Virender Sehwag: మొన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో (Indian Premier League 2026 tournament) అదరగొట్టిన టీమిండియా ప్లేయర్లు.. జాతీయ జట్టు తరఫున మాత్రం విఫలమవుతున్నారు. ఐపీఎల్ లో సిక్సర్లు, బౌండరీలు అవలీలగా సాధించిన ఇండియన్ క్రికెటర్స్.. ఐర్లాండ్ చేతిలో మాత్రం చేతులెత్తేస్తున్నారు. ఈ క్రమంలోనే ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్ అయింది టీమ్ ఇండియా. ఆడిన రెండు టి20లలో చిత్తుగా ఓడిపోయింది. ఇక రెండు టి20లో ఓడిపోయి బాధలో ఉన్న టీమిండియా జట్టు ప్లేయర్లపై (INDIAN BATTERS) సీరియస్ అయ్యారు మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag). ఐపీఎల్ పిచ్ లకు ( flat pitches in the IPL) ఇండియన్ క్రికెటర్లు అలవాటు పడ్డారని… అందువల్ల బౌన్సర్లు వస్తే గజగజ వణికి పోతున్నారని సీరియస్ అయ్యారు. ఇలాగే టీమిండియా ప్లేయర్లు ఆడితే, ముందుకు వెళ్లడం కష్టమేనంటూ వార్నింగ్ ఇచ్చారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం అంటే ఘోర అవమానం అంటూ సీరియస్ అయ్యారు వీరేంద్ర సెహ్వాగ్. దీంతో వీరేంద్ర సెహ్వాగ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
టీమిండియా వర్సెస్ ఐర్లాండ్ (Ireland vs India, 2nd T20I) మధ్య రెండు టీ20 ల సిరీస్ పూర్తయింది. ఇందులో టీమిండియా చిత్తుగా ఓడి.. సిరీస్ కోల్పోయింది. ఈ క్రమంలో టీమిండియా క్రికెటర్ల పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా అభిమానులు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. టీమిండియా ఓటమిని తట్టుకోలేక, మరి కొంతమంది బాధపడుతున్నారు. ఈ క్రమంలో వీరేంద్ర సెహ్వాగ్ తన స్టైల్ లో ఈ మ్యాచ్ స్పందించారు. ఐర్లాండ్ చేతిలో ఓడిపోవడం సిగ్గుచేటు అంటూ ఫైర్ అయ్యారు. ఇండియన్ క్రికెటర్లు ఐపీఎల్ లో వినియోగించే ఫ్లాట్ పిచ్ లకు అలవాటు అయిపోయారని మండిపడ్డారు. దీనివల్ల కఠినమైన మైదానాలలో బ్యాటింగ్ సరిగ్గా చేయలేకపోతున్నారని సీరియస్ అయ్యారు.
ఇక బౌన్సర్లు వేసినప్పుడు, వికెట్లు సమర్పించుకుంటున్నారని మండిపడ్డారు. అందుకే ఐర్లాండ్ లాంటి చిన్న దేశం చేతిలో కూడా టీమిండియా ఓడిపోయిందని.. ఇదే బెస్ట్ ఉదాహరణ అంటూ వ్యాఖ్యానించారు. ఇలాగే టీమ్ ఇండియా ప్లేయర్లు ఆడుకుంటూ ముందుకు సాగితే, ఇంగ్లాండ్ లో గెలవడం చాలా కష్టమవుతుందన్నారు. ఆస్ట్రేలియా వేదికగా టి20 ప్రపంచ కప్ 2028లో జరుగుతుందని… అలాంటప్పుడు బౌన్సీ పిచ్ లు ఉండే ఆస్ట్రేలియా మైదానాలను టీమిండియా ప్లేయర్లు ఎదుర్కోలేక ఇంటిదారి పట్టడం గ్యారంటీ అని హెచ్చరించారు. ఈ క్రమంలో ఇప్పటినుంచే టీమ్ ఇండియా ప్లేయర్లు సాధన చేయాలని కోరారు. ఇక రెండో టి20 మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీని తీసుకుని ఉంటే… టీమిండియా అవలీలగా గెలిచేది అన్నారు.