Shahid Afridi: పాకిస్తాన్ వర్సెస్ ఆస్ట్రేలియా ( Pakistan vs Australia) మధ్య ఈ నెల చివరలో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా ప్లేయర్లకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి. ఐపీఎల్ ఫినిష్ అయిన తర్వాతనే.. పాకిస్తాన్ టూర్ కు వెళ్లాలని ఈ కీలక ప్లేయర్లకు ఆదేశాలు జారీ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా ( Cricket Australia). పాకిస్తాన్ టూర్ కు ప్రాముఖ్యత లేదని… ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ ( Indian Premier League Tournament) మాత్రమే ఆడాలంటూ దిశా నిర్దేశం చేసింది. దీంతో పాకిస్తాన్ పరువు అంతర్జాతీయంగా తీసింది ఆస్ట్రేలియా. అయితే దీనిపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిది ( Shahid Afridi) స్పందించారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ వల్ల క్రికెట్ నాశనం అవుతుందని ఫైర్ అయ్యారు. బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డ్ కీలుబొమ్మలా మారిందని మండిపడ్డారు. దీంతో షాహిద్ అఫ్రిది చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League Tournament 2026) మే 31వ తేదీ వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. అయితే ఈ టోర్నమెంట్ ముగియకముందు ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ ( Australia vs Pakistan) మధ్య 3 వన్డేల సిరీస్ ప్రారంభం అవుతుంది. ఇందులో భాగంగానే మే 23వ తేదీన ఇస్లామాబాద్ కు క్రికెట్ ఆస్ట్రేలియా చేరుకుంటుంది. అనంతరం మే 30వ తేదీన వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది. అయితే ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియాకు సంబంధించిన కీలక ప్లేయర్లు కమిన్స్, స్టార్క్, జోష్ హాజెల్వుడ్ లాంటి వాళ్లందరూ పాకిస్తాన్ వెళ్లడం లేదు. ఐపీఎల్ లో షెడ్యూల్ ప్రకారం చివరి వరకు ఆడే ఆస్ట్రేలియా ఆటగాళ్లు… పాకిస్తాన్ టూర్ వెళ్లాల్సిన పనిలేదని వెల్లడించింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఐపీఎల్ ఫినిష్ అయిన తర్వాత మాత్రమే రావాలని పేర్కొంది. పాకిస్తాన్ టూర్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వకుండా… ఆస్ట్రేలియా B టీమ్ ను రంగంలోకి దింపాలని ఆదేశాలు జారీ చేశారు.
అయితే దీనిపై తాజాగా షాహిద్ అఫ్రిది స్పందించాడు. ఐపీఎల్ వల్ల క్రికెట్ నాశం..బీసీసీఐ చేతిలో ఆస్ట్రేలియా కీలు బొమ్మలా మారింది అంటూ షాహిద్ అఫ్రిది సంచలన వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్ కోసం పాకిస్తాన్ వన్డే సిరీస్ ను తక్కువ చేయడం ఎంత వరకు సమంజం అంటూ ఫైర్ అయ్యారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ కారణంగా అంతర్జాతీయ క్రికెట్ సిరీస్ లు సరిగ్గా నడవడం లేదని మండిపడ్డారు. దీనిపైన వెంటనే ఐసీసీ చర్యలు తీసుకోవాలని కోరారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి కోసం అంతర్జాతీయ క్రికెట్ ను నాశనం చేయడం దుర్మార్గం అంటూ నిప్పులు చెరిగారు. ఆస్ట్రేలియా కు సంబంధించిన అందరూ ప్లేయర్లు కూడా పాకిస్తాన్ రావాల్సిందేనని డిమాండ్ చేశారు. లేకపోతే ఐసీసీ కి లేఖ రాస్తానని హెచ్చరించారు.
Also Read: Hasin Jahan: షమీ కుటుంబంలో అందరూ దొంగలే..పెళ్లి చేసుకుంటానని మోసం, ప్రెగ్నెంట్ అయ్యాక !