E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ఇక‌నైనా బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్

ఇక‌నైనా బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్
Advertisement

Sunil Gavaskar:   2026 టీ20 ప్రపంచ కప్ విజేతగా (ICC T20 World Cup 2026 tournament) నిలిచిన టీమిండియా, పసి కూన జట్టు ఐర్లాండ్ చేతిలో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే. ఆడిన రెండు టి20లో ఐర్లాండ్ చేతిలో టీమిండియా అత్యంత దారుణంగా ఓడిపోయింది. దీంతో చేజేతులా సిరీస్ కోల్పోయింది. ఇలాంటి నేపథ్యంలో టీమిండియా క్రికెట్ జట్టు పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మాజీ క్రికెటర్లే ఇండియన్ క్రికెటర్లను ఓ రేంజ్ లో బూతులు తిడుతున్నారు. అయితే ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో సునీల్ గవాస్కర్ (SUNIL GAVASKAR) కీలక వ్యాఖ్యలు చేశారు. వైభవ్ సూర్యవంశీని ఈ టోర్నమెంటులో ఆడించి ఉంటే.. కచ్చితంగా టీమిండియా గెలిచేదని వ్యాఖ్యానించారు. గంభీర్ తప్పుడు నిర్ణయాల వల్ల ఈ పరిస్థితి నెలకొందని ఫైర్ అయ్యారు. రాబోయే ఇంగ్లాండ్ సిరీస్ (IND VS ENG) నేపథ్యంలో 5 టీ20లలో కూడా కచ్చితంగా వైభవ్ ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంగ్లండ్ పై అయినా బుడ్డోడు వైభ‌వ్ ను ఆడించు, లేక‌పోతే నీ గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్ ఇచ్చారు సునీల్ గ‌వాస్క‌ర్‌. ఈ క్ర‌మంలో గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి.

Also Read:  Womens Champions Trophy 2027 No Chance For Pakistan: ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ రిలీజ్‌..పాకిస్తాన్ మ‌హిళ‌ల జ‌ట్టుకు నో ఛాన్స్‌

బుడ్డోడిని ఆడించు, లేక‌పోతే గుడ్డలు ఊడతీసి కొడతారంటూ గంభీర్ కు వార్నింగ్

Advertisement

ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోయిన నేపథ్యంలో మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా ఓటమికి కారణం ముమ్మాటికి గౌతమ్ గంభీర్ బాధ్యత వహించాల్సిందేనని మండిపడ్డారు. ఐర్లాండ్ సిరీస్ కోసం వైభవ్ సూర్యవంశీని సెలెక్ట్ చేస్తే… వాటర్ బాయ్ గా వాడుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని ఈ రెండు మ్యాచ్ లలో ఆడించి ఉంటే టీమిండియా గెలిచేదని హితువు పలికారు. కానీ అలా చేయకుండా టీమిండియా ఓటమికి పరోక్షంగా గంభీర్ కారణమయ్యాడని ఫైర్ అయ్యారు.

ఐర్లాండ్ ఓటమిలో టీమిండియా కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను ఇప్పుడే జడ్జ్ చేయకూడదని కోరారు. రెండు టీ20 లో ఓడిపోతే శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా పనికిరాడు అని ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. అతనికి ఇంగ్లాండు సిరీస్ ఛాన్స్ ఉందని.. అక్కడ మెరుగ్గా రానిస్తే శ్రేయస్ అయ్యర్ కు ఎలాంటి సమస్య రాదని తెలిపారు. ఐర్లాండ్ ఎఫెక్ట్ నేపథ్యంలో ఇంగ్లాండ్ తో జరిగే ప్రతి మ్యాచ్ లోను వైభవ్ సూర్యవంశీని బరిలోకి దింపాలని కోరారు. అప్పుడే టీమిండియా విజయం సాధిస్తుందని పేర్కొన్నారు. ఇంగ్లండ్ తో జ‌రిగే టీ20 సిరీస్ నేప‌థ్యంలో జాగ్ర‌త్త‌గా టీమిండియా ఆడాల‌ని కోరారు. ఈ క్ర‌మంలో సునీల్ గ‌వాస్క‌ర్ చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ గా మారాయి.

Advertisement

Also Read: Ambati Rayudu react on pakistan women team : నెద‌ర్లాండ్ పై గెలిచారు క‌దా..ఇక పాక్ వీధుల్లో ర్యాలీలు చేయండి

 

Related News

టీమిండియా ఛాప్ట‌ర్ క్లోజ్‌..నెక్ట్స్‌ పాకిస్తాన్, ఐర్లాండ్ కొత్త షెడ్య‌ల్ ఇదే

టీమిండియాలో ముంబై వాళ్ల‌కే అవ‌కాశాలు.. బీహార్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్ ప్లేయ‌ర్ల‌కు నో ఛాన్స్ ?

ఒలింపిక్స్ 2028కి ముందు పాకిస్తాన్ కు బిగ్ షాక్‌..డిసెంబ‌ర్ 31కి డెడ్ లైన్‌

టీమిండియా ప‌త‌నం మొద‌లైంది..ఇక వాళ్ల‌ను దేవుడు కూడా కాపాడ‌లేడు

Tanveer Ahmed: టీమిండియాను ఐర్లాండ్ వైట్ వాష్ చేశాక‌, కంటి నిండా నిద్ర‌పోయాను

టీమిండియాను ఆ రెండు శాపాలు ప‌ట్టి పీడుస్తున్నాయి..అందుకే చిత్తుగా ఓడిపోయింది

ఎవ‌రెంత గింజుకున్నా..ఇంగ్లండ్ సిరీస్ లోనూ వైభ‌వ్ ను ఆడించ‌బోం

ఐర్లాండ్ సిరీస్ ను పిక్నిక్ లా ఎంజాయ్ చేశారు..ఇప్పుడు ప‌ళ్లు రాల‌గొట్టుకున్నారు

Big Stories

×