్ లో ఓడిపోయిన‌ SRHకు ఊపిరిపోసిన పాకిస్తాన్ ప్లేయ‌ర్

రెండోసారి ఛాంపియ‌న్ గా RCB..ప్ర‌మాదంలో సూర్య‌, శ్రేయ‌స్ అయ్య‌ర్ భ‌విష్య‌త్తు !

Tanveer Ahmed: విరాట్ కోహ్లీ మ‌గాడైతే, పాకిస్తాన్ పిచ్ ల‌పై ఆడి చూపించాలి

లాహోర్ గ‌డ్డ‌పై విరాట్ కోహ్లీ ప్లకార్డులు…గూస్ బంప్స్ రావాల్సిందే

Big Stories

×