IND VS AFG: ఆఫ్ఘనిస్తాన్ వర్సెస్ టీమ్ ఇండియా మధ్య జరిగిన మూడు టి20ల సిరీస్ విజయవంతంగా ముగిసింది. నిన్న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా టీమిండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య చిట్టచివరి మ్యాచ్ జరగగా, అందులోనూ శ్రేయస్ అయ్యర్ సేన సూపర్ విక్టరీ అందుకుంది. దీంతో ఆఫ్ఘనిస్తాన్ జట్టును 3-0 తేడాతో వైట్ వాష్ చేసింది టీమిండియా. అయితే, ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత ఆసక్తికర సంఘటన జరిగింది. ట్రోఫీ గెలిచిన సంబరాల్లో టీమిండియా ఉండగా… ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కూడా పాల్గొన్నారు. సంఘటనకు సంబంధించిన ఫోటోలు అలాగే వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీం ఇండియా వర్సెస్ ఆఫ్గనిస్తాన్ మధ్య నిన్న చివరి మ్యాచ్ జరిగింది. ఇప్పటికే వరుసగా నిన్ను మ్యాచ్ లు గెలిచిన టీమిండియా, మూడవ మ్యాచ్ లో కూడా అద్భుతమైన విక్టరీ అందుకుంది. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన టీమిండియా, నిర్ణీత 20 ఓవర్లు ఆడి, 7 వికెట్లు నష్టపోయి ఏకంగా 221 పరుగులు చేసింది. అభిషేక్ శర్మ సెంచరీ చేయగా సంజు శాంసన్ అర్థ సెంచరీ తో ఇరగదీశాడు. ఈ క్రమంలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. ఈ లక్ష్యాన్ని చేదించే క్రమంలో ఎప్పటిలాగా ఆఫ్గనిస్తాన్ చిత్తయింది. 94 పరుగులకు కుప్పకూలింది ఆఫ్గనిస్తాన్. దీంతో 3-0 తేడాతో టి20 సిరీస్ కైవసం చేసుకుంది టీమిండియా.
అయితే మ్యాచ్ ఫినిష్ అయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ట్రోఫీ అందుకొనే క్రమంలో మనసు చాటుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను కూడా స్టేజ్ పైకి ఆహ్వానించాడు. ఆ తర్వాత ఇద్దరు కెప్టెన్లు కలిసి ట్రోఫీని అందుకున్నారు. ఇక టీమిండియా సంబరాలలో కూడా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ పాల్గొన్నారు. ఈ ఫోటో ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే, ఈ సంఘటన చూసిన క్రికెట్ ఫ్యాన్స్ రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. గెలిచిన ట్రోఫీని కూడా ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ కు శ్రేయస్ అయ్యర్ ఇచ్చేశాడని కామెంట్స్ పెడుతున్నారు.
వైట్ వాష్ చేసిన అనంతరం బాధలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ క్రికెటర్ల ముఖాలలో సంతోషం కోసం శ్రేయస్ అయ్యర్ ఈ పని చేశాడని పేర్కొంటున్నారు. అయితే అసలు వాస్తవం అది కాదు. స్పోర్ట్స్ మెన్షిప్ చూపించాలన్న లక్ష్యంతో శ్రేయస్ అయ్యర్ ఈ పని చేశారు. ప్రత్యర్థిని అవమానించకుండా… స్టేజ్ పైకి ఆహ్వానించి మరి ట్రోఫీ అందుకునేలా చేశారు. ఆ తర్వాత టీమిండియా సంబరాలలో కూడా పాల్గొనాలని ఆఫ్గనిస్తాన్ కెప్టెన్ ఇబ్రహీం జర్దాన్ ను ఆహ్వానించి గొప్ప మనసు చాటుకున్నాడు శ్రేయస్ అయ్యర్. ప్రతి సిరీస్ లో కెప్టెన్లు ఇలాగే వ్యవహరించాలని మెసేజ్ ను వదిలాడు. ఈ క్రమంలో శ్రేయస్ అయ్యర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
ఆఫ్గనిస్తాన్ తో జరిగిన మూడవ టి20 సందర్భంగా టీమిండియా డేంజర్ ఆటగాడు అభిషేక్ శర్మ సూపర్ సెంచరీ నమోదు చేశాడు. కేవలం 30 బంతుల్లోనే సెంచరీ చేసి సరికొత్త చరిత్ర సృష్టించాడు.